ఎల్లుండి రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఒక క్రేజీ కంటెంట్ ఆశిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆర్సి 16 టీజర్ కోసం వాళ్ళ ఎదురు చూపులు మాములుగా లేవు. అయితే ఇక్కడో చిక్కు ఉంది. టీజర్ కట్ సిద్ధంగా ఉంది కానీ ఇంకా రీ రికార్డింగ్ మిక్స్ జరగలేదు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ చెన్నైలో అదే పని మీద ఉన్నారట. దర్శకుడు బుచ్చిబాబు అక్కడికి చేరుకున్నట్టు సమాచారం. ఒకవేళ ఇంత తక్కువ టైంలో కనక క్వాలిటీ బిజిఎం ఇచ్చేలా అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మే 27న టైం కొంచెం అటు ఇటు అయినా సరే ఫ్యాన్స్ కి వీడియో కానుక ఇవ్వొచ్చు.
థియేటర్ స్క్రీనింగ్ కి సమయం సరిపోకపోవచ్చు. ఎందుకంటే సెన్సార్ జరగాలి. ఆఘమేఘాల మీద దీన్ని చేయించుకున్నా క్యూబ్ తదితర మాధ్యమాల్లో అప్లోడ్ చేసి థియేటర్లకు అందుబాటులోకి తీసుకురావడం పెద్ద తతంగం. నాయక్ రీ రిలీజ్ ఆడుతున్న చోట వేసినా చాలనేది ఫ్యాన్స్ అభిప్రాయం. అది జరగాలన్నా టీజర్ అనుకున్న స్థాయిలో సంతృప్తికరంగా రెడీ అయిపోవాలి. నెలల తరబడి ప్రచారంలో ఉన్న పెద్ది టైటిల్ నే ఖరారు చేశారని ఇన్ సైడ్ టాక్. అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, టీజర్ చూశాక ఒక్కసారిగా అంచనాలు పెరుగుతాయని అంటున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ రామ్ చరణ్ అమ్మమ్మ (అల్లు రామలింగయ్య గారి సతీమణి) ప్రస్తుతం అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం కొంత నిలకడగా ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితిలో సెలబ్రేషన్ కు చరణ్ ఒప్పుకోకపోవచ్చు. సో జస్ట్ ఆన్ లైన్ లాంఛ్ తో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. గేమ్ ఛేంజర్ చేసిన గాయం, తర్వాత అది ట్రోలింగ్ అయ్యేలా జరిగిన పరిణామాలు మెగా ఫ్యాన్స్ ని కలవరానికి గురి చేశాయి. ఒక్కసారిగా అదంతా మటుమాయం అయ్యే స్థాయిలో పెద్ది టీజర్ వచ్చిందనే మాట వినిపిస్తోంది. విడుదల తేదీ వచ్చే ఏడాది మార్చి 26 అనే ప్రచారం నిజామా కాదా అనేది కూడా తేలిపోవచ్చు.
This post was last modified on March 25, 2025 3:35 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…