ఎల్లుండి రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఒక క్రేజీ కంటెంట్ ఆశిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆర్సి 16 టీజర్ కోసం వాళ్ళ ఎదురు చూపులు మాములుగా లేవు. అయితే ఇక్కడో చిక్కు ఉంది. టీజర్ కట్ సిద్ధంగా ఉంది కానీ ఇంకా రీ రికార్డింగ్ మిక్స్ జరగలేదు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ చెన్నైలో అదే పని మీద ఉన్నారట. దర్శకుడు బుచ్చిబాబు అక్కడికి చేరుకున్నట్టు సమాచారం. ఒకవేళ ఇంత తక్కువ టైంలో కనక క్వాలిటీ బిజిఎం ఇచ్చేలా అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మే 27న టైం కొంచెం అటు ఇటు అయినా సరే ఫ్యాన్స్ కి వీడియో కానుక ఇవ్వొచ్చు.
థియేటర్ స్క్రీనింగ్ కి సమయం సరిపోకపోవచ్చు. ఎందుకంటే సెన్సార్ జరగాలి. ఆఘమేఘాల మీద దీన్ని చేయించుకున్నా క్యూబ్ తదితర మాధ్యమాల్లో అప్లోడ్ చేసి థియేటర్లకు అందుబాటులోకి తీసుకురావడం పెద్ద తతంగం. నాయక్ రీ రిలీజ్ ఆడుతున్న చోట వేసినా చాలనేది ఫ్యాన్స్ అభిప్రాయం. అది జరగాలన్నా టీజర్ అనుకున్న స్థాయిలో సంతృప్తికరంగా రెడీ అయిపోవాలి. నెలల తరబడి ప్రచారంలో ఉన్న పెద్ది టైటిల్ నే ఖరారు చేశారని ఇన్ సైడ్ టాక్. అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, టీజర్ చూశాక ఒక్కసారిగా అంచనాలు పెరుగుతాయని అంటున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ రామ్ చరణ్ అమ్మమ్మ (అల్లు రామలింగయ్య గారి సతీమణి) ప్రస్తుతం అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం కొంత నిలకడగా ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితిలో సెలబ్రేషన్ కు చరణ్ ఒప్పుకోకపోవచ్చు. సో జస్ట్ ఆన్ లైన్ లాంఛ్ తో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. గేమ్ ఛేంజర్ చేసిన గాయం, తర్వాత అది ట్రోలింగ్ అయ్యేలా జరిగిన పరిణామాలు మెగా ఫ్యాన్స్ ని కలవరానికి గురి చేశాయి. ఒక్కసారిగా అదంతా మటుమాయం అయ్యే స్థాయిలో పెద్ది టీజర్ వచ్చిందనే మాట వినిపిస్తోంది. విడుదల తేదీ వచ్చే ఏడాది మార్చి 26 అనే ప్రచారం నిజామా కాదా అనేది కూడా తేలిపోవచ్చు.
This post was last modified on March 25, 2025 3:35 pm
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…