Movie News

విజయ్ చివరి సినిమా….పండగ మొదట్లో

తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమాగా నిర్మాణంలో ఉన్న జన నాయగన్ విడుదల తేదీ వచ్చేసింది. 2026 జనవరి 9న తలపతి లాస్ట్ మూవీ చూడమని పిలుపు ఇచ్చేశారు. ఇది ఇంతకు ముందే లీకైనప్పటికీ ఈ ఏడాది దీపావళికి రావొచ్చని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ నిర్మాతల ప్లాన్లు వేరే ఉన్నాయి. నిజానికి ఈ తేదీ ఎంచుకోవడం వెనుక తెలివైన స్ట్రాటజీ కనిపిస్తోంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) అదే పండక్కు వస్తానని ఎప్పుడో చెప్పింది. కానీ డేట్ నిర్ణయించుకోలేదు. ఇప్పుడు జన నాయగన్ తెలివిగా కర్చీఫ్ వేయడంతో ఇతరులు వేరే తేదీలు చూసుకోవాలి.

ముందు నుంచి ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం జరుగుతున్నా నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అప్పుడప్పుడు పలు సందర్భాల్లో నటీనటులు టెక్నీషియన్లు చూచాయగా చెప్పడం తప్పించి కనీసం ట్రైలర్ వస్తే తప్ప అందులో ఎంత నిజముందో చెప్పలేం. జన నాయగన్ లో పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు మరో కీలక పాత్ర పోషించింది. బాబీ డియోల్, అరుణ్ విజయ్ తదితరులున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా విజయ్ చివరి సినిమా కాబట్టి కోలీవుడ్ లో కనివిని ఎరుగని రిలీజ్ ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కాంపిటీషన్ ఉండకపోవచ్చు.

ఇప్పుడు విజయ్ ఎంట్రీ వల్ల మన సంక్రాంతి రేసులో మొత్తం ముగ్గురున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో సినిమా కూడా ఇదే సీజన్ లో రానుంది. దానికి తగ్గట్టే ప్రణాళికలు వేస్తున్నారు. విజయ్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. హక్కులు పెద్ద సంస్థలే తీసుకుంటాయి. అదే జరిగిన పక్షంలో పోటీ టఫ్ గా ఉంటుంది. రాజకీయ, సామజిక అంశాలు ఎక్కువగా ఉండేలా దర్శకుడు హెచ్ వినోత్ జన నాయగన్ ను తీర్చిదిద్దినట్టు టాక్. నిజంగానే విజయ్ ఇకపై సినిమాలు చేయడా లేక రాజకీయాల్లో సక్సెస్ ఫెయిల్యూర్ ని బట్టి నిర్ణయాలు మార్చుకుంటాడా తేలాలంటే ఎన్నికల దాకా ఆగాలి.

This post was last modified on March 24, 2025 7:09 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

21 minutes ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

9 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

9 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

10 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

10 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

13 hours ago