Movie News

విజయ్ చివరి సినిమా….పండగ మొదట్లో

తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమాగా నిర్మాణంలో ఉన్న జన నాయగన్ విడుదల తేదీ వచ్చేసింది. 2026 జనవరి 9న తలపతి లాస్ట్ మూవీ చూడమని పిలుపు ఇచ్చేశారు. ఇది ఇంతకు ముందే లీకైనప్పటికీ ఈ ఏడాది దీపావళికి రావొచ్చని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ నిర్మాతల ప్లాన్లు వేరే ఉన్నాయి. నిజానికి ఈ తేదీ ఎంచుకోవడం వెనుక తెలివైన స్ట్రాటజీ కనిపిస్తోంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) అదే పండక్కు వస్తానని ఎప్పుడో చెప్పింది. కానీ డేట్ నిర్ణయించుకోలేదు. ఇప్పుడు జన నాయగన్ తెలివిగా కర్చీఫ్ వేయడంతో ఇతరులు వేరే తేదీలు చూసుకోవాలి.

ముందు నుంచి ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం జరుగుతున్నా నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అప్పుడప్పుడు పలు సందర్భాల్లో నటీనటులు టెక్నీషియన్లు చూచాయగా చెప్పడం తప్పించి కనీసం ట్రైలర్ వస్తే తప్ప అందులో ఎంత నిజముందో చెప్పలేం. జన నాయగన్ లో పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు మరో కీలక పాత్ర పోషించింది. బాబీ డియోల్, అరుణ్ విజయ్ తదితరులున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా విజయ్ చివరి సినిమా కాబట్టి కోలీవుడ్ లో కనివిని ఎరుగని రిలీజ్ ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కాంపిటీషన్ ఉండకపోవచ్చు.

ఇప్పుడు విజయ్ ఎంట్రీ వల్ల మన సంక్రాంతి రేసులో మొత్తం ముగ్గురున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో సినిమా కూడా ఇదే సీజన్ లో రానుంది. దానికి తగ్గట్టే ప్రణాళికలు వేస్తున్నారు. విజయ్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. హక్కులు పెద్ద సంస్థలే తీసుకుంటాయి. అదే జరిగిన పక్షంలో పోటీ టఫ్ గా ఉంటుంది. రాజకీయ, సామజిక అంశాలు ఎక్కువగా ఉండేలా దర్శకుడు హెచ్ వినోత్ జన నాయగన్ ను తీర్చిదిద్దినట్టు టాక్. నిజంగానే విజయ్ ఇకపై సినిమాలు చేయడా లేక రాజకీయాల్లో సక్సెస్ ఫెయిల్యూర్ ని బట్టి నిర్ణయాలు మార్చుకుంటాడా తేలాలంటే ఎన్నికల దాకా ఆగాలి.

Kumar

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

26 minutes ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

58 minutes ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

1 hour ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

1 hour ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

3 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

4 hours ago