తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమాగా నిర్మాణంలో ఉన్న జన నాయగన్ విడుదల తేదీ వచ్చేసింది. 2026 జనవరి 9న తలపతి లాస్ట్ మూవీ చూడమని పిలుపు ఇచ్చేశారు. ఇది ఇంతకు ముందే లీకైనప్పటికీ ఈ ఏడాది దీపావళికి రావొచ్చని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ నిర్మాతల ప్లాన్లు వేరే ఉన్నాయి. నిజానికి ఈ తేదీ ఎంచుకోవడం వెనుక తెలివైన స్ట్రాటజీ కనిపిస్తోంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) అదే పండక్కు వస్తానని ఎప్పుడో చెప్పింది. కానీ డేట్ నిర్ణయించుకోలేదు. ఇప్పుడు జన నాయగన్ తెలివిగా కర్చీఫ్ వేయడంతో ఇతరులు వేరే తేదీలు చూసుకోవాలి.
ముందు నుంచి ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం జరుగుతున్నా నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అప్పుడప్పుడు పలు సందర్భాల్లో నటీనటులు టెక్నీషియన్లు చూచాయగా చెప్పడం తప్పించి కనీసం ట్రైలర్ వస్తే తప్ప అందులో ఎంత నిజముందో చెప్పలేం. జన నాయగన్ లో పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు మరో కీలక పాత్ర పోషించింది. బాబీ డియోల్, అరుణ్ విజయ్ తదితరులున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా విజయ్ చివరి సినిమా కాబట్టి కోలీవుడ్ లో కనివిని ఎరుగని రిలీజ్ ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కాంపిటీషన్ ఉండకపోవచ్చు.
ఇప్పుడు విజయ్ ఎంట్రీ వల్ల మన సంక్రాంతి రేసులో మొత్తం ముగ్గురున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో సినిమా కూడా ఇదే సీజన్ లో రానుంది. దానికి తగ్గట్టే ప్రణాళికలు వేస్తున్నారు. విజయ్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. హక్కులు పెద్ద సంస్థలే తీసుకుంటాయి. అదే జరిగిన పక్షంలో పోటీ టఫ్ గా ఉంటుంది. రాజకీయ, సామజిక అంశాలు ఎక్కువగా ఉండేలా దర్శకుడు హెచ్ వినోత్ జన నాయగన్ ను తీర్చిదిద్దినట్టు టాక్. నిజంగానే విజయ్ ఇకపై సినిమాలు చేయడా లేక రాజకీయాల్లో సక్సెస్ ఫెయిల్యూర్ ని బట్టి నిర్ణయాలు మార్చుకుంటాడా తేలాలంటే ఎన్నికల దాకా ఆగాలి.
This post was last modified on March 24, 2025 7:09 pm
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…