Movie News

ప్రభాస్ హీరోయిన్‌కు ‘తెలుగు’ క్లాసులు

సినిమాల్లో అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియాలో సూపర్ పాపులారిటీ ఉన్న అందాల భామల్లో మాళవిక మోహనన్ ఒకరు. ఉత్తరాదికి దిశా పటాని ఎలాగో దక్షిణాదికి మాళవిక అలా అని చెప్పొచ్చు. హాట్ హాట్ ఫొటో షూట్లతో కుర్రకారుకు కిర్రెక్కిస్తూ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది మాళవిక. కానీ ఆమె కోరుకున్న బ్లాక్ బస్టర్ సక్సెస్ మాత్రం ఇంకా దక్కలేదు. ఇప్పటిదాకా ఆమె నటించిన చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. ఈ స్థితిలో తన ఆశలన్నీ ప్రభాస్ మూవీ ‘రాజా సాబ్’ మీదే ఉన్నాయి.

ఈ సినిమా తన కెరీర్‌కు గేమ్ చేంజర్ అవుతుందని ఆమె ఆశిస్తోంది. ఇందులో మాళవిక సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె తెలుగు క్లాసులు కూడా తీసుకుంటోందట. ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ.. ఏ ఇండస్ట్రీలో నటించినా ఆ భాష నేర్చుకుంటే మెరుగ్గా నటించడానికి అవకాశముంటుందని చెప్పింది. అందులోనూ తెలుగు ఇండస్ట్రీ ఎంతో ఎదిగిపోయిందని.. బాలీవుడ్‌తో సమానమైన ఇండస్ట్రీ అదని.. అలాంటపుడు ఆ భాష నేర్చుకుని నటిస్తే మంచిది కదా అని ఆమె వ్యాఖ్యానించింది. అందుకే తెలుగు క్లాసులు తీసుకుని ఆ భాష మీద పట్టు సంపాదిస్తున్నట్లు చెప్పింది.

ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. అతను చాలా రిజర్వ్డ్ పర్సన్ అని.. తన చుట్టూ ఉన్న తక్కువ మందితో మాత్రమే మాట్లాడతాడని మాళవిక వ్యాఖ్యానించింది. ప్రభాస్ వ్యక్తిగా చాలా మంచి వాడని.. తనతో పని చేయడం మంచి అనుభవమని తెలిపింది. ప్రభాస్ పెట్టే ఫుడ్ భలే ఉంటుందని.. చాలా రుచికరంగా వంటలు చేయిస్తాడని మాళవిక వ్యాఖ్యానించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’లో మాళవికతో పాటు నిధి అగర్వాల్ కూడా ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆ చిత్రం విడుదలవుతుంది.

This post was last modified on March 24, 2025 4:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

7 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

14 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago