సినిమాల్లో అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియాలో సూపర్ పాపులారిటీ ఉన్న అందాల భామల్లో మాళవిక మోహనన్ ఒకరు. ఉత్తరాదికి దిశా పటాని ఎలాగో దక్షిణాదికి మాళవిక అలా అని చెప్పొచ్చు. హాట్ హాట్ ఫొటో షూట్లతో కుర్రకారుకు కిర్రెక్కిస్తూ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది మాళవిక. కానీ ఆమె కోరుకున్న బ్లాక్ బస్టర్ సక్సెస్ మాత్రం ఇంకా దక్కలేదు. ఇప్పటిదాకా ఆమె నటించిన చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. ఈ స్థితిలో తన ఆశలన్నీ ప్రభాస్ మూవీ ‘రాజా సాబ్’ మీదే ఉన్నాయి.
ఈ సినిమా తన కెరీర్కు గేమ్ చేంజర్ అవుతుందని ఆమె ఆశిస్తోంది. ఇందులో మాళవిక సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె తెలుగు క్లాసులు కూడా తీసుకుంటోందట. ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ.. ఏ ఇండస్ట్రీలో నటించినా ఆ భాష నేర్చుకుంటే మెరుగ్గా నటించడానికి అవకాశముంటుందని చెప్పింది. అందులోనూ తెలుగు ఇండస్ట్రీ ఎంతో ఎదిగిపోయిందని.. బాలీవుడ్తో సమానమైన ఇండస్ట్రీ అదని.. అలాంటపుడు ఆ భాష నేర్చుకుని నటిస్తే మంచిది కదా అని ఆమె వ్యాఖ్యానించింది. అందుకే తెలుగు క్లాసులు తీసుకుని ఆ భాష మీద పట్టు సంపాదిస్తున్నట్లు చెప్పింది.
ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. అతను చాలా రిజర్వ్డ్ పర్సన్ అని.. తన చుట్టూ ఉన్న తక్కువ మందితో మాత్రమే మాట్లాడతాడని మాళవిక వ్యాఖ్యానించింది. ప్రభాస్ వ్యక్తిగా చాలా మంచి వాడని.. తనతో పని చేయడం మంచి అనుభవమని తెలిపింది. ప్రభాస్ పెట్టే ఫుడ్ భలే ఉంటుందని.. చాలా రుచికరంగా వంటలు చేయిస్తాడని మాళవిక వ్యాఖ్యానించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’లో మాళవికతో పాటు నిధి అగర్వాల్ కూడా ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆ చిత్రం విడుదలవుతుంది.
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ…
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…