ఛలో, భీష్మ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల తన రెండో సినిమా హీరో నితిన్ తో రెండోసారి జత కట్టి రాబిన్ హుడ్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ప్రమోషన్ల పరంగా వెరైటీ స్ట్రాటజీ అనుసరిస్తున్న ఈ బృందం ఇదిదా సర్ప్రైజ్ పాటతో పబ్లిసిటీ బాగానే చేసుకుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఎంటర్ టైనర్ కు జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. పోటీ ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా హిట్టు కొడతామనే నమ్మకం టీమ్ లో కనిపించింది. కంటెంట్ దాచకుండా కథేంటో వీడియోలో చూపించేశారు.
అతని పేరు రామ్ అలియాస్ రాబిన్ హుడ్ (నితిన్). దోచుకురమ్మంటే కాల్చుకు వచ్చే రకం. ఏజెన్సీ నడిపే ఒక పెద్ద మనిషి (రాజేంద్ర ప్రసాద్) దగ్గర పని చేస్తూ ఉంటాడు. దొంగతనాలు, అండర్ కవర్ ఆపరేషన్లతో అలా నెట్టుకుంటూ వస్తున్న రామ్ జీవితంలోకి ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి నీరా వాసుదేవ్ (శ్రీలీల) వస్తుంది. ఆమె సెక్యూరిటీ బాధ్యతను తీసుకుంటాడు. అయితే ఒక మారుమూల కొండప్రాంతంలో చట్టవిరుద్ధంగా మాదకద్రవ్యాలు సాగు చేస్తున్న సామి (దేవదత్త నాగ) సామ్రాజ్యంలోకి రాబిన్ హుడ్ అడుగుపెడతాడు. ఇక అక్కడి నుంచి ఛేజులు, ఫైట్లు. తర్వాత జరిగేదే స్టోరీ..
ఎంటర్ టైన్మెంట్, యాక్షన్, క్రైమ్ అన్ని సమపాళ్లలో మిక్స్ చేసిన వెంకీ కుడుముల ఈసారి బడ్జెట్ స్కేల్ పెంచేసి దానికి తగ్గట్టే క్వాలిటీని చూపించాడు. డైలాగుల్లో తనదైన మార్కు కనిపించింది. ఫోర్ ఫాదర్స్ అంటూ వెన్నెల కిషోర్ వేసిన జోకు, జెడ్ ప్లస్ క్యాటగిరీ కామెడీ వగైరాలు నవ్వించేలా ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా పవర్ ఫుల్ విలన్ బ్లాక్ కూడా సెట్ చేసిన వెంకీ కుడుముల హీరో నితిన్ ని రకరకాల గెటప్స్ లో చూపించాడు. మార్చి 28 విడుదల కాబోతున్న రాబిన్ హుడ్ నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తున్నారో అది ఉందనే నమ్మకం ట్రైలర్ లో ఇచ్చారు. ఇక థియేటర్లో మెప్పించడమే తరువాయి.
This post was last modified on March 23, 2025 10:04 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…