Movie News

మళ్లీ ‘రంగ్ దే’ కాంబో?

కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే.. అందులో హీరో హీరోయిన్ల జంట అందరినీ ఆకట్టుకుంటుంది. వాళ్లను సక్సెస్ ఫుల్ పెయిర్‌గానే చూస్తారు. నితిన్, కీర్తి సురేష్‌లది అలాంటి జంటే అని చెప్పాలి. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘రంగ్ దే’ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఈ మూవీలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ మాత్రం బాగా పండింది. ప్రమోషన్లలో కూడా ఈ జంట హుషారుగా కనిపించింది. ఇద్దరూ మంచి కెమిస్ట్రీతో సినిమాను ప్రమోట్ చేశారు. సినిమాలో కూడా ఇద్దరి మధ్య సన్నివేశాడు బాగానే పండాయి. పాటల్లో కూడా ఈ జంట చూడముచ్చటగా కనిపించింది.

కానీ సినిమా సరిగా ఆడకపోవడంతో మళ్లీ ఈ కాంబినేషన్ చూసే అవకాశం ప్రేక్షకులకు రాలేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా వీళ్లిద్దరూ మళ్లీ జంట కట్టబోతున్నారన్నది తాజా సమాచారం. నితిన్ హీరోగా ‘బలగం’ వేణు దర్శకత్వంలో ‘యల్లమ్మ’ సినిమా త్వరలోనే మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ముందు నానితో అనుకున్నాడు వేణు. కానీ అది కుదరక నితిన్‌తో చేస్తున్నాడు. ఈ చిత్రానికి కథానాయికగా కూడా ముందు అనుకున్నది వేరొకరిని. సాయిపల్లవిని నటింపజేయాలని చూశారు. కానీ ఆమెకు డేట్లు సర్దుబాటు చేయడం కుదర్లేదు. దీంతో ఇప్పుడు కీర్తిని ట్రై చేస్తున్నారట.

ఆమె దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో మళ్లీ ‘రంగ్ దే’ జోడీని చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే రగ్డ్ మూవీ అని సమాచారం. ‘దసరా’ స్టయిల్లో ఉంటుందట. హీరో హీరోయిన్లిద్దరూ డీగ్లామరస్ రోల్స్‌లో కనిపిస్తారట. ‘రంగ్ దే’లో చాలా అందంగా కనిపించిన జంట.. ఈసారి భిన్న అవతారాల్లో కనిపించనుందన్నమాట. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. వేసవిలో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రావచ్చు.

This post was last modified on March 23, 2025 3:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

40 minutes ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

3 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

4 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

5 hours ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

5 hours ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

5 hours ago