2019 ఎన్నికల ముంగిట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ముందు ఈ హత్యకు కారకుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అని వైకాపా ప్రచారం చేసింది కానీ.. చివరికి ఈ కేసు వైఎస్ జగన్, ఆయన సోదరుడు వైఎస్ అవినాష్ల మెడకే చుట్టుకుంది. 2019 ఎన్నికల్లో విజయానికి తోడ్పడ్డ ఈ కేసే.. తర్వాత ప్రతికూలంగా మారి, 2024 ఎన్నికల్లో ఓటమికి కొంత మేర కారణమైంది. గత ఏడాది వివేకా హత్య ఉదంతం మీద తీసిన ‘వివేకం’ సినిమా వైసీపీకి ఎంతగా డ్యామేజ్ చేసిందో అందరికీ తెలిసిందే.
ఈ హత్య చేయించింది అవినాష్, సపోర్ట్ చేసింది జగన్ అనిపించేలా ఈ సినిమాలో చూపించిన సన్నివేశాలు సంచలనం రేపాయి. నేరుగా ఆన్ల లైన్లో ఫ్రీగా రిలీజ్ చేసి వైసీపీకి ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేశారు దాని మేకర్స్. ఐతే వివేకా హత్య ఆధారంగా ఇటీవల ‘హత్య’ అనే మరో చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని వైసీపీ అనుకూల వ్యక్తులు రూపొందించారు. ‘వివేకం’కు దీన్ని కౌంటర్ మూవీగా చెప్పొచ్చు. ఈ కేసులో జగన్, అవినాష్ ప్రమేయం ఏమీ లేదని.. హత్యకు కారణం ఆస్తి తగాదాలు, ఆర్థిక వ్యవహారాలే అన్నట్లుగా ఇందులో చూపించారు. ఐతే ‘వివేకం’లా ఈ చిత్రం పాపులర్ కాలేకపోయింది.
కాగా ఈ సినిమా విషయంలో వివేకా హత్య కేసు నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ హర్టయ్యారు. తనను, తన తల్లిని కించపరిచేలా చూపించారంటూ ఈ సినిమాలో చిత్రీకరించారంటూ అతను ‘హత్య’ మేకర్స్ మీద కేసు పెట్టాడు. కడప ఎస్పీతో పాటు పులివెందుల డీఎస్పీని కలిసి అతను ఫిర్యాదు చేశాడు. తనతో పాటు తన తల్లి వ్యక్తిత్వ హననం చేస్తున్నారని.. ఇలా చేస్తున్న వారి బండారం బయటపెడతానని సునీల్ యాదవ్ అన్నాడు. తాను 36 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నానని.. ఆ సమయంలో తన తండ్రిని కూడా కోల్పోయానని సునీల్ యాదవ్ చెప్పాడు. ఈ కేసుకు సంబంధించి ‘హత్య’ సినిమా దర్శక నిర్మాతలతో పాటు ఈ సినిమా సన్నివేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైఎస్ అవినాష్ యూత్ ప్రతినిధులను అతను నిందితులుగా చేర్చాడు.
This post was last modified on March 23, 2025 1:48 pm
స్టార్ వారసులు ఫ్యామిలీ లెగసిని కొనసాగించే క్రమంలో తాతలు, తండ్రుల బ్లాక్ బస్టర్స్ రీమేక్ చేయడం అభిమానులు కోరుకుంటారు. కానీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి సెలవు రోజు ఆదివారం ఎంచక్కా ఆధ్మాత్మీక పర్యటనకు వెళ్లారు.…
దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే ప్యాన్ ఇండియా సినిమా తాలూకు ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దానికి…
దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంలో కలిసి పోరాటం చేసేందుకు సిద్ధమన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్…
మే 30 విడుదల కాబోతున్న కింగ్ డమ్ కౌంట్ డౌన్ ఇంకో అరవై ఏడు రోజులు మాత్రమే ఉంది. విజయ్…
తమిళ స్టార్ హీరో కార్తి ప్రధాన పాత్రలో లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘ఖైదీ’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. దీనికి…