తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టిన చాలామంది ఉత్తరాది హీరోయిన్లు ఇక్కడి అమ్మాయిల్లా మారిపోయిన వారే. అందరికీ నమస్కారం అని కష్టపడి రెండు ముక్కలు తెలుగు మాట్లాడే టైపు హీరోయిన్లు కాదు వీళ్లు. కొంత కాలంలోనే తెలుగులో పట్టు సంపాదించి చక్కగా మన భాషలో మాట్లాడుతూ మన అభిమానుల మనసు దోచిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. తమన్నా, రకుల్ ప్రీత్, రాశి ఖన్నా.. ఇలా ఈ జాబితాలో చాలామందే కనిపిస్తారు. వీరిలో తమన్నా కెరీర్ ఆరంభంలోనే తెలుగు మీద పట్టు సంపాదించింది. పలు చిత్రాల్లో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది.
ఆమె అత్యధికంగా సినిమాలు చేసింది కూడా తెలుగునే అన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య టాలీవుడ్లో ఆమె సినిమాలు తగ్గాయి. తన కొత్త చిత్రం ఓదెల-2 మంచి బజ్ తెచ్చుకుని ఏప్రిల్ 17న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర బృందం ప్రెస్ మీట్ పెట్టగా.. అందులో తనకున్న తెలుగు ఐడెంటిటీ గురించి తమన్నా మాట్లాడింది. తాను దేశంలో ఎక్కడికి వెళ్లినా తెలుగమ్మాయిలాగే చూస్తారని తమన్నా వ్యాఖ్యానించింది. అలాగే తనకు తాను తెలుగమ్మాయిలా ఫీలవుతానని చెప్పింది. తెలుగు సినిమాలతో, ఇక్కడి అభిమానులతో తనకు అంతగా కనెక్షన్ ఉందని తమన్నా వ్యాఖ్యానించింది.
తాను తెలుగుకు ఎంతగా అలవాటు పడిపోయానో చెబుతూ.. తనకు కోపం వస్తే తిట్లు కూడా తెలుగులోనే వస్తున్నాయని ఆమె వెల్లడించింది. ఈ మధ్య ఓ సందర్భంలో తన డ్రైవర్ మీద కోపం వస్తే తెలుగులోనే తిట్టు వచ్చిందని.. అప్పుడే తన జీవితంలో తెలుగు ఎలా అంతర్భాగం అయిపోయిందో అర్థమైందని తమన్నా చెప్పింది. ఇక ఈ ఈవెంట్లో చిత్ర నిర్మాత, కథకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. తమన్నా డెడికేషన్ ఎలాంటిదో చెప్పాడు. రచ్చ సినిమాలో వాన పాట కోసం తమన్నా ఎంత కష్టపడిందో తనకు మాత్రమే తెలుసని చెప్పాడు. ఓదెల-2 షూటింగ్లో హెవీ కాస్ట్యూమ్స్ వేసుకుని 47 డిగ్రీల ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా షూటింగ్లో పాల్గొందని.. పదేళ్ల ముందు రచ్చ సినిమా టైంలో ఎలాంటి డెడికేషన్ ఉండేదో.. ఇప్పుడూ అంతే అని.. ఎంత పెద్ద స్టార్ అయినా తనలో ఏ మార్పూ లేదని సంపత్ చెప్పాడు.
This post was last modified on March 23, 2025 6:08 am
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…
కవితకు, షర్మిలకు మధ్య పోలిక పెట్టొద్దని ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత…