తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టిన చాలామంది ఉత్తరాది హీరోయిన్లు ఇక్కడి అమ్మాయిల్లా మారిపోయిన వారే. అందరికీ నమస్కారం అని కష్టపడి రెండు ముక్కలు తెలుగు మాట్లాడే టైపు హీరోయిన్లు కాదు వీళ్లు. కొంత కాలంలోనే తెలుగులో పట్టు సంపాదించి చక్కగా మన భాషలో మాట్లాడుతూ మన అభిమానుల మనసు దోచిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. తమన్నా, రకుల్ ప్రీత్, రాశి ఖన్నా.. ఇలా ఈ జాబితాలో చాలామందే కనిపిస్తారు. వీరిలో తమన్నా కెరీర్ ఆరంభంలోనే తెలుగు మీద పట్టు సంపాదించింది. పలు చిత్రాల్లో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది.
ఆమె అత్యధికంగా సినిమాలు చేసింది కూడా తెలుగునే అన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య టాలీవుడ్లో ఆమె సినిమాలు తగ్గాయి. తన కొత్త చిత్రం ఓదెల-2 మంచి బజ్ తెచ్చుకుని ఏప్రిల్ 17న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర బృందం ప్రెస్ మీట్ పెట్టగా.. అందులో తనకున్న తెలుగు ఐడెంటిటీ గురించి తమన్నా మాట్లాడింది. తాను దేశంలో ఎక్కడికి వెళ్లినా తెలుగమ్మాయిలాగే చూస్తారని తమన్నా వ్యాఖ్యానించింది. అలాగే తనకు తాను తెలుగమ్మాయిలా ఫీలవుతానని చెప్పింది. తెలుగు సినిమాలతో, ఇక్కడి అభిమానులతో తనకు అంతగా కనెక్షన్ ఉందని తమన్నా వ్యాఖ్యానించింది.
తాను తెలుగుకు ఎంతగా అలవాటు పడిపోయానో చెబుతూ.. తనకు కోపం వస్తే తిట్లు కూడా తెలుగులోనే వస్తున్నాయని ఆమె వెల్లడించింది. ఈ మధ్య ఓ సందర్భంలో తన డ్రైవర్ మీద కోపం వస్తే తెలుగులోనే తిట్టు వచ్చిందని.. అప్పుడే తన జీవితంలో తెలుగు ఎలా అంతర్భాగం అయిపోయిందో అర్థమైందని తమన్నా చెప్పింది. ఇక ఈ ఈవెంట్లో చిత్ర నిర్మాత, కథకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. తమన్నా డెడికేషన్ ఎలాంటిదో చెప్పాడు. రచ్చ సినిమాలో వాన పాట కోసం తమన్నా ఎంత కష్టపడిందో తనకు మాత్రమే తెలుసని చెప్పాడు. ఓదెల-2 షూటింగ్లో హెవీ కాస్ట్యూమ్స్ వేసుకుని 47 డిగ్రీల ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా షూటింగ్లో పాల్గొందని.. పదేళ్ల ముందు రచ్చ సినిమా టైంలో ఎలాంటి డెడికేషన్ ఉండేదో.. ఇప్పుడూ అంతే అని.. ఎంత పెద్ద స్టార్ అయినా తనలో ఏ మార్పూ లేదని సంపత్ చెప్పాడు.
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…
కరోనా తర్వాత ఫ్యామిలీ మ్యాన్, మిర్జాపూర్, స్కామ్ 1992 లాంటి బ్లాక్ బస్టర్స్ వల్ల కొంత కాలం వెబ్ సిరీస్…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా నెట్ ఫ్లిక్స్ చేసుకునే ఓటిటి విండో 28 రోజులు ఉంటుంది. గుంటూరు కారం,…
తెలంగాణలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు…
సుకుమార్ అంటే ఇప్పుడు కేవలం ఒక దర్శకుడు కాదు.. ఒక వ్యవస్థ. కేవలం దర్శకత్వానికి పరిమితం కాకుండా ఆయన నిర్మాతగానూ…
ఇండియాలో క్రికెట్ పిచ్చి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందున్నంత ఇంటెన్స్ ఫ్యాన్స్ ఇప్పుడు లేకపోవచ్చు. ఒక ఓటమితో…