మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది మార్చి 26 విడుదలవుతుందనే లీక్ అభిమానుల్లో చర్చకు దారి తీసింది. ఈ సంవత్సరమే వస్తుందని భావిస్తే ఇంత ఆలస్యమవుతుందా అంటూ ఫీలవుతున్నారు. అయితే చిరంజీవి విశ్వంభర, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు, వరుణ్ తేజ్ – మేర్లపాక గాంధీ చిత్రం ఇలా వరసగా మెగా కాంపౌండ్ సినిమాలు రాబోయే ఆరేడు నెలల్లో వస్తున్నాయి కాబట్టి ఆర్సి 16 వాయిదా గురించి మెగా ఫ్యాన్స్ కి మరీ దిగులు అక్కర్లేదు. ఇదంతా పక్కన పెడితే పోస్ట్ పోన్ అసలు కహాని వేరే వినిపిస్తోంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఆర్సి 16 ముందు ఈ ఏడాదే రిలీజ్ చేద్దామనుకున్నారు. ఓటిటి డీల్ కోసం సోని లివ్ చాలా పెద్ద మొత్తం ఆఫర్ చేసిందట. ఈ సంస్థ అంతర్జాతీయంగా పెద్దదే అయినా డిజిటల్ మార్కెట్ లో వెనుకబడే ఉంది. దాన్ని బలపరుచుకునే క్రమంలో ఆర్సి 16 ని మొదటి అడుగుగా వేద్దామనుకుని ప్లాన్ చేసింది. అయితే రామ్ చరణ్ వ్యక్తిగతంగా నెట్ ఫ్లిక్స్ అయితే తన సినిమాకు గ్లోబల్ రీచ్ వస్తుందని భావించి ముందు వాళ్ళను కనుక్కోమని నిర్మాతలను అడిగాడట. కానీ 2025 క్యాలెండర్ లో నెట్ ఫ్లిక్స్ కొత్త సినిమాలకు చోటు లేదు. 2026 అయితే డీల్ చేసుకుందామని సోని కన్నా కొంచెం తక్కువే ఆఫర్ చేసిందట.
అయినా పర్వాలేదని చరణ్ ప్రోద్బలంతోనే థియేటర్ రిలీజ్ ని వచ్చే ఏడాది మార్చికి మార్చారని తెలిసింది. గత రెండేళ్లుగా నెట్ ఫ్లిక్స్ జోరు మాములుగా లేదు. నాన్ స్టాప్ గా తెలుగు తమిళ సినిమాలు కొనుక్కుంటూ దూకుడు చూపిస్తోంది. ఆర్ఆర్ఆర్ రీచ్ దేశదేశాలు తిరిగిందంటే దానికి ప్రధాన కారణం ఈ ఓటిటినే. డాకు మహారాజ్, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, పుష్ప 2 లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న నెట్ ఫ్లిక్స్ కే ఆర్సి 16 ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఇదంతా అఫీషియల్ గా బయటికొచ్చింది కాదు కానీ అంతర్గత సమాచారమైతే ఇలా ఉంది. చరణ్ పుట్టినరోజు రాబోయే గురువారమే కాబట్టి క్లారిటీ రావొచ్చు.
This post was last modified on March 22, 2025 11:21 am
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…