మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది మార్చి 26 విడుదలవుతుందనే లీక్ అభిమానుల్లో చర్చకు దారి తీసింది. ఈ సంవత్సరమే వస్తుందని భావిస్తే ఇంత ఆలస్యమవుతుందా అంటూ ఫీలవుతున్నారు. అయితే చిరంజీవి విశ్వంభర, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు, వరుణ్ తేజ్ – మేర్లపాక గాంధీ చిత్రం ఇలా వరసగా మెగా కాంపౌండ్ సినిమాలు రాబోయే ఆరేడు నెలల్లో వస్తున్నాయి కాబట్టి ఆర్సి 16 వాయిదా గురించి మెగా ఫ్యాన్స్ కి మరీ దిగులు అక్కర్లేదు. ఇదంతా పక్కన పెడితే పోస్ట్ పోన్ అసలు కహాని వేరే వినిపిస్తోంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఆర్సి 16 ముందు ఈ ఏడాదే రిలీజ్ చేద్దామనుకున్నారు. ఓటిటి డీల్ కోసం సోని లివ్ చాలా పెద్ద మొత్తం ఆఫర్ చేసిందట. ఈ సంస్థ అంతర్జాతీయంగా పెద్దదే అయినా డిజిటల్ మార్కెట్ లో వెనుకబడే ఉంది. దాన్ని బలపరుచుకునే క్రమంలో ఆర్సి 16 ని మొదటి అడుగుగా వేద్దామనుకుని ప్లాన్ చేసింది. అయితే రామ్ చరణ్ వ్యక్తిగతంగా నెట్ ఫ్లిక్స్ అయితే తన సినిమాకు గ్లోబల్ రీచ్ వస్తుందని భావించి ముందు వాళ్ళను కనుక్కోమని నిర్మాతలను అడిగాడట. కానీ 2025 క్యాలెండర్ లో నెట్ ఫ్లిక్స్ కొత్త సినిమాలకు చోటు లేదు. 2026 అయితే డీల్ చేసుకుందామని సోని కన్నా కొంచెం తక్కువే ఆఫర్ చేసిందట.
అయినా పర్వాలేదని చరణ్ ప్రోద్బలంతోనే థియేటర్ రిలీజ్ ని వచ్చే ఏడాది మార్చికి మార్చారని తెలిసింది. గత రెండేళ్లుగా నెట్ ఫ్లిక్స్ జోరు మాములుగా లేదు. నాన్ స్టాప్ గా తెలుగు తమిళ సినిమాలు కొనుక్కుంటూ దూకుడు చూపిస్తోంది. ఆర్ఆర్ఆర్ రీచ్ దేశదేశాలు తిరిగిందంటే దానికి ప్రధాన కారణం ఈ ఓటిటినే. డాకు మహారాజ్, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, పుష్ప 2 లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న నెట్ ఫ్లిక్స్ కే ఆర్సి 16 ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఇదంతా అఫీషియల్ గా బయటికొచ్చింది కాదు కానీ అంతర్గత సమాచారమైతే ఇలా ఉంది. చరణ్ పుట్టినరోజు రాబోయే గురువారమే కాబట్టి క్లారిటీ రావొచ్చు.
This post was last modified on March 22, 2025 11:21 am
ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు వెళ్లేది లేదని.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ భీష్మించిన విషయం…
రాజకీయాల్లో కొన్ని ప్రాంతాల పేరు విన్నంతనే…కొన్ని పార్టీల పేర్లు, కొందరు రాజకీయ నేతల పేర్లు ఠక్కున గుర్తుకు వస్తాయి. ఆ…
ఏపీలో వైసీపీ విపక్ష స్థానంలోరి మారిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ కూడా 6 నెలలకు ముందుగానే విపక్షంలోనే మారిపోయింది. విడదీయ లేనంత…
స్టార్ వారసులు ఫ్యామిలీ లెగసిని కొనసాగించే క్రమంలో తాతలు, తండ్రుల బ్లాక్ బస్టర్స్ రీమేక్ చేయడం అభిమానులు కోరుకుంటారు. కానీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి సెలవు రోజు ఆదివారం ఎంచక్కా ఆధ్మాత్మీక పర్యటనకు వెళ్లారు.…
దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే ప్యాన్ ఇండియా సినిమా తాలూకు ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దానికి…