హీరోగా విలన్ గా తెరమీద కనిపించడం బాగా తగ్గించేసిన దగ్గుబాటి రానా తండ్రి సురేష్ బాబు బాటలోనే ప్రొడక్షన్ ని సీరియస్ గా తీసుకున్నాడు. కంటెంట్ ని నమ్ముకుని కమర్షియల్ ఫార్ములాకు దూరంగా తెలుగు సినిమాని కొత్త ట్రెండ్ వైపు నడిపించే ప్రయత్నాలు బలంగా చేస్తున్నాడు. స్టార్ క్యాస్టింగ్ ని పెట్టుకునే స్థాయి ఉన్నప్పటికీ క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యమని నమ్మి కేరాఫ్ కంచరపాలెం నుంచి 35 చిన్న కథ కాదు దాకా తను చేసిన ప్రయోగాలు హిట్లతో పాటు అవార్డులనూ తీసుకొచ్చాయి. తాజాగా ఇంకో అడుగు ముందుకేసి ప్యాన్ ఇండియాని మించి గ్లోబల్ స్టేజి వైపు పరుగులు పెడుతున్నాడు.
ఇండో అమెరికన్ దర్శకుడు బెన్ రేఖీతో రానా ఒక ప్రాజెక్టు లాక్ చేసుకున్నట్టు సమాచారం. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. బెన్ రేఖీ ట్రాక్ రికార్డు మామూలుది కాదు. న్యూ యార్క్ యునివర్సిటి టిస్చ్ స్కూల్ అఫ్ ఆర్ట్స్ నుంచి పట్టభద్రుడైన ఇతను సుప్రసిద్ధ వార్నర్ బ్రోస్ నుంచి గ్రాంట్ అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడిగా తక్కువ వయసులోనే పేరు తెచ్చుకున్నాడు. 2004 బాంబ్ ది సిస్టమ్ తో నిర్మాణంలో అడుగు పెట్టి 2005 వాటర్ బోర్న్ తో మెగా ఫోన్ చేపట్టాడు. 2016 మన దేశంలోనే షూట్ చేసిన ది ఆశ్రమ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2019 వాచ్ లిస్ట్ సైతం క్లాసిక్ గా నిలిచింది.
ఈ లెక్కన రానా ఎంచుకున్నది ఆషామాషీ వ్యక్తిని కాదనే విషయం అర్థమైపోయిందిగా. జానర్ తదితర వివరాలు ఇంకా తెలియదు కానీ బడ్జెట్ మాత్రం భారీగా ఉండబోతోంది. ఖర్చు విషయంలో చాలా ప్లాన్డ్ గా ఉండే రానా ఇప్పుడీ ఇండో ఇంగ్లీష్ మూవీకి ఎంత పెట్టబోతున్నాడో చూడాలి. యాక్టింగ్ కన్నా ప్రొడక్షన్ ని ఎక్కువ సీరియస్ గా తీసుకుంటున్న రానా ఆ మధ్య తేజతో రాక్షస రాజు అనే సినిమా ప్రకటించాడు కానీ అది సెట్స్ కి వెళ్లిందో లేదో తెలియకుండానే ఆగిపోయింది. చిన్నికృష్ణ ఇచ్చిన కథతో ఒక సినిమా చేయొచ్చనే టాక్ వచ్చినా అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. టైం పట్టేలా ఉంది.
This post was last modified on March 22, 2025 10:25 am
తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టిన చాలామంది ఉత్తరాది హీరోయిన్లు ఇక్కడి అమ్మాయిల్లా మారిపోయిన వారే. అందరికీ నమస్కారం అని కష్టపడి…
మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. ఎల్-2: ఎంపురాన్. ఆ ఇండస్ట్రీలో అత్యధిక హైప్ తెచ్చుకున్న సినిమా కూడా…
విశాఖపట్టణంలోని సుందర తీరం రిషికొండ బీచ్ కు తిరిగి బ్లూఫాగ్ గుర్తింపు దక్కింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఈ…
ఏపీలోని కూటమి ప్రభుత్వం.. త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన చేస్తుందా? లేక.. మంత్రివర్గంలో కూర్పు వరకు పరిమితం అవుతుందా? అంటే..…
అగ్ర రాజ్యం అమెరికాలో డబ్బులిచ్చి పౌరసత్వం కొనుక్కొనే వెసులుబాటు అప్పుడే మొదలైపోయింది. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే... గోల్డ్ కార్డ్…
పీకే.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటి. 2014లో వచ్చిన ఈ చిత్రం ఆల్ టైం బ్లాక్…