బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారంటూ టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపైనా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో హీరో విజయ్ దేవరకొండతో పాటు రానా దగ్గుబాటి, ప్రణీత, ప్రకాశ్ రాజ్ సహా ఇంకా చాలా మందే ఉన్నారు. వీరిలో యాంకర్ శ్యామల కూడా ఉన్నారు. అయితే ఈ కేసులకు వీరిలో ఏ ఎవ్వరూ పెద్దగా భయపడలేదు. అయితే ఒక్క యాంకర్ శ్యామల మాత్రం తనపై కేసు నమోదు అయ్యిందని తెలియగానే వణికిపోయినట్లున్నారు.
అందుకే కాబోలు…అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆమె ఏకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి ఉపశమనం కూడా సాధించారు. అయితే విచారణకు మాత్రం హాజరుకావాల్సిందేనని… అది కూడా సోమవారమే పోలీసుల వద్దకు వెళ్లాలని ఆమెకు కోర్టు షాకిచ్చింది. కోర్టులో ఏకంగా ఈ కేసును కొట్టివేయాలంటూ శ్యామల కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసును కొట్టేయడం కుదరదని కోర్టు తేల్చిచెప్పింది. అంతేకాకుండా పోలీసుల విచారణకు సహకరించి తీరాల్సిందేనని కూడా ఆదేశించింది. అరెస్టు నుంచి మాత్రమే శ్యామలకు కోర్టు ఊరటనిచ్చింది.
అయినా ఈ కేసులో శ్యామలతో పాటు చాలా మందే ఉన్నారు కదా. యాంకర్ విష్ణుప్రియతో పాటు రీతూ చౌదరి కూడా గురువారమే పోలీసుల విచారణకు హాజరయ్యారు. తమకు తెలిసిన వివరాలు చెప్పారు. పోలీసులు ఇవ్వమన్న సెల్ ఫోన్లను కూడా ఇచ్చేసి వచ్చారు. వీరిని పోలీసులేమీ అరెస్టు చేయలేదు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్ లు సోషల్ మీడియా వేదికగా తమ వివరణలు జారీ చేశారు. పోలీసులు పిలిస్తే విచారణకు వెళ్లేందుకు కూడా వారు సిద్ధంగానే ఉన్నారని చెప్పాలి. మరి శ్యామల ఒక్కరే ఎందుకు అంతగా భయపడి కోర్టును ఆశ్రయించారన్నది ప్రశ్నగా మారింది.
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…