బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారంటూ టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపైనా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో హీరో విజయ్ దేవరకొండతో పాటు రానా దగ్గుబాటి, ప్రణీత, ప్రకాశ్ రాజ్ సహా ఇంకా చాలా మందే ఉన్నారు. వీరిలో యాంకర్ శ్యామల కూడా ఉన్నారు. అయితే ఈ కేసులకు వీరిలో ఏ ఎవ్వరూ పెద్దగా భయపడలేదు. అయితే ఒక్క యాంకర్ శ్యామల మాత్రం తనపై కేసు నమోదు అయ్యిందని తెలియగానే వణికిపోయినట్లున్నారు.
అందుకే కాబోలు…అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆమె ఏకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి ఉపశమనం కూడా సాధించారు. అయితే విచారణకు మాత్రం హాజరుకావాల్సిందేనని… అది కూడా సోమవారమే పోలీసుల వద్దకు వెళ్లాలని ఆమెకు కోర్టు షాకిచ్చింది. కోర్టులో ఏకంగా ఈ కేసును కొట్టివేయాలంటూ శ్యామల కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసును కొట్టేయడం కుదరదని కోర్టు తేల్చిచెప్పింది. అంతేకాకుండా పోలీసుల విచారణకు సహకరించి తీరాల్సిందేనని కూడా ఆదేశించింది. అరెస్టు నుంచి మాత్రమే శ్యామలకు కోర్టు ఊరటనిచ్చింది.
అయినా ఈ కేసులో శ్యామలతో పాటు చాలా మందే ఉన్నారు కదా. యాంకర్ విష్ణుప్రియతో పాటు రీతూ చౌదరి కూడా గురువారమే పోలీసుల విచారణకు హాజరయ్యారు. తమకు తెలిసిన వివరాలు చెప్పారు. పోలీసులు ఇవ్వమన్న సెల్ ఫోన్లను కూడా ఇచ్చేసి వచ్చారు. వీరిని పోలీసులేమీ అరెస్టు చేయలేదు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్ లు సోషల్ మీడియా వేదికగా తమ వివరణలు జారీ చేశారు. పోలీసులు పిలిస్తే విచారణకు వెళ్లేందుకు కూడా వారు సిద్ధంగానే ఉన్నారని చెప్పాలి. మరి శ్యామల ఒక్కరే ఎందుకు అంతగా భయపడి కోర్టును ఆశ్రయించారన్నది ప్రశ్నగా మారింది.
This post was last modified on March 21, 2025 8:03 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…