ఇవాళ ఎవడే సుబ్రహ్మణ్యంని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్నీమధ్యే ఈవెంట్ చేసి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నాని, విజయ్ దేవరకొండ రీ యూనియన్ తో పాటు వేడుక తాలూకు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తిరిగాయి. అసలే నాని మంచి ఊపులో ఉన్న టైం. హీరోగా నిర్మాతగా వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇంకోవైపు విజయ్ దేవరకొండని లైగర్, ఫ్యామిలీ స్టార్ తర్వాత మళ్ళీ తెరమీద చూడలేదు. కింగ్ డమ్ కు ఇంకా టైం ఉంది కాబట్టి ఫ్యాన్స్ కి ఇది మంచి జ్ఞాపకంగా ఉంటుందని అందరూ అనుకున్నారు.
కట్ చేస్తే ఎవడే సుబ్రహ్మణ్యంకు ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. హైదరాబాద్ భ్రమరాంబ, వైజాగ్ లాంటి కొన్ని మెయిన్ సెంటర్లలో తప్ప మిగిలిన చోట టికెట్లు అంతంతమాత్రంగానే తెగాయి. కారణం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ దూకుడు. ఇంకోవైపు తొమ్మిదికి పైగా కొత్త రిలీజులు. అసలే ఎవడే సుబ్రహ్మణ్యం ఎమోషనల్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్, విజిల్స్ వేయించే మాస్ ఎపిసోడ్స్ ఉండవు. ఫీల్ గుడ్ మూమెంట్స్ తో పాటు భావోద్వేగాలకు గురి చేసే సీన్లు, మంచి పాటలు ఉంటాయి. కానీ థియేటర్లలో అల్లరి చేస్తూ సందడి చేయాలనుకునే ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ ఉండదు.
ఒకవేళ మరో సందర్భంలో వచ్చి ఉంటే ఎవడే సుబ్రహ్మణ్యంకు మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి స్పందన దక్కేదేమో. అందుకే టైమింగ్ ముఖ్యమని చెప్పేది. నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆ మధ్య సోషల్ మీడియాలో అర్థం లేని కారణాలతో ఫ్యాన్ వార్లు చేసుకున్న సంగతి తెలిసిందే. వాళ్ళను కలిపేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందనుకుంటే ఇలా జరగడం ఊహించనిది. కల్కి 2898 ఏడి దర్శకుడు నాగ్ అశ్విన్ డెబ్యూగానూ దీనికి ప్రత్యేకత ఉంది. అన్నట్టు పదేళ్ల క్రితం ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ రోజే నాని మరో సినిమా జెండాపై కపిరాజు విడుదలయ్యింది. కాకపోతే అది డిజాస్టరయ్యింది.
This post was last modified on March 21, 2025 5:35 pm
బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత హీరో ప్రభాస్ ఒక ఇంట్రెస్టింగ్ కెరీర్ ఫేజ్ చూశాడు. ఒక టాప్ డైరెక్టర్ క్రియేట్ చేసిన…
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…