ఇవాళ ఎవడే సుబ్రహ్మణ్యంని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్నీమధ్యే ఈవెంట్ చేసి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నాని, విజయ్ దేవరకొండ రీ యూనియన్ తో పాటు వేడుక తాలూకు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తిరిగాయి. అసలే నాని మంచి ఊపులో ఉన్న టైం. హీరోగా నిర్మాతగా వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇంకోవైపు విజయ్ దేవరకొండని లైగర్, ఫ్యామిలీ స్టార్ తర్వాత మళ్ళీ తెరమీద చూడలేదు. కింగ్ డమ్ కు ఇంకా టైం ఉంది కాబట్టి ఫ్యాన్స్ కి ఇది మంచి జ్ఞాపకంగా ఉంటుందని అందరూ అనుకున్నారు.
కట్ చేస్తే ఎవడే సుబ్రహ్మణ్యంకు ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. హైదరాబాద్ భ్రమరాంబ, వైజాగ్ లాంటి కొన్ని మెయిన్ సెంటర్లలో తప్ప మిగిలిన చోట టికెట్లు అంతంతమాత్రంగానే తెగాయి. కారణం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ దూకుడు. ఇంకోవైపు తొమ్మిదికి పైగా కొత్త రిలీజులు. అసలే ఎవడే సుబ్రహ్మణ్యం ఎమోషనల్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్, విజిల్స్ వేయించే మాస్ ఎపిసోడ్స్ ఉండవు. ఫీల్ గుడ్ మూమెంట్స్ తో పాటు భావోద్వేగాలకు గురి చేసే సీన్లు, మంచి పాటలు ఉంటాయి. కానీ థియేటర్లలో అల్లరి చేస్తూ సందడి చేయాలనుకునే ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ ఉండదు.
ఒకవేళ మరో సందర్భంలో వచ్చి ఉంటే ఎవడే సుబ్రహ్మణ్యంకు మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి స్పందన దక్కేదేమో. అందుకే టైమింగ్ ముఖ్యమని చెప్పేది. నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆ మధ్య సోషల్ మీడియాలో అర్థం లేని కారణాలతో ఫ్యాన్ వార్లు చేసుకున్న సంగతి తెలిసిందే. వాళ్ళను కలిపేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందనుకుంటే ఇలా జరగడం ఊహించనిది. కల్కి 2898 ఏడి దర్శకుడు నాగ్ అశ్విన్ డెబ్యూగానూ దీనికి ప్రత్యేకత ఉంది. అన్నట్టు పదేళ్ల క్రితం ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ రోజే నాని మరో సినిమా జెండాపై కపిరాజు విడుదలయ్యింది. కాకపోతే అది డిజాస్టరయ్యింది.
This post was last modified on March 21, 2025 5:35 pm
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…
రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వచ్చే ఎన్నికల్లోనే రాహుల్ ను ప్రదానిని చేసేందుకు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపట్టిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు…
తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా కచ్చితంగా ఉంటుంది. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు కెరీర్ పీక్స్లో ఉండగా…
ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం ఓ కీలక భేటీ జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు…