ఇవాళ ఎవడే సుబ్రహ్మణ్యంని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్నీమధ్యే ఈవెంట్ చేసి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నాని, విజయ్ దేవరకొండ రీ యూనియన్ తో పాటు వేడుక తాలూకు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తిరిగాయి. అసలే నాని మంచి ఊపులో ఉన్న టైం. హీరోగా నిర్మాతగా వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇంకోవైపు విజయ్ దేవరకొండని లైగర్, ఫ్యామిలీ స్టార్ తర్వాత మళ్ళీ తెరమీద చూడలేదు. కింగ్ డమ్ కు ఇంకా టైం ఉంది కాబట్టి ఫ్యాన్స్ కి ఇది మంచి జ్ఞాపకంగా ఉంటుందని అందరూ అనుకున్నారు.
కట్ చేస్తే ఎవడే సుబ్రహ్మణ్యంకు ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. హైదరాబాద్ భ్రమరాంబ, వైజాగ్ లాంటి కొన్ని మెయిన్ సెంటర్లలో తప్ప మిగిలిన చోట టికెట్లు అంతంతమాత్రంగానే తెగాయి. కారణం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ దూకుడు. ఇంకోవైపు తొమ్మిదికి పైగా కొత్త రిలీజులు. అసలే ఎవడే సుబ్రహ్మణ్యం ఎమోషనల్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్, విజిల్స్ వేయించే మాస్ ఎపిసోడ్స్ ఉండవు. ఫీల్ గుడ్ మూమెంట్స్ తో పాటు భావోద్వేగాలకు గురి చేసే సీన్లు, మంచి పాటలు ఉంటాయి. కానీ థియేటర్లలో అల్లరి చేస్తూ సందడి చేయాలనుకునే ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ ఉండదు.
ఒకవేళ మరో సందర్భంలో వచ్చి ఉంటే ఎవడే సుబ్రహ్మణ్యంకు మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి స్పందన దక్కేదేమో. అందుకే టైమింగ్ ముఖ్యమని చెప్పేది. నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆ మధ్య సోషల్ మీడియాలో అర్థం లేని కారణాలతో ఫ్యాన్ వార్లు చేసుకున్న సంగతి తెలిసిందే. వాళ్ళను కలిపేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందనుకుంటే ఇలా జరగడం ఊహించనిది. కల్కి 2898 ఏడి దర్శకుడు నాగ్ అశ్విన్ డెబ్యూగానూ దీనికి ప్రత్యేకత ఉంది. అన్నట్టు పదేళ్ల క్రితం ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ రోజే నాని మరో సినిమా జెండాపై కపిరాజు విడుదలయ్యింది. కాకపోతే అది డిజాస్టరయ్యింది.
This post was last modified on March 21, 2025 5:35 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…