అతడు.. తెలుగు ప్రేక్షకులు అత్యంత మెచ్చిన చిత్రాల్లో ఇది ముందు వరసలోఉంటుందనడంలో సందేహం లేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ చిత్రం 2005లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంది. కానీ ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక తెచ్చుకున్న స్పందన అనూహ్యం. వయో భేదం లేకుండా అందరూ ఈ సినిమాను తెగ ఇష్టపడి చూశారు.
మా టీవీ వాళ్లు ఎన్ని సార్లు ఈ సినిమాను టెలికాస్ట్ చేశారో లెక్కే లేదు. మొదట్లో నెలకోసారి వేసేవాళ్లు. తర్వాత ప్రతి వారం సినిమా ప్రదర్శితం అయ్యేది. రాను రాను రెండు మూడు రోజులకోసారి ఈ సినిమాను వెయ్యడమూ మొదలైంది. అయినా సరే.. అతడు వస్తుంటే అలా టీవీ పెట్టి ఎంజాయ్ చేస్తూ పనులు చేసుకోవడం అలవాటైపోయింది జనాలకు. డైలాగులన్నీ కంఠతా వచ్చేసినా సరే.. మళ్లీ మళ్లీ ఆ సినిమా చూడడం తెలుగువారికి ఒక అలవాటుగా మారిపోయింది.
ఇలా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయిన ‘అతడు’ ఇప్పుడు ఓ సంచలన రికార్డును అందుకుంది. ప్రపంచ సినీ చరిత్రలోనే టీవీలో ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అయిన సినిమాగా ‘అతడు’ రికార్డ్ సృష్టించిందట. దానికి దరిదాపుల్లో కూడా ఏ సినిమా లేదట. బహుశా ఇప్పటిదాకా మరే చిత్రం కూడా వెయ్యిసార్లు కూడా టెలికాస్ట్ అయి ఉండకపోవచ్చు. కాబట్టి ‘అతడు’ రికార్డును భవిష్యత్తులో కూడా మరే చిత్రం అందుకునే అవకాశమే లేదు. ఇది ఒక శాశ్వత రికార్డుగా నిలిచిపోనుంది. ఒక సినిమా 1500 సార్లు ప్రదర్శితం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ రికార్డు గురించి చర్చించుకుంటున్నారు. మహేష్ బాబు అభిమానులైతే ఇది సూపర్ స్టార్కే సాధ్యం అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.
This post was last modified on March 19, 2025 10:35 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…