అతడు.. తెలుగు ప్రేక్షకులు అత్యంత మెచ్చిన చిత్రాల్లో ఇది ముందు వరసలోఉంటుందనడంలో సందేహం లేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ చిత్రం 2005లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంది. కానీ ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక తెచ్చుకున్న స్పందన అనూహ్యం. వయో భేదం లేకుండా అందరూ ఈ సినిమాను తెగ ఇష్టపడి చూశారు.
మా టీవీ వాళ్లు ఎన్ని సార్లు ఈ సినిమాను టెలికాస్ట్ చేశారో లెక్కే లేదు. మొదట్లో నెలకోసారి వేసేవాళ్లు. తర్వాత ప్రతి వారం సినిమా ప్రదర్శితం అయ్యేది. రాను రాను రెండు మూడు రోజులకోసారి ఈ సినిమాను వెయ్యడమూ మొదలైంది. అయినా సరే.. అతడు వస్తుంటే అలా టీవీ పెట్టి ఎంజాయ్ చేస్తూ పనులు చేసుకోవడం అలవాటైపోయింది జనాలకు. డైలాగులన్నీ కంఠతా వచ్చేసినా సరే.. మళ్లీ మళ్లీ ఆ సినిమా చూడడం తెలుగువారికి ఒక అలవాటుగా మారిపోయింది.
ఇలా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయిన ‘అతడు’ ఇప్పుడు ఓ సంచలన రికార్డును అందుకుంది. ప్రపంచ సినీ చరిత్రలోనే టీవీలో ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అయిన సినిమాగా ‘అతడు’ రికార్డ్ సృష్టించిందట. దానికి దరిదాపుల్లో కూడా ఏ సినిమా లేదట. బహుశా ఇప్పటిదాకా మరే చిత్రం కూడా వెయ్యిసార్లు కూడా టెలికాస్ట్ అయి ఉండకపోవచ్చు. కాబట్టి ‘అతడు’ రికార్డును భవిష్యత్తులో కూడా మరే చిత్రం అందుకునే అవకాశమే లేదు. ఇది ఒక శాశ్వత రికార్డుగా నిలిచిపోనుంది. ఒక సినిమా 1500 సార్లు ప్రదర్శితం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ రికార్డు గురించి చర్చించుకుంటున్నారు. మహేష్ బాబు అభిమానులైతే ఇది సూపర్ స్టార్కే సాధ్యం అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.
This post was last modified on March 19, 2025 10:35 pm
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…