అతడు.. తెలుగు ప్రేక్షకులు అత్యంత మెచ్చిన చిత్రాల్లో ఇది ముందు వరసలోఉంటుందనడంలో సందేహం లేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ చిత్రం 2005లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంది. కానీ ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక తెచ్చుకున్న స్పందన అనూహ్యం. వయో భేదం లేకుండా అందరూ ఈ సినిమాను తెగ ఇష్టపడి చూశారు.
మా టీవీ వాళ్లు ఎన్ని సార్లు ఈ సినిమాను టెలికాస్ట్ చేశారో లెక్కే లేదు. మొదట్లో నెలకోసారి వేసేవాళ్లు. తర్వాత ప్రతి వారం సినిమా ప్రదర్శితం అయ్యేది. రాను రాను రెండు మూడు రోజులకోసారి ఈ సినిమాను వెయ్యడమూ మొదలైంది. అయినా సరే.. అతడు వస్తుంటే అలా టీవీ పెట్టి ఎంజాయ్ చేస్తూ పనులు చేసుకోవడం అలవాటైపోయింది జనాలకు. డైలాగులన్నీ కంఠతా వచ్చేసినా సరే.. మళ్లీ మళ్లీ ఆ సినిమా చూడడం తెలుగువారికి ఒక అలవాటుగా మారిపోయింది.
ఇలా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయిన ‘అతడు’ ఇప్పుడు ఓ సంచలన రికార్డును అందుకుంది. ప్రపంచ సినీ చరిత్రలోనే టీవీలో ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అయిన సినిమాగా ‘అతడు’ రికార్డ్ సృష్టించిందట. దానికి దరిదాపుల్లో కూడా ఏ సినిమా లేదట. బహుశా ఇప్పటిదాకా మరే చిత్రం కూడా వెయ్యిసార్లు కూడా టెలికాస్ట్ అయి ఉండకపోవచ్చు. కాబట్టి ‘అతడు’ రికార్డును భవిష్యత్తులో కూడా మరే చిత్రం అందుకునే అవకాశమే లేదు. ఇది ఒక శాశ్వత రికార్డుగా నిలిచిపోనుంది. ఒక సినిమా 1500 సార్లు ప్రదర్శితం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ రికార్డు గురించి చర్చించుకుంటున్నారు. మహేష్ బాబు అభిమానులైతే ఇది సూపర్ స్టార్కే సాధ్యం అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.
This post was last modified on March 19, 2025 10:35 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…