Movie News

నాన్న పోయినా ఏడవని తమన్

సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో తెలిసిందే. కానీ తమన్ చిన్న తనం నుంచి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడో తెలిస్తే మాత్రం తన పట్ల ఆరాధన భావం కలుగుతుంది. స్కూలుకు వెళ్తున్న వయసులో తండ్రి చనిపోతే.. చదువు మానేసి మ్యూజిక్ అసిస్టెంట్‌గా మారి తల్లిని, సోదరిని చూసుకున్న గొప్ప వ్యక్తి తమన్. గతంలోనే ఈ విషయాల గురించి మాట్లాడిన తమన్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన చిన్ననాటి విషయాల గురించి పంచుకున్నాడు.

తనకెంతో ఇష్టమైన తండ్రి చనిపోయినా ఏడవని విషయాన్ని అతను గుర్తు చేసుకున్నాడు.‘‘నాకు 11 ఏళ్లు ఉన్నపుడు నాన్న చనిపోయారు. అప్పుడు చెల్లి రెండో తరగతి చదువుతోంది. నాన్న డెడ్ బాడీని అంబులెన్సులో తీసుకొచ్చినపుడు నా కంట చుక్క నీరు రాలేదు. అందరూ ఏడుస్తున్నారు. నేను మాత్రం ఏడవలేదు. అమ్మను, చెల్లిని ఎలా చూసుకోవాలనే ఆలోచనలోనే ఉండిపోయా. అంత చిన్న వయసులో నాకు అంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు.

ఆ రోజు మా కుటుంబాన్ని పరామర్శించడానికి డ్రమ్మర్ శివమణి వచ్చారు. ఆయన్ని చూడగానే ఎమోషనల్ అయిపోయాను. మా నాన్న చనిపోయాక వచ్చిన ఎల్ఐసీ డబ్బులు తీసి మా అమ్మ నాకే ఇచ్చేసింది. వాటితో మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కొన్నాను. చదువు మానేసి ఆ వయసు నుంచే మ్యూజిక్ మీద దృష్టిపెట్టా. బాలుగారు, శివమణి గారు.. ఇంకా చాలామంది నాకు సామం చేశారు. అదంతా మా నాన్న మంచితనం వల్లే జరిగిందనుకుంటా. ఇప్పుడు మా అమ్మ వయసు 74 ఏళ్లు. కాలు కిందపెట్టకుండా చూసుకుంటున్నా’’ అని తమన్ తెలిపాడు.

This post was last modified on March 18, 2025 6:07 pm

Share

Recent Posts

కొత్త మెట్లు ఎక్కేసిన కిరణ్ అబ్బవరం

కెరీర్ లో పైకి వస్తున్న టైంలో యూత్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. తమ పాత్రల గురించి రకరకాల లెక్కలు…

2 hours ago

తూచ్.. మల్లారెడ్డి పార్టీ మారట్లేదు!

పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి…

2 hours ago

100 కోట్లు రాలేదంటే ఏమనుకోవాలి

నిన్న విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కున్న క్రేజ్ దృష్యా తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు…

3 hours ago

`మేకిన్` ఇండియా అడిగితే.. `లీకిన్` ఇండియా ఇచ్చారు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్ర‌జ‌లు మేకిన్…

3 hours ago

మ‌న్యానికి కుంకీల‌ను పంపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలోని రైతులు గ‌త కొన్ని రోజులుగా ఏనుగుల బెడ‌ద‌ను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొర‌బ‌డి ప్ర‌జ‌ల‌ను…

4 hours ago

స్థానికంపై జగన్ సీరియస్ గానే ఉన్నారా?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు…

5 hours ago