Movie News

నాన్న పోయినా ఏడవని తమన్

సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో తెలిసిందే. కానీ తమన్ చిన్న తనం నుంచి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడో తెలిస్తే మాత్రం తన పట్ల ఆరాధన భావం కలుగుతుంది. స్కూలుకు వెళ్తున్న వయసులో తండ్రి చనిపోతే.. చదువు మానేసి మ్యూజిక్ అసిస్టెంట్‌గా మారి తల్లిని, సోదరిని చూసుకున్న గొప్ప వ్యక్తి తమన్. గతంలోనే ఈ విషయాల గురించి మాట్లాడిన తమన్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన చిన్ననాటి విషయాల గురించి పంచుకున్నాడు.

తనకెంతో ఇష్టమైన తండ్రి చనిపోయినా ఏడవని విషయాన్ని అతను గుర్తు చేసుకున్నాడు.‘‘నాకు 11 ఏళ్లు ఉన్నపుడు నాన్న చనిపోయారు. అప్పుడు చెల్లి రెండో తరగతి చదువుతోంది. నాన్న డెడ్ బాడీని అంబులెన్సులో తీసుకొచ్చినపుడు నా కంట చుక్క నీరు రాలేదు. అందరూ ఏడుస్తున్నారు. నేను మాత్రం ఏడవలేదు. అమ్మను, చెల్లిని ఎలా చూసుకోవాలనే ఆలోచనలోనే ఉండిపోయా. అంత చిన్న వయసులో నాకు అంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు.

ఆ రోజు మా కుటుంబాన్ని పరామర్శించడానికి డ్రమ్మర్ శివమణి వచ్చారు. ఆయన్ని చూడగానే ఎమోషనల్ అయిపోయాను. మా నాన్న చనిపోయాక వచ్చిన ఎల్ఐసీ డబ్బులు తీసి మా అమ్మ నాకే ఇచ్చేసింది. వాటితో మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కొన్నాను. చదువు మానేసి ఆ వయసు నుంచే మ్యూజిక్ మీద దృష్టిపెట్టా. బాలుగారు, శివమణి గారు.. ఇంకా చాలామంది నాకు సామం చేశారు. అదంతా మా నాన్న మంచితనం వల్లే జరిగిందనుకుంటా. ఇప్పుడు మా అమ్మ వయసు 74 ఏళ్లు. కాలు కిందపెట్టకుండా చూసుకుంటున్నా’’ అని తమన్ తెలిపాడు.

This post was last modified on March 18, 2025 6:07 pm

Share

Recent Posts

యానిమల్ పార్క్… ఇంకెంత దూరం?

రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…

5 hours ago

తమన్ సమాజ సేవకు 12 కోట్ల టార్గెట్

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…

5 hours ago

చివరి సిక్సర్ కోసం కనకరాజు పోరాటం

వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…

6 hours ago

గుజరాత్ ను వణికిస్తున్న చండీపుర…. 25 పిల్లలు బలి

గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…

7 hours ago

జనసేనలో వుండాలంటే బూతులు మానాలి

కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…

7 hours ago

హనుమాన్ విజయమే మహాకాళీ ధైర్యం

2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…

7 hours ago