దర్శకుల్లో మణిరత్నం, గౌతమ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, కేవీ ఆనంద్.. నటీనటుల్లో సూర్య, అరవింద్ స్వామి, సిద్దార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, ఐశ్వర్యా రాజేష్, రేవతి.. సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్, డి.ఇమాన్, జిబ్రాన్, జస్టిన్ ప్రభాకరన్.. సినిమాటోగ్రాఫర్లలో సంతోష్ శివన్, మనోజ్ పరమహంస.. ఇంతమంది దిగ్గజాలు, ప్రముఖులు కలిసి ఒక ప్రాజెక్టు చేస్తే ఎలా ఉంటుంది? ఈ కలయిక నమ్మశక్యం కాకుండా ఉంది కదా. కానీ ఈ ఇంపాజిబుల్ కాంబినేషన్ను నిజం చేస్తున్నాడు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం.
180, నా నువ్వే చిత్రాల దర్శకుడు జయేంద్రతో కలిసి మణిరత్నం నిర్మించబోయే మెగా వెబ్ సిరీస్ ముచ్చట ఇది. ‘నవరస’ పేరుతో భారీ స్థాయిలో ఈ సిరీస్ చేయబోతున్నాడు మణిరత్నం. తొమ్మిది ఎపిసోడ్లుగా తొమ్మిది కథలను చెప్పబోతోంది ఈ మెగా టీం.
ఈ తొమ్మిది కథల్లో ఒక్కోదాన్ని కేవీ ఆనంద్, గౌతమ్ మీనన్, బిజోయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజ్, పొన్రామ్, హాలిత షలీమ్, కార్తీక్ నరేన్, రతీంద్రన్ ప్రసాద్, అరవింద్ స్వామి డైరెక్ట్ చేయబోతుండటం విశేషం. వీటికి తొమ్మిది మంది సినిమాటోగ్రాఫర్లు, ఎనిమిది మంది మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయనున్నారు. 20 మందికి పైగా పేరున్న ఆర్టిస్టులు ఇందులో భాగం కాబోతున్నారు. ఈ సిరీస్తోనే సూర్య, విజయ్ సేతుపతి, సిద్దార్థ్ డిజిటల్ డెబ్యూ చేయబోతున్నారు.
ఇంతమంది ప్రముఖులు కలిసి ఒక వెబ్ సిరీస్ చేయడం ఇండియాలోనే ప్రథమం అని చెప్పాలి. వెబ్ సిరీస్ల్లో బాలీవుడ్ చాలా ముందున్నప్పటికీ.. ఈ స్థాయి ప్రాజెక్టును మాత్రం వాళ్లు కూడా టేకప్ చేయలేదు. నెట్ఫ్లిక్స్ దీని కోసం భారీగానే బడ్జెట్ పెడుతున్నట్లుంది. ఎగ్జైటింగ్ కాస్ట్, టెక్నీషియన్లతో రాబోతున్న ఈ సిరీస్ కచ్చితంగా సంచలనం సృష్టించే అవకాశముంది. మరి మణిరత్నం ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
This post was last modified on October 28, 2020 2:21 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…