ప్రభాస్ చివరగా నటించిన ‘సాహో’ ముందు అనుకున్న బడ్జెట్ రూ.100 కోట్ల లోపే. ఐతే ఈ సినిమాకు ప్రభాస్ కమిట్మెంట్ ఇచ్చాకే ‘బాహుబలి’ రెండు భాగాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలయ్యాయి. వాటి కలెక్షన్ల ప్రభంజనం అనూహ్యమైన స్థాయిలో సాగింది. ప్రభాస్ రేంజ్ ఊహించిన విధంగా మారిపోయింది. దీంతో ‘సాహో’ బడ్జెట్ను పెంచుకుంటూ పోయారు. అది చివరికి ఏకంగా రూ.300 కోట్లు దాటిపోయింది.
ఐతే ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’కు కొంచెం బడ్జెట్ నియంత్రణ పాటిస్తున్నట్లున్నారు. కానీ దీని తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమాలకు మాత్రం అలాంటి పరిమితులేమీ లేనట్లుంది. ప్రభాస్ రెండు కొత్త సినిమాల బడ్జెట్ల గురించి వినిపిస్తున్న కబుర్లు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్తో ప్రభాస్ చేయబోయే ‘ఆదిపురుష్’ బడ్జెట్ రూ.500 కోట్లని బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేసింది. అదే నిజమైతే ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ‘ఆదిపురుష్’ రికార్డులకెక్కడం ఖాయం. ఐతే ఈ రికార్డును మళ్లీ ప్రభాసే బద్దలు కొట్టబోతున్నాడని నిర్మాత అశ్వినీదత్ మాటల్ని బట్టి స్పష్టమవుతోంది. దత్ నిర్మాణంలో ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక వీడియో ఇంటర్వ్యూలో దత్ మాట్లాడుతూ.. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.600 కోట్లని అన్నారు. నిర్మాత స్వయంగా చెప్పాడంటే నిజమే అనుకోవాలి. ఖర్చు పెట్టినా పెట్టకపోయినా అధికారికంగా అయితే ఆ బడ్జెట్టే ఖరారవుతుంది.
ఒక భారతీయ సినిమా మీద ఈ స్థాయి బడ్జెట్ పెట్టడం అన్నది అనూహ్యమైన విషయం. అంతగా ఖర్చు చేసి ఎలాంటి సినిమా తీస్తారన్నది ఉత్కంఠ రేకెత్తించే విషయం. కాగా.. అశ్విన్ సినిమా కంటే ముందు ప్రభాస్ ‘ఆదిపురుష్’ చేస్తాడని దత్ క్లారిటీ ఇచ్చారు. ఆ చిత్రం జనవరిలో మొదలై ఆరు నెలల్లో పూర్తవుతుందని.. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా చేయడానికి ప్రభాస్కు ఏడాదికి పైగా సమయం పడుతుందని ఆయన వెల్లడించారు.
This post was last modified on October 28, 2020 11:52 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…