టాలీవుడ్ స్టార్ హీరోల్లో అత్యంత పొడగరి, భారీ కాయుడు ఎవరంటే ప్రభాస్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆహార్యంలో అతణ్ని మ్యాచ్ చేసే హీరో టాలీవుడ్లో కనిపించడంటే అతిశయోక్తి కాదు. అలాంటి హీరోను తన బాడీ బిల్డింగ్తో డామినేట్ చేశానని అంటున్నాడు మంచు విష్ణు. ‘కన్నప్ప’ సినిమాలో లీడ్ రోల్ కోసం విష్ణు బాగానే బాడీ పెంచాడు. ఆ సినిమా నుంచి ఈ మధ్య రిలీజ్ చేసిన రెండు పాటల్లోనూ కండలు తిరిగిన దేహంతో భలేగా కనిపించాడు విష్ణు. ఐతే విష్ణు ఎంత బాడీ బిల్డింగ్ చేసినా సరే.. ప్రభాస్ ముందు అది తక్కువే అవుతుందని అనుకుంటాం. కానీ స్వయంగా ప్రభాస్.. విష్ణును చూసి నీలో నేను సగం ఉన్నా అని కామెంట్ చేశాడంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఈ విషయాన్ని స్వయంగా విష్ణు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడున్న టెక్నాలజీలో హీరోలను తెర మీద చాలా బలంగా చూపించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. లేని సిక్స్ ప్యాక్లతో మాయ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెర మీద ప్రభాస్ను మ్యాచ్ చేయడానికి ఏదైనా టెక్నాలజీ వాడారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు విష్ణు. ‘‘ప్రభాస్ ఈ మధ్య బాగా సన్నబడ్డాడు. కన్నప్ప షూటింగ్కు వచ్చినపుడు కూడా చాలా సన్నగా కనిపించాడు. అతణ్ని స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకోమంటే కుదరదని చెప్పాడు. ‘నీలో నేను సగం ఉన్నా. స్లీవ్ లెస్ వేస్తే బాగోదు’ అన్నాడు’’ అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు విష్ణు.
ఈ మధ్య సోషల్ మీడియాలో నెగెటివిటీ బాగా ఎక్కువైపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘కన్నప్ప’లో నటించినందుకు ప్రభాస్కు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తా అని ఒక నెటిజన్ తనను బెదిరించినట్లు విష్ణు చెప్పడం విశేషం. ప్రభాస్ అయినా.. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ లాంటి వాళ్లయినా తమ మీద ఉన్న అభిమానంతోనే ఈ సినిమాలో నటించినట్లు విష్ణు తెలిపాడు.
This post was last modified on March 16, 2025 5:51 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…