టాలీవుడ్ స్టార్ హీరోల్లో అత్యంత పొడగరి, భారీ కాయుడు ఎవరంటే ప్రభాస్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆహార్యంలో అతణ్ని మ్యాచ్ చేసే హీరో టాలీవుడ్లో కనిపించడంటే అతిశయోక్తి కాదు. అలాంటి హీరోను తన బాడీ బిల్డింగ్తో డామినేట్ చేశానని అంటున్నాడు మంచు విష్ణు. ‘కన్నప్ప’ సినిమాలో లీడ్ రోల్ కోసం విష్ణు బాగానే బాడీ పెంచాడు. ఆ సినిమా నుంచి ఈ మధ్య రిలీజ్ చేసిన రెండు పాటల్లోనూ కండలు తిరిగిన దేహంతో భలేగా కనిపించాడు విష్ణు. ఐతే విష్ణు ఎంత బాడీ బిల్డింగ్ చేసినా సరే.. ప్రభాస్ ముందు అది తక్కువే అవుతుందని అనుకుంటాం. కానీ స్వయంగా ప్రభాస్.. విష్ణును చూసి నీలో నేను సగం ఉన్నా అని కామెంట్ చేశాడంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఈ విషయాన్ని స్వయంగా విష్ణు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడున్న టెక్నాలజీలో హీరోలను తెర మీద చాలా బలంగా చూపించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. లేని సిక్స్ ప్యాక్లతో మాయ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెర మీద ప్రభాస్ను మ్యాచ్ చేయడానికి ఏదైనా టెక్నాలజీ వాడారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు విష్ణు. ‘‘ప్రభాస్ ఈ మధ్య బాగా సన్నబడ్డాడు. కన్నప్ప షూటింగ్కు వచ్చినపుడు కూడా చాలా సన్నగా కనిపించాడు. అతణ్ని స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకోమంటే కుదరదని చెప్పాడు. ‘నీలో నేను సగం ఉన్నా. స్లీవ్ లెస్ వేస్తే బాగోదు’ అన్నాడు’’ అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు విష్ణు.
ఈ మధ్య సోషల్ మీడియాలో నెగెటివిటీ బాగా ఎక్కువైపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘కన్నప్ప’లో నటించినందుకు ప్రభాస్కు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తా అని ఒక నెటిజన్ తనను బెదిరించినట్లు విష్ణు చెప్పడం విశేషం. ప్రభాస్ అయినా.. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ లాంటి వాళ్లయినా తమ మీద ఉన్న అభిమానంతోనే ఈ సినిమాలో నటించినట్లు విష్ణు తెలిపాడు.
This post was last modified on March 16, 2025 5:51 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…