మొన్న శుక్రవారం కోర్ట్ హడావిడిలో పడి వేరే కొత్త సినిమాలు పట్టించుకోలేదు కానీ వాటిలో మలయాళం డబ్బింగ్ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ఉంది. ఓటిటి ప్రేక్షకులకు బాగా పరిచయమున్న కుంచకో బోబన్ హీరోగా ప్రియమణి ఆయన భార్యగా ప్రధాన పాత్ర పోషించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కేరళలో మంచి విజయం నమోదు చేసుకుంది. నిజానికి తెలుగు వెర్షన్ మార్చి 7 రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు. కానీ పోటీ ఎక్కువగా ఉండటం, థియేటర్ల కొరత కారణంగా వాయిదా వేశారు. ప్రమోషన్లు అంతంతమాత్రంగా జరిగాయి. సోషల్ మీడియాలో దీని గురించి తెలిసిన కాసిన్ని జనం వెళ్లారు తప్పించి ఎక్కువ సెంటర్లలో షోలే వేయలేదు.
సరే టాక్ మెల్లగా వస్తే ఆడియన్స్ పెరుగుతారనుకుంటే వచ్చే వారం మార్చి 20 తెలుగుతో సహా మల్టీ లాంగ్వేజెస్ లో ఆఫీసర్ ఆన్ డ్యూటీ స్ట్రీమింగ్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మాత్రం సంబరానికి అనువాదం చేయడం ఎందుకు. పోస్టర్ ఖర్చులు, డిజిటల్ వ్యయం, మార్కెటింగ్, బయ్యర్ల ఒప్పందాలు, థియేటర్ అద్దెలు ఇవన్నీ కనీసం సగమైనా వసూలు కావాలంటే ఓ వారం గ్యాప్ దొరకాలి. రిలీజైన రెండో రోజే ఓటిటి అనౌన్స్ మెంట్ వస్తే వెళ్లాలన్న ఆ గుప్పెడు జనాలు ఆగిపోతారు. గతంలో ఇదే తరహాలో టోవినో థామస్ – త్రిషల ఐడెంటిటీని ఊసులో లేకుండా చేసిన ఘనత ఇక్కడే జరిగింది.
ఇక కంటెంట్ విషయానికి వస్తే ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒక క్రైమ్ థ్రిల్లర్. దొంగతనానికి గురైన బంగారు గొలుసు కేసులో ఓ అమ్మాయి చనిపోతే దానికి బెంగళూరులో పోలీస్ ఆత్మహత్యకు లింక్ ఉందని హీరో గుర్తిస్తాడు. ఈ క్రమంలో విచారణ చేసే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటికి వస్తాయి. అసలు హంతకుడు ఎవరు, రెండింటి మధ్య సంబంధం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూపించారు. మరీ ఎక్స్ ట్రాడినరి కాదు కానీ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు ఓ మోస్తరుగా పర్వాలేదనిపించే మ్యాటర్ మూవీలో ఉంది. ఎలాగూ ప్రకటన వచ్చేసింది కాబట్టి టికెట్ కొనాలో లేక జస్ట్ వన్ వీక్ ఆగాలో ఆడియన్స్ ఇష్టం.
This post was last modified on March 15, 2025 5:53 pm
ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప 2 ది రూల్ తర్వాత మూడో భాగం ది ర్యాంపేజ్…
ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి దక్కిన ఆదరణే దానికి సాక్ష్యం.…
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…
టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…
నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…
టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…