ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కన్నప్ప కోసం మంచు విష్ణు ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టాడు. ఇంటర్వ్యూలతో పాటు అవుట్ డోర్ పబ్లిసిటీ చేసుకుంటూ క్రమంగా బజ్ పెంచే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రభాస్ క్యామియో చేయడం వల్ల దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాన్ ఇండియా రిలీజ్, వంద కోట్ల దాకా బడ్జెట్, చాలా పెద్ద క్యాస్టింగ్ లాంటి అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ట్రోలింగ్ ని టార్గెట్ చేసుకున్న సోషల్ మీడియా బ్యాచులు లేకపోలేదు. కాకపోతే గతంలో తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు అంత ఓవరాక్షన్ చేయడం లేదు. ఇక అసలు పాయింటుకొద్దాం.
ఇటీవలే కన్నప్ప నుంచి ఒక లవ్ సాంగ్ రిలీజయ్యింది. విష్ణుతో పాటు హీరోయిన్ ప్రీతీ ముకుందన్ చేసిన గ్లామర్ షో మీద కామెంట్స్ వచ్చాయి. భక్తి చిత్రంలో ఇలా రొమాన్స్ చూపిస్తారా అంటూ ఒక వర్గం లాజిక్ బయటికి తీసింది. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా తీసినప్పుడు డాక్యుమెంటరీని ఎలా ఆశిస్తారని విష్ణు చెప్పడం లాజికల్ గా రైటే. ఎలా అంటే మూడు దశాబ్దాల క్రితం వచ్చిన అన్నమయ్యలో నాగార్జున – రమ్యకృష్ణ – కస్తూరి మధ్య ప్రేమకథతో పాటు మోహన్ బాబు, రోజాతో రొమాన్స్ చేయించారు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు. అవి కథతో పాటు ప్రయాణించి నెగటివ్ ఫీడ్ బ్యాక్ తేలేదు.
ఆ తర్వాత శ్రీరామదాసులోనూ దీన్నే ఫాలో అయిపోయి విజయం అందుకున్నారు. పాండురంగడులో మాత్రం కొంచెం మోతాదు మించడంతో ఫలితం రాలేదు. కానీ కన్నప్పలో అవసరం మేరకే ప్రేమని జొప్పించామని చెబుతున్న విష్ణు పూర్తి సినిమా చూశాక మీకే అర్థమవుతుందని వివరిస్తున్నాడు. అలనాటి భక్త కన్నప్పలోనూ కృష్ణంరాజు, వాణిశ్రీల మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది. కాకపోతే మోడరన్ కన్నప్పలో ఇప్పటి జనరేషన్ కు అనుగుణంగా డోస్ పెట్టారు. ఓటిటిలకు చూపించి అమ్మనని, రిలీజయ్యాక వాళ్లంతట వాళ్లే వస్తారని ధీమాగా ఉన్న విష్ణు నమ్మకం మీద ఏప్రిల్ 25న థియేటర్లలో తీర్పు రానుంది.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…