ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కన్నప్ప కోసం మంచు విష్ణు ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టాడు. ఇంటర్వ్యూలతో పాటు అవుట్ డోర్ పబ్లిసిటీ చేసుకుంటూ క్రమంగా బజ్ పెంచే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రభాస్ క్యామియో చేయడం వల్ల దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాన్ ఇండియా రిలీజ్, వంద కోట్ల దాకా బడ్జెట్, చాలా పెద్ద క్యాస్టింగ్ లాంటి అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ట్రోలింగ్ ని టార్గెట్ చేసుకున్న సోషల్ మీడియా బ్యాచులు లేకపోలేదు. కాకపోతే గతంలో తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు అంత ఓవరాక్షన్ చేయడం లేదు. ఇక అసలు పాయింటుకొద్దాం.
ఇటీవలే కన్నప్ప నుంచి ఒక లవ్ సాంగ్ రిలీజయ్యింది. విష్ణుతో పాటు హీరోయిన్ ప్రీతీ ముకుందన్ చేసిన గ్లామర్ షో మీద కామెంట్స్ వచ్చాయి. భక్తి చిత్రంలో ఇలా రొమాన్స్ చూపిస్తారా అంటూ ఒక వర్గం లాజిక్ బయటికి తీసింది. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా తీసినప్పుడు డాక్యుమెంటరీని ఎలా ఆశిస్తారని విష్ణు చెప్పడం లాజికల్ గా రైటే. ఎలా అంటే మూడు దశాబ్దాల క్రితం వచ్చిన అన్నమయ్యలో నాగార్జున – రమ్యకృష్ణ – కస్తూరి మధ్య ప్రేమకథతో పాటు మోహన్ బాబు, రోజాతో రొమాన్స్ చేయించారు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు. అవి కథతో పాటు ప్రయాణించి నెగటివ్ ఫీడ్ బ్యాక్ తేలేదు.
ఆ తర్వాత శ్రీరామదాసులోనూ దీన్నే ఫాలో అయిపోయి విజయం అందుకున్నారు. పాండురంగడులో మాత్రం కొంచెం మోతాదు మించడంతో ఫలితం రాలేదు. కానీ కన్నప్పలో అవసరం మేరకే ప్రేమని జొప్పించామని చెబుతున్న విష్ణు పూర్తి సినిమా చూశాక మీకే అర్థమవుతుందని వివరిస్తున్నాడు. అలనాటి భక్త కన్నప్పలోనూ కృష్ణంరాజు, వాణిశ్రీల మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది. కాకపోతే మోడరన్ కన్నప్పలో ఇప్పటి జనరేషన్ కు అనుగుణంగా డోస్ పెట్టారు. ఓటిటిలకు చూపించి అమ్మనని, రిలీజయ్యాక వాళ్లంతట వాళ్లే వస్తారని ధీమాగా ఉన్న విష్ణు నమ్మకం మీద ఏప్రిల్ 25న థియేటర్లలో తీర్పు రానుంది.
This post was last modified on March 15, 2025 4:11 pm
టాలీవుడ్ లో విలన్ల కొరత వాస్తవం. ఎంత బాలీవుడ్ నుంచి కొందరిని తీసుకొచ్చినా నేటివిటీ సమస్య వల్ల ఒరిజినాలిటి రావడం…
మొన్న శుక్రవారం కోర్ట్ హడావిడిలో పడి వేరే కొత్త సినిమాలు పట్టించుకోలేదు కానీ వాటిలో మలయాళం డబ్బింగ్ 'ఆఫీసర్ ఆన్…
సోషల్ మీడియాలో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఓ అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది.…
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై తమిళనాడుకు చెందిన అధికార పార్టీ డీఎంకే నాయకులు వరుస పెట్టి విమర్శలు…
మహా కుంభమేళా, భక్తులకే కాదు, వ్యాపారస్తులకు కూడా అపారమైన ఆదాయాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇటీవల జరిగిన…
ఏపీలోని కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకునే ఈ నిర్ణయం ద్వారా…