ఏ విషయాన్నయినా బలంగా, మిగతా వాళ్లతో పోలిస్తే కొంచెం భిన్నంగా చెప్పడం పూరి జగన్నాథ్ ప్రత్యేకత. ఈ మధ్య ఆయన సినిమాల్లో పదును తగ్గి ఉండొచ్చు కానీ.. పూరి చెప్పే మాటలు మాత్రం చాలా ఎఫెక్టివ్గానే ఉంటున్నాయి. ఈ విషయం ఆయన పాడ్కాస్ట్లోకి వచ్చాక మరింతగా రుజువైంది.
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో విభిన్న అంశాల మీద ఆయన చాలా ఆసక్తికర రీతిలో వాయిస్ మెసేజ్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ‘ఆత్మహత్య’ మీద మాట్లాడారు. మామూలుగా ఆత్మహత్యలు చేసుకునేవాళ్లను పిరికివాళ్లుగా, పనికి రాని వాళ్లుగా, బాధ్యత లేని వాళ్లుగా చూస్తారు. కానీ ఆ అభిప్రాయాలు పూర్తిగా తప్పంటూ పూరి తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ఈ అంశంపై సూటిగా సుత్తి లేకుండా పూరి ఏమన్నాడో ఒకసారి చూద్దాం పదండి.
‘‘ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవాళ్లంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే తెలివైన వాళ్లకు మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఫూల్స్ ఎప్పుడూ ఇలా ఆలోచించరు. పిరికివాళ్లే ఆత్మహత్య చేసుకుంటారని అందరూ అంటారు. అది అబద్ధం. చనిపోవడానికి ఎంతో ధైర్యం కావాలి. ప్రాణం వదిలేసే దమ్ము చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. జీవితంలో కొన్ని సమస్యల వల్ల చనిపోవాలన్న ఆలోచన వస్తుంది. అవి ఆర్థిక సమస్యలు కావచ్చు. కుటుంబ సమస్యలు కావచ్చు. ప్రేమ అంశం కావచ్చు. బాధ్యతలు తీసుకున్న వాళ్లు మాత్రమే చనిపోవాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏ బాధ్యతలు లేకుండా బతికే వాళ్లకు ఆత్మహత్య ఆలోచనలే రావు. నిజంగా చావాల్సింది వాళ్లు. బాధ్యత తీసుకునేవాళ్లు కాదు. నీకు ప్రేమించే గుణం ఉంది. తప్పు చేయవు. ఎవరైనా మాట అంటే తట్టుకోలేవు. ఆత్మాభిమానం ఎక్కువ. నువ్వు తెలివైన వాడివి. నీకు చచ్చేంత దమ్ము ఉంది. ఇవన్నీ హీరో లక్షణాలు. హీరో చావడమేంటి. హీరో చనిపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు చనిపోకూడదు. ఏ పని చేయని, బాధ్యత లేని వాళ్లే చనిపోవాలి’’ అని పూరి తేల్చేశాడు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…