ఆగస్ట్ 14 మీద ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ మల్టీస్టారర్ వార్ 2 ఆల్రెడీ ఆ డేట్ ని తీసుకోగా రజనీకాంత్ కూలి కూడా అదే తేదీ మీద కన్నేసిందన్న వార్త అభిమానులకు ఆందోళన కలిగించింది. ఎందుకంటే రెండూ ఒకేసారి తలపడటం బిజినెస్, ఓపెనింగ్స్ పరంగా ఎంత మాత్రం క్షేమం కాదు. కానీ తాజా అప్డేట్ ప్రకారం ఈ ప్యాన్ ఇండియా మూవీస్ క్లాష్ అయ్యే అవకాశం ఎంత మాత్రం లేదు. వార్ 2 వాయిదా ప్రసక్తే లేదని, ఆ మేరకు యష్ రాజ్ ఫిలిమ్స్ తమ డిస్ట్రిబ్యూటర్లకు ముందస్తు సమాచారం ఇచ్చి థియేటర్లు బుక్ చేసే పనిలో ఉన్నట్టు ముంబై రిపోర్ట్.
దీన్ని దృష్టిలో కూలిని మరో తేదీకి తీసుకురావాలని చూస్తున్నట్టు చెన్నై టాక్. ఇంకా ఖరారు కానప్పటికీ వార్ 2 తో ఫేస్ అఫ్ ఉండదని బయ్యర్లకు స్పష్టత ఇవ్వడంతో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే పనిలో ఉన్నట్టు తెలిసింది. కూలితో తలపడేందుకు ఎవరూ సాహసించకపోవచ్చు. ఎందుకంటే రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కాంబినేషన్ రాష్ట్రంతో సంబంధం లేకుండా విపరీతమైన హైప్ తేనుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ సెట్ చేసిన తెలివైన క్యాస్టింగ్ అసలు హైప్ ని ఎంతపైకి తీసుకెళ్తుందో అర్థం కావడం లేదు. అందుకే రిలీజ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
కూలిని ఖచ్చితంగా ఆగస్ట్ లేదా ఆ తర్వాత రిలీజ్ చేస్తారనేది పక్కా. ఇందులో డౌట్ లేదు. కాకపోతే దసరా సీజన్ ఆల్రెడీ లాక్ అయిపోయింది. దీపావళి స్లాట్ల మీద మెల్లగా ఇతర నిర్మాతలు కర్చీఫ్స్ వేస్తున్నారు. పోనీ డిసెంబర్ రజని పుట్టినరోజు వదులుదామంటే అంత ఆలస్యం కష్టం. పైగా ఓటిటి డీలింగ్ లో ఇబ్బందులొస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఫిక్స్ చేయాలి. ది రాజా సాబ్, విశ్వంభర, స్వయంభు లాంటి చాలా సినిమాలు ఇదే సీజన్ లో వచ్చేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. మరి కూలి తొందరపడతాడో లేక నాకేం భయమంటూ కోరుకున్న తేదీని డిమాండ్ చేసి తీసుకుంటాడో వేచి చూడాలి.
This post was last modified on March 13, 2025 12:04 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…