అమ్మోరు తల్లి అనగానే నిన్నటితరం తెలుగు ప్రేక్షకులకు ఒక రకమైన భక్తి భావం ఒంట్లోకి వచ్చేస్తుంది. 90ల్లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. ఆ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ప్రభావితం చేసిందంటే.. అది ఆడుతున్న ప్రతి థియేటర్ ముందూ అమ్మోరుతల్లి ప్రతిమను పెట్టి పూజలు పునస్కారాలు చేశారు. థియేటర్లు సైతం దేవాలయాల్లా మారిపోయాయి. అప్పటి ప్రేక్షకుల్లో భయం, భక్తిని పెంచిన సినిమా ఇది. ఒక దేవుడి సినిమా ఈ స్థాయిలో ప్రభావితం చేయడం అరుదైన విషయం.
ఆ తర్వాత ‘అమ్మోరు’ను అనుకరిస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ.. ఆ సినిమా స్థాయిలో ఏదీ ఆడలేదు. ఒక దశ దాటాక ఆ టైపు సినిమాలు ఆగిపోయాయి. ప్రేక్షకుల అభిరుచి మారిపోవడమే అందుక్కారణం. ఐతే చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ అమ్మోరు తల్లి తెరపైకి రావడం విశేషం.
తమిళంలో ‘మూకుత్తి అమ్మన్’ పేరుతో తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార అమ్మోరి పాత్ర పోషించిన చిత్రమిది. యాంకర్, నటుడు ఆర్జే బాలాజి ఇందులో కీలక పాత్ర పోషించడమే కాదు.. శరవణన్ అనే మరో దర్శకుడితో కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు. భయస్థుడైన రిపోర్టర్గా అతను ఇందులో పాత్ర చేశాడు.
కష్టాల్లో ఉన్న అతడి కుటుంబాన్ని ఆదుకోవడానికి వారి కుల దైవం అయిన అమ్మవారు భూమి మీదికి వస్తారు. అతడి కష్టాలు తీర్చాక భక్తి పేరుతో జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ, వారిని దోచుకుంటూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న దొంగ స్వామీజీల భరతం పట్టడానికి సిద్ధమవుతారు. ఈ క్రమంలో ఏం జరిగిందన్నది మిగతా కథ. ఐతే దీని ట్రైలర్ చూస్తే సినిమా కామెడీ ప్రధానంగా నడుస్తుందని అర్థమవుతోంది. ‘అమ్మోరు’ తరహా సీరియస్నెస్ ఎక్కడా లేదు. ఆద్యంతం వినోదాత్మకంగా సినిమా నడిచేలా ఉంది. హాట్ స్టార్లో దీపావళి కానుకగా వచ్చే నెల 14న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
This post was last modified on October 27, 2020 2:44 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…