Movie News

నానితో చిరు… ప్రొడ్యూసర్ గారూ బాగున్నారా?

నేచురల్ స్టార్ నాని సూపర్ ఫామ్‌లో ఉన్న హీరో మాత్రమే కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాత కూడా. ‘అ!’ మొదలుకుని నాని నిర్మించిన ప్రతి చిత్రంలో తన అభిరుచి కనిపిస్తుంది. తనే హీరోగా నటిస్తున్న ‘హిట్-3’తో పాటు ‘కోర్ట్’ అనే చిన్న సినిమాను కూడా అతనే ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఒకెత్తయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల రూపొందించబోయే సినిమాలో నాని నిర్మాణ భాగస్వామి కావడం మరో ఎత్తు. శ్రీకాంత్‌ను చిరు దగ్గరికి తీసుకెళ్లి ఈ ప్రాజెక్ట్ సెట్ చేసిందే నాని. అంతే కాక చిరు తనయురాలు సుష్మితతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. చిరుకు వీరాభిమాని అయిన నాని.. ఆయన సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం గురించి ఇప్పటికే చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఈ సినిమాలో నటించడం కోసం చిరు సైతం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు.

కాగా చిరు అంతటి వాడు.. నానిని ప్రొడ్యూసర్ గారూ అని సంబోధించడం అంటే విశేషమే కదా. ఇటీవలే అదే జరిగిందట. అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ళ పెళ్లిలో ఈ విశేషం చోటు చేసుకుందట. వేదిక మీద నవ దంపతులకు శుభాకాంక్షలు చెప్పి తిరిగి వస్తుండగా.. చిరంజీవి ఎదురు పడ్డాడని, అప్పుడాయన ‘‘ప్రొడ్యూసర్ గారూ బాగున్నారా’’ అని అడిగాడని నాని గుర్తు చేసుకున్నాడు. చిరుతో తనతో మాట్లాడుతున్నాడని తాను అనుకోలేదని.. అశ్వినీదత్ లాంటి పెద్ద వాళ్లెవరైనా తన వెనుక ఉన్నారేమో అనుకుని వెనుదిరిగి చూశానని.. కానీ అక్కడ ఎవరూ లేరని నాని తెలిపాడు.

చిరు వెంటనే.. ‘‘మిమ్మల్నే ప్రొడ్యూసర్ గారూ’’ అంటూ దగ్గరికి వచ్చి తనను కౌగిలించుకున్నట్లు నాని తెలిపాడు. చిరు తననిలా సంబోధించడం చాలా ఆశ్చర్యంగా అనిపించిందని నాని అన్నాడు. ‘కోర్ట్’ సినిమాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో ప్రియదర్శితో కలిసి పాల్గొన్న సందర్భంగా నాని ఈ విషయం వెల్లడించాడు. ఇక ‘కోర్ట్’ సినిమాను నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడని తెలిసి, అది కచ్చితంగా హిట్ అవుతుందని చిరు తనతో అన్నట్లు ఈ సందర్భంగా ప్రియదర్శి వెల్లడించాడు.

This post was last modified on March 11, 2025 7:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago