Political News

కూట‌మికి వెయ్యి ఏనుగుల బ‌ల‌మిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌

వ‌చ్చే 15 ఏళ్ల‌పాటు కూట‌మి అధికారంలో ఉండాల‌ని జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ బ‌లంగా చెబుతున్న విష‌యం తెలిసిందే. ప‌దే ప‌దే ఈ విష‌యాన్ని చెప్ప‌డం ద్వారా వైసీపీని బ‌లంగా ఎదుర్కొనేందుకు కూట‌మిగా ఉండ‌డం ఒక్క‌టే కీల‌క మంత్ర‌మ‌న్న విష‌యాన్ని ఆయ‌న తేల్చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో లోపాలు క‌నిపిస్తూనే ఉన్నాయి. నాయ‌కుల మ‌ధ్య కీచులాట‌లు కూడా కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రింత కీల‌క దిశానిర్దేశం చేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో ప్ర‌సంగించారు.

ప్ర‌ధానంగా మూడు విష‌యాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు.

1) చేసింది చెప్పుకోలేక పోవ‌డం: ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నులు, తీసుకువ‌స్తున్న పెట్టుబ‌డులు, నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాలు, చేస్తున్న సంక్షేమం వంటి అనేక అంశాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. చేసిందిచెప్పుకోలేక పోతున్నామ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలో వైసీపీని ఆయ‌న ఉద‌హ‌రించారు. వైసీపీ స‌భ్యులు 11 మంది మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ 11 వంద‌ల మంది ఉన్న‌ట్టు మాట్లాడ‌తార‌ని చెప్పారు. దీనికి కార‌ణం వారు చెప్పేది బ‌లంగా న‌మ్ముతున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో కూట‌మి ప్ర‌భుత్వం, నాయ‌కులు ఏ కార‌ణంతోనో చేసింది చెప్పుకోలేక‌పోతున్నామ‌ని వ్యాఖ్యానించారు. అంటే ఒక‌ర‌కంగా చేసింది ప్ర‌చారం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చి చెప్పారు. దీనికి పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ముందుకు సాగాల‌న్న అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

2) ఏకాభిప్రాయం: వివిధ ఉద్దేశాలు, విభిన్న సిద్ధాంతాలు ఉన్న బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీలు ఒకే జ‌ట్టుగా ఉన్నాయి. కూట‌మి అధికారంలోకి వ‌చ్చాయి. అయితే ఆయా పార్టీల నాయ‌కులు ఏకాభిప్రాయంతో ఉండ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. ఈ విష‌యాన్నే ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు. వేర్వేరు స‌మూహాలు, సిద్ధాంతాల నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ నాయ‌కుల మ‌ధ్య ఏకాభిప్రాయాన్ని పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఏకాభిప్రాయంతోనే ముందుకు సాగాల‌ని కూడా పేర్కొన్నారు. త‌ద్వారానే కూట‌మి ప‌ది కాలాల పాటు నిల‌బ‌డుతుంద‌న్నారు.

3) కులాల ప్ర‌స్తావ‌న: వైసీపీ నేత‌లు ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిట్టి కులాల వెనుక దాక్కుంటున్నార‌ని పేర్కొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కు నిజాలు తెలియాల‌ని చెప్పారు. అంటే నాయ‌కులు ఈ విష‌యంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

మొత్తంగా కూట‌మి పార్టీలు విజ‌య‌వంతంగా ముందుకు సాగేందుకు అనుస‌రించాల్సిన వ్యూహాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆవిష్క‌రించారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఈ మూడు ఫార్ములాల‌ను ఒంట‌బ‌ట్టించుకుంటే కూట‌మికి వెయ్యి ఏనుగుల బ‌లం చేకూరుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

This post was last modified on March 7, 2026 10:07 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

ఎన్టీఆర్ సినిమా కోసం ధనుష్ మూవీ త్యాగం

‘సప్తసాగరాలు దాటి’ అనే చిన్న సినిమాతో రుక్మిణి వసంత్ అనే కన్నడ అమ్మాయి ఎంత మంచి పేరు సంపాదించిందో తెలిసిందే.…

1 hour ago

దురంధర్ పోవాలని కోరుకున్న టాప్ డైరెక్టర్లు

ఒక భాష నుంచి ఆల్ టైమ్ హిట్ వస్తే.. ఆ ఇండస్ట్రీ అందుకు ఎంతో గర్విస్తుంది. ఆ సినిమా మాది…

2 hours ago

రేవంత్ ‘దక్షిణాది గళం’ బలమెంత..?

నియోజకవర్గాల పునర్విభజన వేళ... దక్షిణాది రాష్ట్రాల నుంచి ఓ రకమైన భయాందోళన అయితే వ్యక్తం అవుతోంది. 2011 జనాభా లెక్కల…

3 hours ago

ఓజీ-2 ప‌నిలో సుజీత్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక‌, ఆయ‌న చేసిన చిత్రాల్లో అభిమానుల‌ను అత్యంత అల‌రించింది ఓజీనే. సినిమా…

4 hours ago

రాముడు రావణుడు కలవడం లేదు

ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఇటీవలే రిలీజైన…

4 hours ago

పార్టీలోని పెద్ద పదవి ఇప్పుడు లోకేష్ సొంతం

ఏపీలో అధికార కూటమికి సారధ్యం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ…

4 hours ago