Political News

కూట‌మికి వెయ్యి ఏనుగుల బ‌ల‌మిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌

వ‌చ్చే 15 ఏళ్ల‌పాటు కూట‌మి అధికారంలో ఉండాల‌ని జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ బ‌లంగా చెబుతున్న విష‌యం తెలిసిందే. ప‌దే ప‌దే ఈ విష‌యాన్ని చెప్ప‌డం ద్వారా వైసీపీని బ‌లంగా ఎదుర్కొనేందుకు కూట‌మిగా ఉండ‌డం ఒక్క‌టే కీల‌క మంత్ర‌మ‌న్న విష‌యాన్ని ఆయ‌న తేల్చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో లోపాలు క‌నిపిస్తూనే ఉన్నాయి. నాయ‌కుల మ‌ధ్య కీచులాట‌లు కూడా కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రింత కీల‌క దిశానిర్దేశం చేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో ప్ర‌సంగించారు.

ప్ర‌ధానంగా మూడు విష‌యాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు.

1) చేసింది చెప్పుకోలేక పోవ‌డం: ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నులు, తీసుకువ‌స్తున్న పెట్టుబ‌డులు, నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాలు, చేస్తున్న సంక్షేమం వంటి అనేక అంశాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. చేసిందిచెప్పుకోలేక పోతున్నామ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలో వైసీపీని ఆయ‌న ఉద‌హ‌రించారు. వైసీపీ స‌భ్యులు 11 మంది మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ 11 వంద‌ల మంది ఉన్న‌ట్టు మాట్లాడ‌తార‌ని చెప్పారు. దీనికి కార‌ణం వారు చెప్పేది బ‌లంగా న‌మ్ముతున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో కూట‌మి ప్ర‌భుత్వం, నాయ‌కులు ఏ కార‌ణంతోనో చేసింది చెప్పుకోలేక‌పోతున్నామ‌ని వ్యాఖ్యానించారు. అంటే ఒక‌ర‌కంగా చేసింది ప్ర‌చారం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చి చెప్పారు. దీనికి పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ముందుకు సాగాల‌న్న అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

2) ఏకాభిప్రాయం: వివిధ ఉద్దేశాలు, విభిన్న సిద్ధాంతాలు ఉన్న బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీలు ఒకే జ‌ట్టుగా ఉన్నాయి. కూట‌మి అధికారంలోకి వ‌చ్చాయి. అయితే ఆయా పార్టీల నాయ‌కులు ఏకాభిప్రాయంతో ఉండ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. ఈ విష‌యాన్నే ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు. వేర్వేరు స‌మూహాలు, సిద్ధాంతాల నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ నాయ‌కుల మ‌ధ్య ఏకాభిప్రాయాన్ని పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఏకాభిప్రాయంతోనే ముందుకు సాగాల‌ని కూడా పేర్కొన్నారు. త‌ద్వారానే కూట‌మి ప‌ది కాలాల పాటు నిల‌బ‌డుతుంద‌న్నారు.

3) కులాల ప్ర‌స్తావ‌న: వైసీపీ నేత‌లు ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిట్టి కులాల వెనుక దాక్కుంటున్నార‌ని పేర్కొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కు నిజాలు తెలియాల‌ని చెప్పారు. అంటే నాయ‌కులు ఈ విష‌యంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

మొత్తంగా కూట‌మి పార్టీలు విజ‌య‌వంతంగా ముందుకు సాగేందుకు అనుస‌రించాల్సిన వ్యూహాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆవిష్క‌రించారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఈ మూడు ఫార్ములాల‌ను ఒంట‌బ‌ట్టించుకుంటే కూట‌మికి వెయ్యి ఏనుగుల బ‌లం చేకూరుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

This post was last modified on March 7, 2026 10:07 am

Share

Recent Posts

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

20 minutes ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

29 minutes ago

పోలీసు యూనిఫాంలో ఉగ్ర‌వాదులు… ఢిల్లీ నిర‌స‌న‌ల్లో కుట్ర‌?

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి వ్య‌తిరేకంగా విద్యార్థులు చేప‌ట్టిన ఢిల్లీ నిర‌స‌న‌లో ఉగ్ర‌వాదుల కుట్ర కోణం బ‌య‌ట ప‌డింద‌ని ఢిల్లీ టాస్క్‌ఫోర్స్…

1 hour ago

సీనియర్ హీరోని ట్రోల్ చేస్తే ఏమొస్తుంది

ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…

1 hour ago

ర‌జినీ కోసం ఒట్టు తీసి గ‌ట్టున పెట్టాడు

కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్ట‌ర్ రోల్స్ చేసిన విజ‌య్ సేతుప‌తి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే.…

2 hours ago

కొబ్బరికాయ కొట్టెందుకు ముఖ్యమంత్రి అవసరమా

భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…

4 hours ago