Political News

కూట‌మికి వెయ్యి ఏనుగుల బ‌ల‌మిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌

వ‌చ్చే 15 ఏళ్ల‌పాటు కూట‌మి అధికారంలో ఉండాల‌ని జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ బ‌లంగా చెబుతున్న విష‌యం తెలిసిందే. ప‌దే ప‌దే ఈ విష‌యాన్ని చెప్ప‌డం ద్వారా వైసీపీని బ‌లంగా ఎదుర్కొనేందుకు కూట‌మిగా ఉండ‌డం ఒక్క‌టే కీల‌క మంత్ర‌మ‌న్న విష‌యాన్ని ఆయ‌న తేల్చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో లోపాలు క‌నిపిస్తూనే ఉన్నాయి. నాయ‌కుల మ‌ధ్య కీచులాట‌లు కూడా కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రింత కీల‌క దిశానిర్దేశం చేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో ప్ర‌సంగించారు.

ప్ర‌ధానంగా మూడు విష‌యాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు.

1) చేసింది చెప్పుకోలేక పోవ‌డం: ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నులు, తీసుకువ‌స్తున్న పెట్టుబ‌డులు, నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాలు, చేస్తున్న సంక్షేమం వంటి అనేక అంశాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. చేసిందిచెప్పుకోలేక పోతున్నామ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలో వైసీపీని ఆయ‌న ఉద‌హ‌రించారు. వైసీపీ స‌భ్యులు 11 మంది మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ 11 వంద‌ల మంది ఉన్న‌ట్టు మాట్లాడ‌తార‌ని చెప్పారు. దీనికి కార‌ణం వారు చెప్పేది బ‌లంగా న‌మ్ముతున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో కూట‌మి ప్ర‌భుత్వం, నాయ‌కులు ఏ కార‌ణంతోనో చేసింది చెప్పుకోలేక‌పోతున్నామ‌ని వ్యాఖ్యానించారు. అంటే ఒక‌ర‌కంగా చేసింది ప్ర‌చారం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చి చెప్పారు. దీనికి పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ముందుకు సాగాల‌న్న అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

2) ఏకాభిప్రాయం: వివిధ ఉద్దేశాలు, విభిన్న సిద్ధాంతాలు ఉన్న బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీలు ఒకే జ‌ట్టుగా ఉన్నాయి. కూట‌మి అధికారంలోకి వ‌చ్చాయి. అయితే ఆయా పార్టీల నాయ‌కులు ఏకాభిప్రాయంతో ఉండ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. ఈ విష‌యాన్నే ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు. వేర్వేరు స‌మూహాలు, సిద్ధాంతాల నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ నాయ‌కుల మ‌ధ్య ఏకాభిప్రాయాన్ని పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఏకాభిప్రాయంతోనే ముందుకు సాగాల‌ని కూడా పేర్కొన్నారు. త‌ద్వారానే కూట‌మి ప‌ది కాలాల పాటు నిల‌బ‌డుతుంద‌న్నారు.

3) కులాల ప్ర‌స్తావ‌న: వైసీపీ నేత‌లు ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిట్టి కులాల వెనుక దాక్కుంటున్నార‌ని పేర్కొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కు నిజాలు తెలియాల‌ని చెప్పారు. అంటే నాయ‌కులు ఈ విష‌యంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

మొత్తంగా కూట‌మి పార్టీలు విజ‌య‌వంతంగా ముందుకు సాగేందుకు అనుస‌రించాల్సిన వ్యూహాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆవిష్క‌రించారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఈ మూడు ఫార్ములాల‌ను ఒంట‌బ‌ట్టించుకుంటే కూట‌మికి వెయ్యి ఏనుగుల బ‌లం చేకూరుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

This post was last modified on March 7, 2026 10:07 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

ఇది.. మోడీకి ఇన్‌స‌ల్ట్ కాదా?!

“భార‌త దేశం స‌ర్వ‌స‌త్తాక సార్వ‌భౌమ దేశం. ఇత‌ర దేశాల‌కు త‌ల‌వొంచ‌దు. ఎవ‌రో చెప్పిన‌ట్టు కూడా న‌డుచుకోదు. ఎవ‌రి ఆదేశాల‌నో పాటించాల్సిన…

6 minutes ago

2029 ఆయుధాలు రెడీ చేసుకుంటోన్న టీడీపీ – వైసీపీ…!

2029లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ, టీడీపీలు ఇప్ప‌టి నుంచే ఆయుధాల‌ను రెడీ చేసుకుంటు న్నాయా? వాటికి ప‌దును కూడాపెంచుకుంటున్నాయా?…

2 hours ago

సజ్జనార్ మాటలు వింటారా?

సోష‌ల్ మీడియా యావ‌లో ప‌డిన చాలా మంది యువ‌కులు, య‌వ‌తులు త‌మ ప్రాణాల‌ను కూడా బ‌లి చేసుకుంటున్నార‌న్న‌ది వాస్త‌వం. ఇలాంటి…

3 hours ago

ఆ విషయంపై నోరు విప్పిన పవన్

వైసీపీ హ‌యాంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం చంద్ర‌బాబు, ఇత‌ర మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే.. తొలిసారి..…

5 hours ago

క‌థ మార్చార‌ని ర‌చ‌యిత హ‌ర్టు

సినిమా క‌థ‌లు ఒక‌లా మొద‌లై చివ‌రికి ఇంకో స్వ‌రూపం తీసుకోవ‌డం మామూలే. ఐతే మొద‌ట క‌థ ఇచ్చిన ర‌చ‌యిత అనుమ‌తితో..…

7 hours ago