బిగ్బాస్ షోలోకి వెళ్లే వారికి చాలా కఠినమైన ఆంక్షలుంటాయి. ప్రేక్షకులు ఎలిమినేట్ చేసేంతవరకు లోపల వుండాల్సిందే కానీ బయటకు రాకూడదు. అలా వెళ్లిపోతామని ఎవరైనా అడిగితే నష్ట పరిహారం తీవ్రంగా వుంటుంది. అదే విధంగా బిగ్బాస్ హోస్ట్కి కూడా చాలా భారీ మొత్తంలో గిట్టుబాటు అవుతుంది. అదే సమయంలో చాలా ఖచ్చితమైన నియమ నిబంధనలుంటాయి.
సెకండ్ సీజన్లో నానికి ఊపిరి సలపనివ్వలేదు. కేవలం పది వారాలకు కాంట్రాక్ట్ మాట్లాడుకుని, అవసరమయితే నిడివి పెంచుకుంటామనే నిబంధన వాడుకుని మరో అయిదు వారాలు పొడిగించారు. షూటింగ్ కోసం నానికి అసలు బ్రేక్ అనేది ఇవ్వలేదు. ఆడియన్స్ పల్స్ తెలీక బిగ్బాస్ రైటర్లు రాసిచ్చింది మాట్లాడేసి ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు. షో వదిలేయాలని ఎంత అనిపించినా కానీ పంటి బిగువున సీజన్ కంప్లీట్ చేసి ఇక మళ్లీ జీవితంలో బిగ్బాస్ హోస్ట్ చేయనని చెప్పేసాడు. ఇంత ఖచ్చితంగా వుండే బిగ్బాస్లో నాగార్జునకు మాత్రం ఆడింది ఆట అవుతోంది.
స్టార్ మాలో భాగస్వామి కావడంతో నాగార్జునకి ఎలాంటి టర్మ్స్ విధించలేకపోతున్నారు. గత సీజన్లో ఒక వారం స్కిప్ కొట్టిన నాగార్జున ఈసారి ఏకంగా మూడు వారాలకు ఎగనామం పెట్టేసారు. బిగ్బాస్ షోలో సీజన్ మధ్యకొచ్చేసరికి పోటీ తీవ్రతరమవుతుంది. ఇలాంటి టైమ్లో హోస్ట్ గైడెన్స్ చాలా కీలకం.
ఆల్రెడీ ఒక హోస్ట్ తో కనక్షన్ ఏర్పడి వాళ్లు ఇచ్చే సలహాలను ఫాలో అయ్యే ప్లేయర్లు గెస్ట్ హోస్ట్ తో ఇబ్బందులు పడతారు. పారితోషికం పరంగా అనూహ్యమయిన మొత్తం చెల్లిస్తున్నా కానీ నాగార్జున మాత్రం బిగ్బాస్కి పూర్తిస్థాయిలో టైమ్ కేటాయించడం లేదు. ఈ సీజన్ అనుభవంతో ఈసారి గ్యారెంటీ హోస్ట్ కోసం స్టార్ మా నెట్వర్క్ అన్వేషిస్తుందేమో.
This post was last modified on October 27, 2020 1:54 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…