Movie News

నాగార్జునతో కక్కలేక… మింగలేక!


బిగ్‍బాస్‍ షోలోకి వెళ్లే వారికి చాలా కఠినమైన ఆంక్షలుంటాయి. ప్రేక్షకులు ఎలిమినేట్‍ చేసేంతవరకు లోపల వుండాల్సిందే కానీ బయటకు రాకూడదు. అలా వెళ్లిపోతామని ఎవరైనా అడిగితే నష్ట పరిహారం తీవ్రంగా వుంటుంది. అదే విధంగా బిగ్‍బాస్‍ హోస్ట్కి కూడా చాలా భారీ మొత్తంలో గిట్టుబాటు అవుతుంది. అదే సమయంలో చాలా ఖచ్చితమైన నియమ నిబంధనలుంటాయి.

సెకండ్‍ సీజన్‍లో నానికి ఊపిరి సలపనివ్వలేదు. కేవలం పది వారాలకు కాంట్రాక్ట్ మాట్లాడుకుని, అవసరమయితే నిడివి పెంచుకుంటామనే నిబంధన వాడుకుని మరో అయిదు వారాలు పొడిగించారు. షూటింగ్‍ కోసం నానికి అసలు బ్రేక్‍ అనేది ఇవ్వలేదు. ఆడియన్స్ పల్స్ తెలీక బిగ్‍బాస్‍ రైటర్లు రాసిచ్చింది మాట్లాడేసి ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు. షో వదిలేయాలని ఎంత అనిపించినా కానీ పంటి బిగువున సీజన్‍ కంప్లీట్‍ చేసి ఇక మళ్లీ జీవితంలో బిగ్‍బాస్‍ హోస్ట్ చేయనని చెప్పేసాడు. ఇంత ఖచ్చితంగా వుండే బిగ్‍బాస్‍లో నాగార్జునకు మాత్రం ఆడింది ఆట అవుతోంది.

స్టార్‍ మాలో భాగస్వామి కావడంతో నాగార్జునకి ఎలాంటి టర్మ్స్ విధించలేకపోతున్నారు. గత సీజన్లో ఒక వారం స్కిప్‍ కొట్టిన నాగార్జున ఈసారి ఏకంగా మూడు వారాలకు ఎగనామం పెట్టేసారు. బిగ్‍బాస్‍ షోలో సీజన్‍ మధ్యకొచ్చేసరికి పోటీ తీవ్రతరమవుతుంది. ఇలాంటి టైమ్‍లో హోస్ట్ గైడెన్స్ చాలా కీలకం.

ఆల్రెడీ ఒక హోస్ట్ తో కనక్షన్‍ ఏర్పడి వాళ్లు ఇచ్చే సలహాలను ఫాలో అయ్యే ప్లేయర్లు గెస్ట్ హోస్ట్ తో ఇబ్బందులు పడతారు. పారితోషికం పరంగా అనూహ్యమయిన మొత్తం చెల్లిస్తున్నా కానీ నాగార్జున మాత్రం బిగ్‍బాస్‍కి పూర్తిస్థాయిలో టైమ్‍ కేటాయించడం లేదు. ఈ సీజన్‍ అనుభవంతో ఈసారి గ్యారెంటీ హోస్ట్ కోసం స్టార్‍ మా నెట్‍వర్క్ అన్వేషిస్తుందేమో.

This post was last modified on October 27, 2020 1:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

9 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago