టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకరిగా ఉన్నారు అక్కినేని నాగార్జున. కానీ తర్వాతి తరం హీరోల హోరులో ఆయన జోరు తగ్గింది. గత ఏడెనిమిదేళ్లలో అయితే నాగ్ బాగా ఇబ్బంది పడుతున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత ఆయనకు అలాంటి పెద్ద సక్సెస్ లేకపోయింది. నెమ్మదిగా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కరిగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా డిజాస్టర్ అయింది. బంగార్రాజు, నా సామిరంగ చిత్రాలు సంక్రాంతి టైంలో రిలీజై ఏదో ఒక మోస్తరుగా ఆడేశాయి.
నాగ్ చిత్రాల బడ్జెట్లు, బిజినెస్ లెక్కలు చూస్తే మిడ్ రేంజ్ యంగ్ హీరోల కంటే ఆయన చాలా వెనుకబడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన సోలో హీరోగా సినిమానే చేయకుండా బ్రేక్ తీసుకున్నారు. ‘నా సామిరంగా’ విడుదలై ఏడాది దాటినా నాగ్ ఇంకా సినిమా మొదలుపెట్టలేదు. సోలో హీరోగా సినిమాలు ఆపేసిన నాగ్.. కుబేర, కూలీ లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించారు. ఈ రెండు చిత్రాలకూ మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘కూలీ’కి తెలుగులోనూ హైప్ మామూలుగా లేదు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ చిత్రానికి తెలుగు రైట్స్ ఏకంగా రూ.40 కోట్లు పలుకుతున్నాయట. ‘2.0’ను పక్కన పెడితే.. రజినీ సినిమాలకు గత దశాబ్ద కాలంలో తెలుగులో మార్కెట్ బాగా దెబ్బ తింది. రజినీ చివరి సినిమా ‘వేట్టయాన్’ కనీసం పది కోట్ల బిజినెస్ చేయలేకపోయింది. అలాంటిది ‘కూలీ’కి రూ.40 కోట్లు పలకడమంటే మాటలు కాదు. ఇక్కడ లోకేష్ కనకరాజ్ ఫ్యాక్టర్ కూడా కీలకమే అయినప్పటికీ.. నాగ్ స్పెషల్ రోల్ చేయడం దీనికి బాగా అడ్వాంటేజ్ అవుతోందనడంలో సందేహం లేదు. నాగ్ గత కొన్నేళ్లలో చేసిన సోలో సినిమాలను మించి.. ఈ చిత్రంలో ఆయన పాత్రను చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ఉపేంద్ర సైతం ఓ ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వేసవి చివర్లో ‘కూలీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
This post was last modified on March 7, 2025 4:30 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…