టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకరిగా ఉన్నారు అక్కినేని నాగార్జున. కానీ తర్వాతి తరం హీరోల హోరులో ఆయన జోరు తగ్గింది. గత ఏడెనిమిదేళ్లలో అయితే నాగ్ బాగా ఇబ్బంది పడుతున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత ఆయనకు అలాంటి పెద్ద సక్సెస్ లేకపోయింది. నెమ్మదిగా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కరిగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా డిజాస్టర్ అయింది. బంగార్రాజు, నా సామిరంగ చిత్రాలు సంక్రాంతి టైంలో రిలీజై ఏదో ఒక మోస్తరుగా ఆడేశాయి.
నాగ్ చిత్రాల బడ్జెట్లు, బిజినెస్ లెక్కలు చూస్తే మిడ్ రేంజ్ యంగ్ హీరోల కంటే ఆయన చాలా వెనుకబడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన సోలో హీరోగా సినిమానే చేయకుండా బ్రేక్ తీసుకున్నారు. ‘నా సామిరంగా’ విడుదలై ఏడాది దాటినా నాగ్ ఇంకా సినిమా మొదలుపెట్టలేదు. సోలో హీరోగా సినిమాలు ఆపేసిన నాగ్.. కుబేర, కూలీ లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించారు. ఈ రెండు చిత్రాలకూ మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘కూలీ’కి తెలుగులోనూ హైప్ మామూలుగా లేదు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ చిత్రానికి తెలుగు రైట్స్ ఏకంగా రూ.40 కోట్లు పలుకుతున్నాయట. ‘2.0’ను పక్కన పెడితే.. రజినీ సినిమాలకు గత దశాబ్ద కాలంలో తెలుగులో మార్కెట్ బాగా దెబ్బ తింది. రజినీ చివరి సినిమా ‘వేట్టయాన్’ కనీసం పది కోట్ల బిజినెస్ చేయలేకపోయింది. అలాంటిది ‘కూలీ’కి రూ.40 కోట్లు పలకడమంటే మాటలు కాదు. ఇక్కడ లోకేష్ కనకరాజ్ ఫ్యాక్టర్ కూడా కీలకమే అయినప్పటికీ.. నాగ్ స్పెషల్ రోల్ చేయడం దీనికి బాగా అడ్వాంటేజ్ అవుతోందనడంలో సందేహం లేదు. నాగ్ గత కొన్నేళ్లలో చేసిన సోలో సినిమాలను మించి.. ఈ చిత్రంలో ఆయన పాత్రను చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ఉపేంద్ర సైతం ఓ ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వేసవి చివర్లో ‘కూలీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
This post was last modified on March 7, 2025 4:30 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…