ఈ నెలలో రిలీజవుతున్న క్రేజీ చిత్రాల్లో ‘దిల్ రుబా’ ఒకటి. ‘క’ లాంటి సూపర్ హిట్ తర్వాత కిరణ్ నటించిన చిత్రం కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. మార్చి 14న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈ రోజే ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర బృందం. దానికి మంచి స్పందనే వస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ని పోలిన క్యారెక్టరైజేషన్తో కిరణ్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ కూడా మెప్పించింది. ఐతే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రుక్సర్ స్టేజ్ మీద మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఈవెంట్లో కొందరు తనను అభ్యంతరకర రీతిలో ఫొటోలు తీయడం ఆమెకు నచ్చలేదు. ఈ విషయం మీద కొంచెం అసహనంతోనే మాట్లాడింది రుక్సర్.
తాను అన్ కంఫర్టబుల్గా ఉన్నానని చెప్పినా వినకుండా కొందరు ఫొటోలు తీసినట్లు రుక్సర్ వెల్లడించింది. స్టేజ్ మీద టీంతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చినా సరే.. కొందరు మాత్రం అభ్యంతరకర యాంగిల్స్లో ఫొటోలు తీశారని రుక్సర్ తెలిపింది. ఇది గమనించి తాను వారించానని.. చాలా మంచిగానే వాళ్లకు ఫొటోలు తీయొద్దని చెప్పానని.. అయినా ఆగకుండా ఫొటోలు తీశానని రుక్సర్ తెలిపింది. ‘దిల్ రుబా’లో ప్రేమ గురించి ఎంతో బాగా చెప్పిన సినిమా అని.. తాను కూడా అందరితో ప్రేమగానే మాట్లాడతానని.. అయినా సరే వద్దని వారించినా వినకుండా ఫొటోలు తీయడం ఏంటని రుక్సర్ ఆవేదన వ్యక్తం చేసింది.
తాను ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నానో వాళ్లకు అర్థం అవుతాయని అంటూ.. స్పీచ్ చివర్లో కింది వైపు చాలా కోపంగా చూసి వెళ్లిపోయింది రుక్సర్. ఆమె చూపును బట్టే ఆమె పర్టికులర్గా కొందరిని ఉద్దేశించే ఈ మాటలు అందని అర్థమైంది. ఒక హీరోయిన్ తాను అన్ కంఫర్టబుల్ అని చెప్పినా.. అలాంటి యాంగిల్స్లో ఫొటోలు తీయడం ముమ్మాటికీ తప్పే. ఈ మధ్య కీర్తి సురేష్ సైతం ఒక ఫొటోగ్రాఫర్పై ఇలాగే ఫ్రస్టేట్ అయింది.
This post was last modified on March 7, 2025 11:10 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…