ఈ నెలలో రిలీజవుతున్న క్రేజీ చిత్రాల్లో ‘దిల్ రుబా’ ఒకటి. ‘క’ లాంటి సూపర్ హిట్ తర్వాత కిరణ్ నటించిన చిత్రం కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. మార్చి 14న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈ రోజే ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర బృందం. దానికి మంచి స్పందనే వస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ని పోలిన క్యారెక్టరైజేషన్తో కిరణ్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ కూడా మెప్పించింది. ఐతే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రుక్సర్ స్టేజ్ మీద మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఈవెంట్లో కొందరు తనను అభ్యంతరకర రీతిలో ఫొటోలు తీయడం ఆమెకు నచ్చలేదు. ఈ విషయం మీద కొంచెం అసహనంతోనే మాట్లాడింది రుక్సర్.
తాను అన్ కంఫర్టబుల్గా ఉన్నానని చెప్పినా వినకుండా కొందరు ఫొటోలు తీసినట్లు రుక్సర్ వెల్లడించింది. స్టేజ్ మీద టీంతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చినా సరే.. కొందరు మాత్రం అభ్యంతరకర యాంగిల్స్లో ఫొటోలు తీశారని రుక్సర్ తెలిపింది. ఇది గమనించి తాను వారించానని.. చాలా మంచిగానే వాళ్లకు ఫొటోలు తీయొద్దని చెప్పానని.. అయినా ఆగకుండా ఫొటోలు తీశానని రుక్సర్ తెలిపింది. ‘దిల్ రుబా’లో ప్రేమ గురించి ఎంతో బాగా చెప్పిన సినిమా అని.. తాను కూడా అందరితో ప్రేమగానే మాట్లాడతానని.. అయినా సరే వద్దని వారించినా వినకుండా ఫొటోలు తీయడం ఏంటని రుక్సర్ ఆవేదన వ్యక్తం చేసింది.
తాను ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నానో వాళ్లకు అర్థం అవుతాయని అంటూ.. స్పీచ్ చివర్లో కింది వైపు చాలా కోపంగా చూసి వెళ్లిపోయింది రుక్సర్. ఆమె చూపును బట్టే ఆమె పర్టికులర్గా కొందరిని ఉద్దేశించే ఈ మాటలు అందని అర్థమైంది. ఒక హీరోయిన్ తాను అన్ కంఫర్టబుల్ అని చెప్పినా.. అలాంటి యాంగిల్స్లో ఫొటోలు తీయడం ముమ్మాటికీ తప్పే. ఈ మధ్య కీర్తి సురేష్ సైతం ఒక ఫొటోగ్రాఫర్పై ఇలాగే ఫ్రస్టేట్ అయింది.
This post was last modified on March 7, 2025 11:10 am
మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…
భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వస్తుంది. విషయం రూఢి చేసుకుంటుంది. భర్తను జాగ్రత్తగా గమనిస్తూ.. పరాయి మహిళతో…
ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…
మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైనపుడు అదనపు…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మైకు పట్టడం బాగా తెలుసు. ఆయన మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…
మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…