సినీ కుటుంబాల నుంచి హీరోలయ్యే కుర్రాళ్లు ఒక పట్టాన ఓటమిని ఒప్పుకోరు. వరుసగా సినిమాలు ఫెయిలవుతున్నా, ప్రేక్షకుల ఆమోదం పొందకపోయినా.. తమ ప్రయాణాన్ని ఆపరు. చిన్నవైనా సరే సినిమాలు చేస్తూనే ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు హిట్టు కొట్టకపోతానా, హీరోగా సక్సెస్ కాకపోతానా అన్న ఆశతో ఇండస్ట్రీని వదిలిపెట్టరు. నందమూరి తారకరత్న ఇందుకు ఒక ఉదాహరణ. అతడి స్థాయిలో కాకపోయినా హీరో వేషాలు వదలకుండా సినిమాలు చేస్తున్న వారసులు వివిధ భాషల్లో చాలామందే ఉన్నారు.
ఐతే టాలీవుడ్కు చెందిన ఒక వారసుడు మాత్రం నటుడిగా, హీరోగా తాను సెట్ అవ్వనని చాలా త్వరగానే తెలుసుకున్నట్లున్నాడు. హీరో వేషాలు వదిలేసి చక్కగా ప్రొడక్షన్ వ్యవహారాలపై దృష్టిపెట్టాలని అతను ఫిక్సయిపోయాడు. అతనే.. నవీన్ విజయకృష్ణ. సీనియర్ నటుడు నరేష్ తనయుడే ఈ కుర్రాడు.
నవీన్ హీరోగా పరిచయమైన ‘నందిని నర్సింగ్ హోమ్’ పర్వాలేదనిపించింది కానీ.. అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీని కంటే ముందే అతను ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే సినిమా చేశాడు. కీర్తి సురేష్ తెలుగు తెరకు పరిచయం కావాల్సిన సినిమా ఇదే. కానీ ఆ సినిమా విడుదలకే నోచుకోలేదు. ఇక నవీన్ మూడో సినిమా గత ఏడాది విడుదలైన సంగతి కూడా చాలామందికి తెలియదు. అదే.. ఊరంతా అనుకుంటున్నారు. ఈ సినిమాకు కనీస స్పందన కరవవడంతో నవీన్ హీరోగా కొనసాగే విషయంలో పునరాలోచనలో పడిపోయారు. అతడి లుక్స్, యాక్టింగ్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీంతో పూర్తిగా హీరోగా కొనసాగడంపై ఆశలు వదులుకున్నట్లున్నాడు.
తాజాగా నవీన్, నరేష్ కలిసి ‘విజయకృష్ణ’ పేరుతో ఒక స్టూడియో మొదలుపెట్టారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు అనువుగా ఏర్పాటైన స్టూడియో ఇది. నవీన్ హీరో కావడానికి ముందు ఎడిటర్. అందులో అతడికి బాగానే నైపుణ్యం ఉంది. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల మీద కూడా అతడికి పట్టుంది. కాబట్టి ఈ స్టూడియో మీదే ఫోకస్ పెడదామని ఫిక్సయినట్లున్నాడు. ఈ స్టూడియో ప్రారంభోత్సవం సందర్భంగా నవీన్ అవతారం చూస్తే అతను నటన మీద పూర్తిగా ఆశలు వదులుకున్నాడని స్పష్టమవుతోంది.
This post was last modified on October 26, 2020 7:15 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…