తమిళ స్టార్ హీరోల్లో ధనుష్ మల్టీ టాలెంటెడ్ అనే విషయం తెలిసిందే. అతను పాటలు రాస్తాడు. పాడతాడు. కథలు రాస్తాడు. డైరెక్ట్ చేస్తాడు. తన దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘పవర్ పాండి’ పెద్ద హిట్. రెండో సినిమా ‘రాయన్’ తమిళంలో ఇంకా పెద్ద హిట్ అయింది. మూడో చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. ప్రస్తుతం తనే లీడ్ రోల్ చేస్తూ ‘ఇడ్లి కడై’ అనే సినిమా తీస్తున్నాడు ధనుష్. ఆ చిత్రం వేసవిలో విడుదల కాబోతోంది. దీని తర్వాత ధనుష్ డైరెక్ట్ చేయబోయే కొత్త సినిమా గురించి క్రేజీ న్యూస్ కోలీవుడ్లో హల్చల్ చేస్తోంది. అతను తొలిసారి ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడట. ఆ హీరో ఇంకెవరో కాదు.. అజిత్ కుమార్.
ప్రస్తుతం తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో అజిత్ ఒకడు. ఆయనతో ధనుష్ సినిమా చేయబోతున్నాడనే వార్త సెన్సేషన్గా మారింది. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అక్కడ నంబర్ వన్ స్థానానికి విజయ్తో గట్టి పోటీగా నిలుస్తూ వచ్చిన హీరో అజితే. గత కొన్నేళ్లలో విజయ్కి కొంచెం ఎడ్జ్ ఉన్నప్పటికీ.. అతను రాజకీయాల్లోకి వెళ్లిపోతుండడంతో నంబర్ వన్ స్థానం ఖాళీ కాబోతోంది. అది అజిత్ తీసుకుంటాడని భావిస్తున్నారు. వేసవిలో విడుదల కాబోతున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అంచనాల మేర ఆడితే అజిత్కు తిరుగుండదు.
దాని తర్వాత అజిత్ చేయబోయే కొత్త చిత్రం గురించి ఇప్పటిదాకా ఏ సమాచారం లేదు. కానీ ఇప్పుడు ధనుష్ దర్శకత్వంలో అజిత్ నటించబోతున్నట్లు వార్త బయటికి వచ్చింది. ధనుష్ సినిమాల్లో ఎమోషన్లతో పాటు ఎలివేషన్లు కూడా గట్టిగానే ఉంటాయి. ‘రాయన్’ సినిమా చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అతను అజిత్కు తగ్గ మంచి మాస్ సినిమా తీశాడంటే బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం. ఈ చిత్రంలో ధనుష్ కూడా నటిస్తే క్రేజ్ వేరే లెవెల్కు వెళ్తుంది. మరి నిజంగానే ఈ క్రేజీ కాంబో కార్యరూపం దాల్చుతుందేమో చూడాలి.
This post was last modified on March 6, 2025 5:59 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…