మానవాళిని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ ఇప్పటిది కాదు. వైద్య రంగం ఎంతో పురోగతి సాధించినా ఇప్పటికీ ఆ జబ్బుకు శాశ్వత పరిష్కారం కనుక్కోలేకపోయారు. కాకపోతే పోరాడి సాధించి తిరిగి జీవితాన్ని నిర్మించుకున్న సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. క్రికెటర్ యువరాజ్ సింగ్, సీనియర్ హీరోయిన్లు మనిషా కొయిరాలా – లీసారే – సోనాలి బెంద్రే ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే ఉంది. అయితే అవగాహనా లోపం, చికిత్స సరైన సమయంలో దక్కపోవడం లాంటి కారణాల వల్ల చనిపోయిన మాములు జనం లక్షల్లో ఉంటారు. ఇలాంటి వాళ్లకు ధైర్యం ఇవ్వడం కోసం శివరాజ్ కుమార్ నడుం బిగించారు.
నూటా యాభై సినిమాలు పూర్తి చేసేందుకు పరుగులు పెడుతున్న శాండల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గత ఏడాది క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. చికిత్స కోసం మూడు నెలల క్రితం అమెరికా వెళ్లి దిగ్విజయంగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. కీమోథెరపీ చేయించుకున్నప్పుడు కూడా జుట్టు రాలలేదని, తన మనోనిబ్బరం, ప్రజల ఆశీర్వాదాలతో కొత్త జన్మ అందుకున్నానని ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. క్యాన్సర్ మీద ఆయన చేసిన యుద్ధాన్ని డాక్యుమెంటరీగా రూపొందించి త్వరలోనే విడుదల చేస్తారట. ఎందరో సామాన్యులకు స్ఫూర్తినివ్వడం కోసం దీన్ని అందుబాటులోకి తేబోతున్నారు.
ఇది మంచి నిర్ణయమే. ఆరు పదుల వయసులో చిన్న అనారోగ్యం వస్తేనే తట్టుకోవడం కష్టం. అలాంటిది క్యాన్సర్ తో పోరాడి బయటికి రావడం చిన్న విషయం కాదు. అంతే కాదు వచ్చిన వెంటనే ఎక్కువ రెస్టు తీసుకోకుండా వెంటనే షూటింగుల్లో చేరిపోతున్నారు శివరాజ్ కుమార్. రామ్ చరణ్ 16లో ఆయనో కీలక పాత్ర చేస్తున్న విషయం విదితమే. ఇటీవలే లుక్ టెస్ట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేశాడని యూనిట్ టాక్. జైలర్ లో నరసింహగా మనకూ దగ్గరైన శివరాజ్ కుమార్ రామ్ చరణ్ తో కలిసి తొలిసారి తెలుగు డైలాగులు చెబుతూ పెర్ఫార్మ్ చేయడం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on March 6, 2025 5:15 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…