మానవాళిని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ ఇప్పటిది కాదు. వైద్య రంగం ఎంతో పురోగతి సాధించినా ఇప్పటికీ ఆ జబ్బుకు శాశ్వత పరిష్కారం కనుక్కోలేకపోయారు. కాకపోతే పోరాడి సాధించి తిరిగి జీవితాన్ని నిర్మించుకున్న సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. క్రికెటర్ యువరాజ్ సింగ్, సీనియర్ హీరోయిన్లు మనిషా కొయిరాలా – లీసారే – సోనాలి బెంద్రే ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే ఉంది. అయితే అవగాహనా లోపం, చికిత్స సరైన సమయంలో దక్కపోవడం లాంటి కారణాల వల్ల చనిపోయిన మాములు జనం లక్షల్లో ఉంటారు. ఇలాంటి వాళ్లకు ధైర్యం ఇవ్వడం కోసం శివరాజ్ కుమార్ నడుం బిగించారు.
నూటా యాభై సినిమాలు పూర్తి చేసేందుకు పరుగులు పెడుతున్న శాండల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గత ఏడాది క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. చికిత్స కోసం మూడు నెలల క్రితం అమెరికా వెళ్లి దిగ్విజయంగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. కీమోథెరపీ చేయించుకున్నప్పుడు కూడా జుట్టు రాలలేదని, తన మనోనిబ్బరం, ప్రజల ఆశీర్వాదాలతో కొత్త జన్మ అందుకున్నానని ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. క్యాన్సర్ మీద ఆయన చేసిన యుద్ధాన్ని డాక్యుమెంటరీగా రూపొందించి త్వరలోనే విడుదల చేస్తారట. ఎందరో సామాన్యులకు స్ఫూర్తినివ్వడం కోసం దీన్ని అందుబాటులోకి తేబోతున్నారు.
ఇది మంచి నిర్ణయమే. ఆరు పదుల వయసులో చిన్న అనారోగ్యం వస్తేనే తట్టుకోవడం కష్టం. అలాంటిది క్యాన్సర్ తో పోరాడి బయటికి రావడం చిన్న విషయం కాదు. అంతే కాదు వచ్చిన వెంటనే ఎక్కువ రెస్టు తీసుకోకుండా వెంటనే షూటింగుల్లో చేరిపోతున్నారు శివరాజ్ కుమార్. రామ్ చరణ్ 16లో ఆయనో కీలక పాత్ర చేస్తున్న విషయం విదితమే. ఇటీవలే లుక్ టెస్ట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేశాడని యూనిట్ టాక్. జైలర్ లో నరసింహగా మనకూ దగ్గరైన శివరాజ్ కుమార్ రామ్ చరణ్ తో కలిసి తొలిసారి తెలుగు డైలాగులు చెబుతూ పెర్ఫార్మ్ చేయడం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on March 6, 2025 5:15 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…