మానవాళిని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ ఇప్పటిది కాదు. వైద్య రంగం ఎంతో పురోగతి సాధించినా ఇప్పటికీ ఆ జబ్బుకు శాశ్వత పరిష్కారం కనుక్కోలేకపోయారు. కాకపోతే పోరాడి సాధించి తిరిగి జీవితాన్ని నిర్మించుకున్న సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. క్రికెటర్ యువరాజ్ సింగ్, సీనియర్ హీరోయిన్లు మనిషా కొయిరాలా – లీసారే – సోనాలి బెంద్రే ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే ఉంది. అయితే అవగాహనా లోపం, చికిత్స సరైన సమయంలో దక్కపోవడం లాంటి కారణాల వల్ల చనిపోయిన మాములు జనం లక్షల్లో ఉంటారు. ఇలాంటి వాళ్లకు ధైర్యం ఇవ్వడం కోసం శివరాజ్ కుమార్ నడుం బిగించారు.
నూటా యాభై సినిమాలు పూర్తి చేసేందుకు పరుగులు పెడుతున్న శాండల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గత ఏడాది క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. చికిత్స కోసం మూడు నెలల క్రితం అమెరికా వెళ్లి దిగ్విజయంగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. కీమోథెరపీ చేయించుకున్నప్పుడు కూడా జుట్టు రాలలేదని, తన మనోనిబ్బరం, ప్రజల ఆశీర్వాదాలతో కొత్త జన్మ అందుకున్నానని ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. క్యాన్సర్ మీద ఆయన చేసిన యుద్ధాన్ని డాక్యుమెంటరీగా రూపొందించి త్వరలోనే విడుదల చేస్తారట. ఎందరో సామాన్యులకు స్ఫూర్తినివ్వడం కోసం దీన్ని అందుబాటులోకి తేబోతున్నారు.
ఇది మంచి నిర్ణయమే. ఆరు పదుల వయసులో చిన్న అనారోగ్యం వస్తేనే తట్టుకోవడం కష్టం. అలాంటిది క్యాన్సర్ తో పోరాడి బయటికి రావడం చిన్న విషయం కాదు. అంతే కాదు వచ్చిన వెంటనే ఎక్కువ రెస్టు తీసుకోకుండా వెంటనే షూటింగుల్లో చేరిపోతున్నారు శివరాజ్ కుమార్. రామ్ చరణ్ 16లో ఆయనో కీలక పాత్ర చేస్తున్న విషయం విదితమే. ఇటీవలే లుక్ టెస్ట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేశాడని యూనిట్ టాక్. జైలర్ లో నరసింహగా మనకూ దగ్గరైన శివరాజ్ కుమార్ రామ్ చరణ్ తో కలిసి తొలిసారి తెలుగు డైలాగులు చెబుతూ పెర్ఫార్మ్ చేయడం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on March 6, 2025 5:15 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…