దశాబ్దంన్నరకు పైగా హీరోయిన్ గా వెలుగుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి ఆ జంట దాచిపెట్టలేదు. మొదట్లో తమ బంధాన్ని గుట్టుగా ఉంచినా తర్వాత ఓపెనైపోయారు. కలిసి ఈవెంట్లకు వెళ్లడం, మీడియా కెమెరాలకు ఫోజులు ఇవ్వడం చాలానే జరిగాయి. ఇద్దరూ వేర్వేరు అవకాశాలతో కెరీర్ పరంగా చాలా బిజీ ఉన్నారు. ముఖ్యంగా విజయ్ వర్మ వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్న వైనం వరస హిట్లతో కనిపిస్తోంది. తాజాగా ముంబై మీడియా కథనాల ప్రకారం తమన్నా, విజయ్ లు విడిపోవాలని నిర్ణయించుకున్నారట. వాళ్ళుగా చెప్పలేదు కానీ కన్ఫర్మ్ అంటున్నారు.
2023 లస్ట్ స్టోరీస్ షూటింగ్ సందర్భంగా ఈ ఇద్దరి మనసులు కలిశాయి. తక్కువ టైంలో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ లవ్ స్టోరీ మొదలయ్యాకే విజయ్ వర్మ కెరీర్ ఊపందుకోవడం గమనార్హం. అంతా బాగుందనుకుంటున్న టైంలో కారణాలు బయటికి చెప్పడం లేదు కానీ లైఫ్ పార్ట్ నర్స్ గా కన్నా మంచి స్నేహితులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు వినికిడి. ప్రస్తుతానికి ఇది పుకారుగానే చూడాలి. ఒకవేళ ఇంకొంత కాలం తమన్నా, విజయ్ వర్మలు కనక వేడుకలు ఇతరత్రా చోట్ల కలిసి కనిపించకపోతే అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. గత కొన్ని నెలలుగా ఇది జరగకపోవడం అసలు ట్విస్టు.
స్నేహం, బంధం, ప్రేమ, గాసిప్స్ గురించి పలు సందర్భాల్లో విజయ్ వర్మ, తమన్నాలు పలు సంగతులు పంచుకున్నారు కానీ చూచాయగా తమ రిలేషన్ క్లైమాక్స్ కు వెళ్తోందనే సంకేతం మాత్రం ఇవ్వలేదు. సినిమాల సంగతికొస్తే మహిళా అఘోరాగా తమన్నా తొలిసారిగా నటించిన ఓదెల 2 ఇటీవలే కుంభమేళాలో టీజర్ లాంచ్ జరుపుకుంది. సంపత్ నంది రచన, నేతృత్వంలో నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ కొత్త బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది తమన్నా. జైలర్, స్త్రీ 2 స్పెషల్ సాంగ్స్ చాలా పేరు తీసుకొచ్చిన నేపథ్యంలో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయట. కానీ లీడ్ రోల్ అయితే ఒప్పుకుంటోందని టాక్.
This post was last modified on March 4, 2025 5:12 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…