యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన దృష్టి మొత్తం స్పిరిట్ మీద పెడుతున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకముందే పలు ఇంటర్వ్యూల్లో అతనిస్తున్న ఎలివేషన్లు ఎప్పుడెప్పుడు ప్రభాస్ ని పోలీస్ ఆఫీసర్ గా చూద్దామా అనిపించేలా ఉన్నాయి. అయితే దీని తర్వాత తను అల్లు అర్జున్ తో ఒక సినిమా, యానిమల్ పార్క్ చేయాల్సి ఉంది. ఇవి బన్నీ, రన్బీర్ కపూర్ డేట్ల అందుబాటుని బట్టి ఉంటాయి తప్పించి ఖచ్చితంగా ఫలానా టైం అని చెప్పలేని పరిస్థితి. అయితే సందీప్ వంగా ఇన్ డైరెక్ట్ గా ఇస్తున్న కొన్ని సంకేతాలు తన మనసులో మెగా ప్రాజెక్టుని బయట పెడుతున్నాయి.
కొద్దిరోజుల క్రితం ఆరాధనలో చిరంజీవి కోపంగా చూస్తున్నస్టిల్ ని ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా పెట్టి దాన్నో డిస్కషన్ టాపిక్ గా మార్చిన సందీప్ వంగా సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేశాడు. తాజాగా బుచ్చిబాబుతో కలిసి అదే ఫోటో ముందు ఫ్రెష్ గా ఫోజు ఇవ్వడం ఇంకో చర్చకు దారి తీసింది. చిరంజీవితో సందీప్ వంగా ఒక సినిమా చేయాలనేది ఫ్యాన్స్ కోరిక. మెగా వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు ఇది నిజమయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం. వశిష్ట, అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల, బాబీ తర్వాత మెగాస్టార్ తో చేయి కలిపేది సందీప్ వంగానే అని బలంగా వినిపిస్తోంది.
కాకపోతే బాగా టైం పట్టొచ్చు. ఎందుకంటే సందీప్ తన అభిమాన హీరోలతో చేయడానికి ఛాన్స్ వస్తే వదులుకోడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సాధ్యం కాదు కానీ చిరంజీవికి సరైన కథ రాసుకుంటే కాంబోని నిజం చేయొచ్చు. పదే పదే మెగాస్టార్ హైలైట్ అయ్యేలా సందీప్ వంగా ఇస్తున్న హింట్లు ఇదే సూచిస్తున్నాయని అనుకోవాలేమో. స్పిరిట్ వేసవిలో మొదలుపెట్టాలనేది ప్రస్తుతమున్న ప్రతిపాదన. ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీలు పూర్తి చేసుకుని వస్తే కానీ సందీప్ ముందడుగు వేయలేడు. దాని కోసమే ఎదురు చూస్తున్నాడు. క్యాస్టింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగిపోతున్నాయి.
This post was last modified on March 4, 2025 3:13 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…