నేచురల్ స్టార్ నాని ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలు ఎంచుకుంటూ ట్రెండ్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ‘దసరా’తో సెన్సేషన్ క్రియేట్ చేశాక ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో అతను కొత్తగా అనౌన్స్ చేసిన ‘ది ప్యారటైజ్’ సినిమా నుంచి తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ప్రకంపనలు రేపుతోంది. టీజర్లో నాని లుక్.. హీరో గురించి ఇంట్రో ఇస్తూ తల్లి పాత్రతో చెప్పించిన బూతు డైలాగ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీశాయి. ఇంకా షూటింగ్ దశకు వెళ్లని ఈ సినిమాకు అప్పుడే రిలీజ్ డేట్ ఖరారు చేసేశారు. వచ్చే ఏడాది మార్చి 26న ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పర్ఫెక్ట్ ప్లానింగ్తోనే ఈ డేట్ ఎంచుకున్నారని అర్థమవుతోంది.
వేసవి సీజన్ ఆరంభం.. పైగా శ్రీరామ నవమి వీకెండ్లో సినిమాను రిలీజ్ చేయడం కచ్చితంగా కలిసొచ్చేదే. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ చిత్రం గురువారం విడుదల అవుతోంది. ఇది నాని ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసింది కావడం విశేషం. సాధారణంగా కొత్త సినిమాలు శుక్రవారం రోజే విడుదల అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్ ఇది. పండుగలను పురస్కరించుకుని కొంచెం ముందు వెనుక రిలీజ్ చేస్తుంటారు కానీ.. మామూలుగా అయితే అందరూ కొత్త సినిమాల విడుదలకు ప్రిఫర్ చేసేది శుక్రవారాన్నే. కానీ నాని మాత్రం గత కొన్నేళ్లుగా తన చిత్రాలను గురువారమే రిలీజ్ చేస్తున్నాడు. ఇది అతడికి బాగానే కలిసొస్తోంది.
దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలను గురువారాల్లోనే రిలీజ్ చేయించాడు. ఈ వేసవిలో రాబోతున్న నాని కొత్త చిత్రం ‘హిట్ 3’ సైతం మే 1న గురువారమే రిలీజ్ కాబోతోంది. ఈ సెంటిమెంటును కొనసాగిస్తూ ‘ది ప్యారడైజ్’కు కూడా గురువారాన్నే ఎంచుకున్నాడు. దీని గురించి ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్లలో నాని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. తన సినిమాలు గురువారాల్లోనే రిలీజయ్యేలా చూసుకుంటున్నట్లు చెబుతూ.. ‘సరిపోదా గురువారం’’ అని అతను కామెంట్ చేయడం విశేషం. గురువారం సినిమాను రిలీజ్ చేయడం వల్ల లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీ ఉంటోంది. సినిమాకు హైప్ ఉంటే కలెక్షన్ల పరంగా ఇది బాగా కలిసొచ్చే విషయమే.
This post was last modified on March 4, 2025 1:00 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…