నేచురల్ స్టార్ నాని ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలు ఎంచుకుంటూ ట్రెండ్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ‘దసరా’తో సెన్సేషన్ క్రియేట్ చేశాక ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో అతను కొత్తగా అనౌన్స్ చేసిన ‘ది ప్యారటైజ్’ సినిమా నుంచి తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ప్రకంపనలు రేపుతోంది. టీజర్లో నాని లుక్.. హీరో గురించి ఇంట్రో ఇస్తూ తల్లి పాత్రతో చెప్పించిన బూతు డైలాగ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీశాయి. ఇంకా షూటింగ్ దశకు వెళ్లని ఈ సినిమాకు అప్పుడే రిలీజ్ డేట్ ఖరారు చేసేశారు. వచ్చే ఏడాది మార్చి 26న ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పర్ఫెక్ట్ ప్లానింగ్తోనే ఈ డేట్ ఎంచుకున్నారని అర్థమవుతోంది.
వేసవి సీజన్ ఆరంభం.. పైగా శ్రీరామ నవమి వీకెండ్లో సినిమాను రిలీజ్ చేయడం కచ్చితంగా కలిసొచ్చేదే. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ చిత్రం గురువారం విడుదల అవుతోంది. ఇది నాని ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసింది కావడం విశేషం. సాధారణంగా కొత్త సినిమాలు శుక్రవారం రోజే విడుదల అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్ ఇది. పండుగలను పురస్కరించుకుని కొంచెం ముందు వెనుక రిలీజ్ చేస్తుంటారు కానీ.. మామూలుగా అయితే అందరూ కొత్త సినిమాల విడుదలకు ప్రిఫర్ చేసేది శుక్రవారాన్నే. కానీ నాని మాత్రం గత కొన్నేళ్లుగా తన చిత్రాలను గురువారమే రిలీజ్ చేస్తున్నాడు. ఇది అతడికి బాగానే కలిసొస్తోంది.
దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలను గురువారాల్లోనే రిలీజ్ చేయించాడు. ఈ వేసవిలో రాబోతున్న నాని కొత్త చిత్రం ‘హిట్ 3’ సైతం మే 1న గురువారమే రిలీజ్ కాబోతోంది. ఈ సెంటిమెంటును కొనసాగిస్తూ ‘ది ప్యారడైజ్’కు కూడా గురువారాన్నే ఎంచుకున్నాడు. దీని గురించి ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్లలో నాని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. తన సినిమాలు గురువారాల్లోనే రిలీజయ్యేలా చూసుకుంటున్నట్లు చెబుతూ.. ‘సరిపోదా గురువారం’’ అని అతను కామెంట్ చేయడం విశేషం. గురువారం సినిమాను రిలీజ్ చేయడం వల్ల లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీ ఉంటోంది. సినిమాకు హైప్ ఉంటే కలెక్షన్ల పరంగా ఇది బాగా కలిసొచ్చే విషయమే.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…