ఈ మధ్య కాలంలో భారతీయ ప్రేక్షకులను బాగా కదిలించి.. తీవ్ర భావోద్వేగానికి గురి చేసిన సినిమా అంటే.. ‘చావా’ అనే చెప్పాలి. ఈ సినిమాకు మేకింగ్ దశలో పెద్దగా హైప్ లేదు. రిలీజ్ ముంగిట కూడా ఓ మోస్తరు అంచనాలే ఉన్నాయి. కానీ ఒక్కసారి సినిమా రిలీజైందో లేదో.. రెస్పాన్స్ మాత్రం మామూలుగా లేదు. మౌత్ పబ్లిసిటీ బాగా పని చేసి సినిమాకు ప్రేక్షకులు పోటెత్తారు. నార్త్ ఇండియాలో ఈ సినిమా మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. రిలీజై మూడు వారాలు దాటినా ‘చావా’ బాక్సాఫీస్ దగ్గర జోరు కొనసాగిస్తోంది. ఐదొందల కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది.
ఈ సినిమా చూసి థియేటర్లలో తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న, నినాదాలు చేస్తున్న దృశ్యాలు ఎన్నో సోషల్ మీడియాలో ఇప్పటికీ కనిపిస్తున్నాయి. అంటే పతాక సన్నివేశాలు అంతగా ప్రేక్షకులను కదిలిస్తున్నాయని అర్థం. ఐతే ‘చావా’ సినిమా పతాక సన్నివేశాల గురించి ఇంత చర్చ జరుగుతున్న సమయంలో నవీ ముంబయిలో కొందరు యువకులకు ఆ సినిమాను ఎగతాళి చేయడానికి థియేటర్కు వెళ్లి బుక్కపోయారు. ఓ మల్టీప్లెక్స్లో ‘చావా’ సినిమా చూసేందుకు వెళ్లిన ఆ యువకులు.. థియేటర్లో అందరూ తీవ్ర భావోద్వేగంతో పతాక సన్నివేశాలను చూస్తున్న సమయంలో ఎగతాళిగా నవ్వారు. వాళ్లు కావాలనే ఇలా చేశారని అర్థం చేసుకున్న మిగతా ప్రేక్షకులు ఆ యువకులకు బుద్ధి చెప్పారు.
థియేటర్ బయటికి తీసుకొచ్చి మోకాళ్ల మీద కూర్చోబెట్టి వాళ్లతో క్షమాపణ చెప్పించడంతో పాటు ‘జై శివాజీ’, ‘జై శంభాజీ’ నినాదాలు కూడా చేయించారు. అనంతరం వారిని పోలీసులకు కూడా అప్పగించినట్లు తెలుస్తోంది. ‘చావా’లోని సన్నివేశాలు చూసి అందరికీ ఉద్వేగం కలగాలని లేదు. కానీ మిగతా వాళ్ల మనోభావాలను పట్టించుకోకుండా ఎగతాళిగా నవ్వడం అంటే రెచ్చగొట్టేలా వ్యవహరించడమే. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేశారని అర్థమవుతోంది. ఈ కుర్రాళ్లకు మిగతా ప్రేక్షకులు సరిగ్గానే బుద్ధి చెప్పారంటూ సోషల్ మీడియా జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…