అక్కినేని అఖిల్కి ఫస్ట్ హిట్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచ్లర్’ అతడికి హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు. అయితే ఇంతవరకు రిలీజ్ అయిన ప్రోమోలతో ఈ చిత్రం పట్ల అంచనాలు పెరగలేదు. తాజాగా విడుదలైన టీజర్తో అభిమానులు చాలా నిరాశ చెందారు. ఎంతో ఫన్ వుంటుందని, చాలా కొత్తగా అనిపిస్తుందని అనుకున్న టీజర్లో కనీసం డైలాగులు కూడా సరిగా లేవని కామెంట్లు పెడుతున్నారు.
‘ఇడ్లీ వడ సాంబార్’ అంటూ పూజ హెగ్డే చెప్పడాన్ని జోక్ అని డైరెక్టర్ భాస్కర్ ఫీలయినట్టున్నాడు. అందుకే టీజర్లో ఎండ్ పంచ్గా ఆ డైలాగ్ పెట్టాడు. కానీ ఈ డైలాగ్ని ఫాన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు. అసలే భాస్కర్ బొమ్మరిల్లు, పరుగు తర్వాత దర్శకుడిగా అసలు మెప్పించలేకపోయాడు. అతడితో సినిమా అన్నప్పుడే అభిమానులు చాలా అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పుడు టీజర్లు కూడా ఇంత డల్గా కనిపించడం, అఖిల్లో కూడా ఎలాంటి జోష్ లేకపోవడం ఫాన్స్కి నీరసం తెప్పిస్తోంది.
ఈ టీజర్ ప్రమోషన్ కోసం అఖిల్ బిగ్బాస్ షోకి అతిథిగా వచ్చినా కానీ సోషల్ మీడియాలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. పూర్తిగా సమంత మాత్రమే సోషల్ మీడియాలో హైలైట్ అవడంతో అఖిల్ గెస్ట్ అప్పీయరెన్స్ మిస్ఫైర్ అయింది.
This post was last modified on October 26, 2020 11:08 am
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…
వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల అసహనానికి గురైన వా వాతియర్ (అన్నగారు వస్తారు) ఎట్టకేలకు విడుదలకు రెడీ అయ్యింది. జనవరి…