అక్కినేని అఖిల్కి ఫస్ట్ హిట్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచ్లర్’ అతడికి హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు. అయితే ఇంతవరకు రిలీజ్ అయిన ప్రోమోలతో ఈ చిత్రం పట్ల అంచనాలు పెరగలేదు. తాజాగా విడుదలైన టీజర్తో అభిమానులు చాలా నిరాశ చెందారు. ఎంతో ఫన్ వుంటుందని, చాలా కొత్తగా అనిపిస్తుందని అనుకున్న టీజర్లో కనీసం డైలాగులు కూడా సరిగా లేవని కామెంట్లు పెడుతున్నారు.
‘ఇడ్లీ వడ సాంబార్’ అంటూ పూజ హెగ్డే చెప్పడాన్ని జోక్ అని డైరెక్టర్ భాస్కర్ ఫీలయినట్టున్నాడు. అందుకే టీజర్లో ఎండ్ పంచ్గా ఆ డైలాగ్ పెట్టాడు. కానీ ఈ డైలాగ్ని ఫాన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు. అసలే భాస్కర్ బొమ్మరిల్లు, పరుగు తర్వాత దర్శకుడిగా అసలు మెప్పించలేకపోయాడు. అతడితో సినిమా అన్నప్పుడే అభిమానులు చాలా అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పుడు టీజర్లు కూడా ఇంత డల్గా కనిపించడం, అఖిల్లో కూడా ఎలాంటి జోష్ లేకపోవడం ఫాన్స్కి నీరసం తెప్పిస్తోంది.
ఈ టీజర్ ప్రమోషన్ కోసం అఖిల్ బిగ్బాస్ షోకి అతిథిగా వచ్చినా కానీ సోషల్ మీడియాలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. పూర్తిగా సమంత మాత్రమే సోషల్ మీడియాలో హైలైట్ అవడంతో అఖిల్ గెస్ట్ అప్పీయరెన్స్ మిస్ఫైర్ అయింది.
This post was last modified on October 26, 2020 11:08 am
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…