ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఇటీవలే విడుదలైన డ్రాగన్ ఆదివారంతో వంద కోట్ల మార్కు దాటేసింది. మూడో వారంలోకి అడుగు పెట్టకముందే నార్త్ అమెరికాలో 1 మిలియన్ వసూలు చేసిన చిన్న హీరో సినిమాగా కొత్త రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో విడాముయార్చి (పట్టుదల) ఫైనల్ బుకింగ్స్ ని డ్రాగన్ దాటేయడం చూసి ట్రేడ్ ఆశ్చర్యపోతోంది. అజిత్ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ప్రదీప్ ఏకంగా ఆయన్ని క్రాస్ చేయడం ఊహకందనిది. దెబ్బకు ఇతగాడికి ధనుష్, విజయ్ సేతుపతి మాదిరి ఫ్యాన్ క్లబ్స్ ఏర్పడుతున్నాయి. ఊరూరా అసోసియేషన్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తెలుగులోనూ సూపర్ హిట్టే కానీ మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ కాదు. పది కోట్ల దాకా గ్రాస్ రావొచ్చని ఒక అంచనా. కోలీవుడ్ లో డ్రాగన్ అనుకుంటే డైనోసర్ అయ్యాడని ఇండస్ట్రీ వర్గాలు ప్రదీప్ రంగనాథన్ గురించి చెవులు కొరుక్కుంటున్నాయి. ఇది ఏ స్థాయి విజయమంటే ధనుష్ డైరెక్ట్ చేసిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ జాబిలమ్మా నీకు అంత కోపమా డీసెంట్ టాక్, రివ్యూలతో కనీస స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేక చతికిలబడింది. నిజానికి ఫిబ్రవరి 21 ముందు అందరూ రివర్స్ ఊహించుకున్నారు. కానీ డ్రాగన్ స్పష్టంగా పై చేయి సాధించి లవ్ టుడేని మించిపోయేలా ఫైనల్ నెంబర్లు నమోదు చేయబోతోంది.
ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేరిపోయాడు. నిర్మాణంలో ఉన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి బిజినెస్ ఆఫర్లు భారీగా వస్తున్నాయి. మైత్రి సంస్థ నిర్మిస్తున్న మరో సినిమాకు ఇంతకన్నా ఎక్కువ హైప్ నెలకొంటోంది. డ్రాగన్ లో ఇంజనీరింగ్ కుర్రాడి జీవితానికి సందేశం మిక్స్ చేస్తూ దర్శకుడు అశ్వత్ మరిముత్తు తీర్చిదిద్దిన విధానం యువతను బాగా ఆకట్టుకుంటోంది. దగ్గరలో చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు లేకపోవడంతో డ్రాగన్ డామినేషన్ కొనసాగేలా ఉంది. మన దగ్గర రామం రాఘవం, బాపు, మజాకా, శబ్దం అన్నీ సోసో రెస్పాన్స్ తెచ్చుకోవడంతో మరోవారం డ్రాగన్ ఆధిపత్యం కొనసాగుతోంది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…