వెబ్ సిరీస్ లకు కొనసాగంపులు ఉండటం కొత్త కాదు కానీ ప్రతిదానికి క్రేజ్ రాదు. హైప్ తెచ్చుకునేవి ప్రత్యేకంగా కొన్ని ఉంటాయి. వాటిలో సుడల్ ది వోర్టెక్స్ ఓకటి. రెండేళ్ల క్రితం వచ్చిన మొదటి సీజన్ భారీ స్పందన తెచ్చుకుంది. ఒక గ్రామంలో జరిగే జాతరని నేపథ్యంగా తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న క్రైమ్ డ్రామా ఆడియన్స్ కి మంచి థ్రిల్ ఇచ్చింది. ఐశ్యర్య రాజేష్, శ్రేయ రెడ్డి, కథిర్ లాంటి క్యాస్టింగ్ కంటెంట్ మరింత రీచ్ కావటానికి ఉపయోగపడింది. అందుకే సీజన్ 2 మీద అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి భాగంలో నటించిన ప్రధాన తారాగణంతో పాటు ఈసారి కొత్త పాత్రలను చాలా తీసుకొచ్చారు. ఇంతకీ రిపోర్ట్ ఏంటో చూద్దాం.
చెల్లి హత్యకు ప్రతీకారం తీర్చుకున్న నందిని (ఐశ్వర్య రాజేష్) జైలుకు వచ్చాక ఆమె తరఫున వాదిస్తున్న లాయర్ చెల్లప్ప (లాల్) అతని స్వంత కాటేజీలో దారుణంగా హత్యకు గురవుతాడు. సస్పెన్షన్ లో ఉన్నా దాని విచారణ బాధ్యతలు ఎస్ఐ చక్రి (కథిర్) కి ఆ బాధ్యతలు అప్పజెబుతారు అధికారులు. అయితే చెల్లప్పను తామే హత్య చేశామంటూ వేర్వేరుగా మొత్తం ఎనిమిది మంది అమ్మాయిలు పోలీస్ స్టేషన్లకు వచ్చి లొంగిపోతారు. దీంతో కేసు మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఇంతకీ చెల్లప్ప హంతకులు ఎవరు, గ్రామంలో జరిగే ఉత్సావాలకు ఈ ఘటనకు సంబంధం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం సిరీస్ లో చూడాలి.
విక్రమ్ వేదా దర్శకులు పుష్కర్ గాయత్రి సృష్టించిన సుడల్ 2కి బ్రహ్మ – సర్జన్ డైరెక్షన్ చేశారు. గ్రిప్పింగ్, కంటెంట్ పరంగా మొదటి భాగమంత డెప్త్ లేకపోయినా ఓ మోస్తరుగా మెప్పించడంలో ఈ సీక్వెల్ పర్వాలేదనిపిస్తుంది. చెల్లప్ప హత్య జరిగాక కథనం కొంచెం నెమ్మదిగా సాగుతూ ట్విస్టులు పెద్దగా లేకపోవడం వల్ల ఫ్లాట్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మరీ విసుగు రాకుండా మేనేజ్ చేయడం వల్ల ఓకే అనిపిస్తుంది. సామ్ సిఎస్ లాంటి టాప్ టెక్నీషియన్లతో పాటు భారీ నిర్మాణ విలువలు, తారాగణం వన్ టైం వాచ్ గా మార్చాయి. తీరిక ఎక్కువగా ఉండి ట్రై చేస్తే మరీ నిరాశపరచకుండా సుడల్ 2 యావరేజ్ అనిపించుకుంటుంది.
This post was last modified on March 2, 2025 3:35 pm
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…