మంచు విష్ణు కన్నప్ప కొత్త టీజర్ వచ్చేసింది. ఇప్పటిదాకా ప్రమోషన్ల పరంగా అంత హైప్ తీసుకురాలేదనే కామెంట్స్ కి సమాధానం ఇచ్చేలా టీమ్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ 84 సెకండ్ల వీడియోలో కనిపించింది. దేవుడంటే నమ్మకం లేని తిన్నడు (మంచు విష్ణు) అమ్మవారి విగ్రహాన్ని సైతం రాయిగా భావిస్తాడు. అడవి గూడెంలో నివసించే అతని జనాల పైకి శత్రువులు దాడి చేసినప్పుడు ఒక్కడే అడ్డుగా నిలబడి తరిమి కొడతాడు. అయితే ఇంత విరుద్ధ భావాలు కలిగిన తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు, లయకారకుడు శివుడు (అక్షయ్ కుమార్) ని ఎలా ప్రసన్నం చేసుకున్నాడనేది ఏప్రిల్ 25 థియేటర్లో చూడాలి.
ఈసారి క్యాస్టింగ్ మొత్తాన్ని ఒక పద్ధతి ప్రకారం రివీల్ చేశారు. మంచు విష్ణు, మోహన్ బాబు, శరత్ కుమార్, ముఖేష్ ఋషి, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, ఐశ్వర్య భాస్కరన్ తదితరులతో పాటు చివరి షాట్ లో ప్రభాస్ మొహాన్ని చూపించిన వైనం అసలు హైలైట్ గా నిలిచింది. షెల్డన్ ఛావ్ ఛాయాగ్రహణం, స్టీఫెన్ దేవస్సి నేపధ్య సంగీతం సాంకేతికంగా ఎలివేట్ చేయడానికి ఉపయోగపడ్డాయి. కథ పరంగా దాచడానికి అవకాశం తక్కువ కాబట్టి కన్నప్ప టీమ్ విజువల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. అడవి సెటప్, కోయదుస్తుల్లో తారాగణం, యుద్దాలు వగైరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
రెండో టీజర్ తో కన్నప్ప లెక్క మారిపోయిందని చెప్పాలి. ఎక్స్ ట్రాడినరి అనకపోయినా ట్రైలర్ కు ముందు బజ్ కోసం సరిపడా కంటెంట్ ఇచ్చేసింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ డివోషనల్ డ్రామాకు సుమారు వంద కోట్లకు పైగా బడ్జెట్ అయ్యిందని ఇన్ సైడ్ టాక్. బిజినెస్ లో ప్రభాస్ పాత్ర ఎంత కీలకం కానుందో ఇప్పుడీ టీజర్ ని శాంపిల్ గా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 25 విడుదల కాబోతున్న కన్నప్పని కెరీర్ బెస్ట్ గా చేసేందుకు విష్ణు చాలా కష్టపడ్డాడు. స్టార్ క్యాస్టింగ్ ని అతి కష్టం మీద ఒప్పించాడు. ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం కృష్ణంరాజు గారు చేశాక కన్నప్ప మీద వస్తున్న సినిమా ఇదే.
This post was last modified on March 1, 2025 12:58 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…