మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప ప్రమోషన్లలో వేగం పెంచారు. నిన్న ముంబైలో జరిగిన టీజర్ లాంచ్ బాగానే జరిగింది. కానీ బజ్ విషయంలో కన్నప్ప గేరు మార్చాల్సిన టైం వచ్చేసిందని చెప్పాలి. ఎందుకంటే విడుదల తేదీ ఏప్రిల్ 25 కి ఇంకో 45 రోజుల టైం మాత్రమే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్, ట్రైలర్ లాంచ్, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, మీడియా ఇంటరాక్షన్లు అన్నీ ఇందులోనే అయిపోవాలి. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ క్యామియో చేస్తే ఈపాటికి అంచనాలు ఆకాశాన్ని దాటాలి. కానీ పబ్లిసిటీ కంటెంట్ లో ఆశించిన క్వాలిటీ లేకపోవడం వల్లే హైప్ రావడం లేదన్నది ఓపెన్ కామెంట్.
దీని మీద విష్ణు దృష్టి పెట్టాలి. ఎంత భక్తి భరిత సినిమా అయినప్పటికీ కన్నప్పలో ఆబాలగోపాలాన్ని అలరించే అంశాలకు కొదవ లేదు. వాటిని సరైన రీతిలో ప్రేక్షకుల మెదళ్లలో రిజిస్టర్ చేయాలి. కథ రివీల్ అవుతుందేమోననే భయం అక్కర్లేదు. ఎందుకంటే కన్నప్పది అందరికీ తెలిసిన గాథే. కృష్ణంరాజుగారి భక్త కన్నప్ప చూసినా ఆయన గొప్పదనం గురించి పూర్తి అవగాహన వచ్చేస్తుంది. అలాంటప్పుడు స్టోరీ లీక్స్ లాంటి ఇబ్బంది లేదు. పైగా పాత వెర్షన్ లో లేని చాలా మార్పులు ఇందులో పొందుపరిచామని విష్ణు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. సో కొత్తగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ లాంటి దిగ్గజాలు నటించిన కన్నప్పకు నార్త్ మార్కెట్ చాలా ముఖ్యం. అసలే ఈ ఏడాది కుంభమేళా జరిగింది. జనాలు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు. కన్నప్ప లాంటి సినిమాలకు ఇదే మంచి టైం. ఆడియన్స్ మూడ్ ని సరిగ్గా కనెక్ట్ చేసుకోగలిగితే థియేటర్లకు వచ్చేస్తారు. కానీ అది ఉందనే సంగతి వాళ్లకు ప్రమోషన్ల ద్వారా తెలియపరచాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేయాలనే దాని మీద విష్ణు టీమ్ తర్జనభర్జన పడుతోందట. పుష్ప 2 తరహాలో ఎక్కడ చేసినా భారీ రీచ్ వచ్చేలా పలు ఆప్షన్లు చూస్తున్నారని సమాచారం. ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.
This post was last modified on February 28, 2025 9:32 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…