మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప ప్రమోషన్లలో వేగం పెంచారు. నిన్న ముంబైలో జరిగిన టీజర్ లాంచ్ బాగానే జరిగింది. కానీ బజ్ విషయంలో కన్నప్ప గేరు మార్చాల్సిన టైం వచ్చేసిందని చెప్పాలి. ఎందుకంటే విడుదల తేదీ ఏప్రిల్ 25 కి ఇంకో 45 రోజుల టైం మాత్రమే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్, ట్రైలర్ లాంచ్, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, మీడియా ఇంటరాక్షన్లు అన్నీ ఇందులోనే అయిపోవాలి. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ క్యామియో చేస్తే ఈపాటికి అంచనాలు ఆకాశాన్ని దాటాలి. కానీ పబ్లిసిటీ కంటెంట్ లో ఆశించిన క్వాలిటీ లేకపోవడం వల్లే హైప్ రావడం లేదన్నది ఓపెన్ కామెంట్.
దీని మీద విష్ణు దృష్టి పెట్టాలి. ఎంత భక్తి భరిత సినిమా అయినప్పటికీ కన్నప్పలో ఆబాలగోపాలాన్ని అలరించే అంశాలకు కొదవ లేదు. వాటిని సరైన రీతిలో ప్రేక్షకుల మెదళ్లలో రిజిస్టర్ చేయాలి. కథ రివీల్ అవుతుందేమోననే భయం అక్కర్లేదు. ఎందుకంటే కన్నప్పది అందరికీ తెలిసిన గాథే. కృష్ణంరాజుగారి భక్త కన్నప్ప చూసినా ఆయన గొప్పదనం గురించి పూర్తి అవగాహన వచ్చేస్తుంది. అలాంటప్పుడు స్టోరీ లీక్స్ లాంటి ఇబ్బంది లేదు. పైగా పాత వెర్షన్ లో లేని చాలా మార్పులు ఇందులో పొందుపరిచామని విష్ణు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. సో కొత్తగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ లాంటి దిగ్గజాలు నటించిన కన్నప్పకు నార్త్ మార్కెట్ చాలా ముఖ్యం. అసలే ఈ ఏడాది కుంభమేళా జరిగింది. జనాలు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు. కన్నప్ప లాంటి సినిమాలకు ఇదే మంచి టైం. ఆడియన్స్ మూడ్ ని సరిగ్గా కనెక్ట్ చేసుకోగలిగితే థియేటర్లకు వచ్చేస్తారు. కానీ అది ఉందనే సంగతి వాళ్లకు ప్రమోషన్ల ద్వారా తెలియపరచాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేయాలనే దాని మీద విష్ణు టీమ్ తర్జనభర్జన పడుతోందట. పుష్ప 2 తరహాలో ఎక్కడ చేసినా భారీ రీచ్ వచ్చేలా పలు ఆప్షన్లు చూస్తున్నారని సమాచారం. ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.
This post was last modified on February 28, 2025 9:32 am
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…