ప్రస్తుతం సౌత్ ఇండియా అనే కాక, ఇండియా మొత్తంలో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. ఐతే తమన్ మన ప్రేక్షకులకు ముందు సంగీత దర్శకుడిగా కంటే నటుడిగా పరిచయం. అతను శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ మూవీ బాయ్స్లో లీడ్ యాక్టర్స్లో ఒకటిగా నటించిన సంగతి తెలిసిందే. అందులో అతడి కామెడీ బాగానే పండింది. కానీ తమన్ తర్వాత నటుడిగా కనిపించలేదు. అలా అని అతడికేమీ అవకాశాలు ఆగిపోలేదు. బోలెడన్ని ఛాన్సులు వచ్చాయట. 7-జి బృందావన కాలనీ సహా పలు చిత్రాల్లో అవకాశాలు వచ్చినా తమన్ నటించలేదట. ఈ విషయంలో దర్శకుడు శంకర్ తనను తిట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో తమన్ వెల్లడించాడు.
సంగీత దర్శకుడిగా స్థిరపడాలన్న ఉద్దేశంతోనే నటుడిగా అవకాశాలను వదులుకున్నట్లు తమన్ తెలిపాడు. బాయ్స్ సినిమా తర్వాత నాకు చాలా ఛాన్సులు వచ్చాయి. 7-జి బృందావన కాలనీ కోసం అడిగారు. ఇంకా విజయ్, సూర్య.. ఇలా పెద్ద పెద్ద స్టార్ల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ వేటినీ నేను ఒప్పుకోలేదు. ఇది తెలిసి శంకర్ గారు ఫోన్ చేసి తిట్టారు. నీకు మంచి బ్రేక్ ఇస్తే.. అన్ని ఛాన్సులు వచ్చినా ఎందుకు వదిలేస్తున్నావు అని అడిగారు. నేను 25 ఏళ్ల వయసు వచ్చేసరికి సంగీత దర్శకుడు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
నటుడిగా సినిమాలు ఒప్పుకుంటే నా లక్ష్యం నెరవేరదు అనిపించింది. నా ఫోకస్ మ్యూజిక్ మీదే ఉండాలనుకున్నా. బాయ్స్ సినిమా చేయడానికి కూడా కారణం ఉంది. అది శంకర్, ఏఆర్ రెహమాన్, ఏఎం రత్నం లాంటి లెజెండ్స్ కలిసి చేసిన సినిమా. అలాంటి గొప్ప వాళ్లతో కలిసి పని చేస్తే సంగీత దర్శకుడిగా నా కెరీర్కు ఉపయోగపడుతుందని అనుకున్నా. అంతే తప్ప నటనలో కొనసాగాలని అనుకోలేదు అని తమన్ తెలిపాడు. ఈ సందర్భంగా బాయ్స్ సినిమాకు అత్యధిక పారితోషకం అందుకుంది తానే అని.. హీరో సిద్దార్థ్ కంటే తనకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారని తమన్ వెల్లడించాడు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…