గత మూడు నాలుగు నెలలుగా ఇండస్ట్రీని తీవ్రంగా పట్టి పీడిస్తున్న హెచ్డి పైరసీ రోజురోజుకు పేట్రేగిపోతోంది తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా మూడో వారంలో అడుగు పెట్టిన ఛావా 4K ప్రింట్ ఆన్ లైన్లో లీకైపోవడం బయ్యర్లలో ఆందోళన రేపుతోంది. నాలుగు వందల కోట్లు దాటేసి అర సహస్రం వైపు పరుగులు పెడుతున్న ఈ బ్లాక్ బస్టర్ కనీసం ఇంకో నెల రోజులు బలమైన థియేటర్ రన్ దక్కించుకుంటుందని బయ్యర్ వర్గాలు అంచనా వేశాయి. కానీ ఇప్పుడీ క్వాలిటీ లీక్ వల్ల వసూళ్లు తీవ్రంగా ప్రభావితం చెందబోతున్నాయి. ఇదే సమస్య గేమ్ ఛేంజర్, తండేల్, డాకు మహారాజ్ కు సైతం వచ్చింది.
ఇవి తెలుగు సినిమాలు కాబట్టి సమస్యని తీవ్రంగా తీసుకోకపోయి ఉండొచ్చు. కానీ ఛావా అలా కాదుగా. సో ఇకనైనా పెద్దలు మేల్కోవాల్సిన టైం వచ్చింది. ప్రభుత్వం, పరిశ్రమ రెండు వైపులా దీన్ని అణిచివేసే దిశగా అడుగులు పడాలి. ఆ మధ్య నిర్మాత బన్నీ వాస్ తండేల్ పైరసీ చేసిన వాళ్ళ మీద తీవ్ర చర్యలుంటాయని ప్రకటించారు కానీ అవేవి ఆశించిన ఫలితం ఇచ్చినట్టు లేవు. ఈ భూతాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళకు భయం కలిగేలా చట్టపరంగా ఏదైనా చేయూత ఉంటే తప్ప ఏం చేయలేమని ప్రొడ్యూసర్లు భావిస్తున్న తరుణంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చాలా అవసరం. దానికి ఎవరు చొరవ తీసుకుంటారనేది ముఖ్యం.
మొదటి రోజు కెమెరా ప్రింట్లు బయటికి రావడం ఎప్పటి నుంచో ఉన్నదే. దాని వల్ల అంతగా ముప్పు లేదని భావించి ఇండస్ట్రీ మరీ సీరియస్ గా తీసుకోలేదు. కానీ హెచ్డి పైరసీని అంత ఆషామాషీగా తీసుకోవడానికి లేదు. ముఖ్యంగా ఛావా లాంటివి ఇతర భాషల్లో డబ్బింగ్ చేసుకుని వెళుతున్న తరుణంలో ఈ పరిణామాలు ఖచ్చితంగా ఫలితాలను ప్రభావితం చేస్తాయి. విదేశాల్లో ఉన్న నేరస్థులను టెక్నాలజీ వాడి పసిగట్టే వ్యవస్థ ఉన్న రోజుల్లో పైరసీ మూలం అంతు చిక్కకపోవడం రహస్యమే. వీలైనంత త్వరగా ఈ మహమ్మారికి మందు కనుక్కోవాలి. లేదంటే భవిష్యత్ ప్యాన్ ఇండియా సినిమాలకూ ఈ జబ్బు పాకుతుంది.
This post was last modified on February 27, 2025 4:49 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…