గత మూడు నాలుగు నెలలుగా ఇండస్ట్రీని తీవ్రంగా పట్టి పీడిస్తున్న హెచ్డి పైరసీ రోజురోజుకు పేట్రేగిపోతోంది తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా మూడో వారంలో అడుగు పెట్టిన ఛావా 4K ప్రింట్ ఆన్ లైన్లో లీకైపోవడం బయ్యర్లలో ఆందోళన రేపుతోంది. నాలుగు వందల కోట్లు దాటేసి అర సహస్రం వైపు పరుగులు పెడుతున్న ఈ బ్లాక్ బస్టర్ కనీసం ఇంకో నెల రోజులు బలమైన థియేటర్ రన్ దక్కించుకుంటుందని బయ్యర్ వర్గాలు అంచనా వేశాయి. కానీ ఇప్పుడీ క్వాలిటీ లీక్ వల్ల వసూళ్లు తీవ్రంగా ప్రభావితం చెందబోతున్నాయి. ఇదే సమస్య గేమ్ ఛేంజర్, తండేల్, డాకు మహారాజ్ కు సైతం వచ్చింది.
ఇవి తెలుగు సినిమాలు కాబట్టి సమస్యని తీవ్రంగా తీసుకోకపోయి ఉండొచ్చు. కానీ ఛావా అలా కాదుగా. సో ఇకనైనా పెద్దలు మేల్కోవాల్సిన టైం వచ్చింది. ప్రభుత్వం, పరిశ్రమ రెండు వైపులా దీన్ని అణిచివేసే దిశగా అడుగులు పడాలి. ఆ మధ్య నిర్మాత బన్నీ వాస్ తండేల్ పైరసీ చేసిన వాళ్ళ మీద తీవ్ర చర్యలుంటాయని ప్రకటించారు కానీ అవేవి ఆశించిన ఫలితం ఇచ్చినట్టు లేవు. ఈ భూతాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళకు భయం కలిగేలా చట్టపరంగా ఏదైనా చేయూత ఉంటే తప్ప ఏం చేయలేమని ప్రొడ్యూసర్లు భావిస్తున్న తరుణంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చాలా అవసరం. దానికి ఎవరు చొరవ తీసుకుంటారనేది ముఖ్యం.
మొదటి రోజు కెమెరా ప్రింట్లు బయటికి రావడం ఎప్పటి నుంచో ఉన్నదే. దాని వల్ల అంతగా ముప్పు లేదని భావించి ఇండస్ట్రీ మరీ సీరియస్ గా తీసుకోలేదు. కానీ హెచ్డి పైరసీని అంత ఆషామాషీగా తీసుకోవడానికి లేదు. ముఖ్యంగా ఛావా లాంటివి ఇతర భాషల్లో డబ్బింగ్ చేసుకుని వెళుతున్న తరుణంలో ఈ పరిణామాలు ఖచ్చితంగా ఫలితాలను ప్రభావితం చేస్తాయి. విదేశాల్లో ఉన్న నేరస్థులను టెక్నాలజీ వాడి పసిగట్టే వ్యవస్థ ఉన్న రోజుల్లో పైరసీ మూలం అంతు చిక్కకపోవడం రహస్యమే. వీలైనంత త్వరగా ఈ మహమ్మారికి మందు కనుక్కోవాలి. లేదంటే భవిష్యత్ ప్యాన్ ఇండియా సినిమాలకూ ఈ జబ్బు పాకుతుంది.
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…