మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం.. కన్నప్ప. టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్లో ఒకటైన ‘భక్త కన్నప్ప’ను నేటి తరానికి అందించాలని మోహన్ బాబు, విష్ణు ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటూ వచ్చారు. ఎట్టకేలకు గత ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని ఏప్రిల్ 25న ‘కన్నప్ప’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా మూవీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్న విష్ణు అండ్ టీం.. తాజాగా ముంబయిలో అడుగు పెట్టింది. ఈ సినిమాలో శివుడి పాత్ర పోషించిన అక్షయ్ కుమార్ సైతం టీంతో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తనను శివుడి పాత్ర కోసం విష్ణు, మోహన్ బాబు ఒకటికి రెండుసార్లు సంప్రదించినా రిజెక్ట్ చేసిన మాట వాస్తవమే అని అక్షయ్ కుమార్ అంగీకరించాడు. ఒక దశలో విష్ణు, మోహన్ బాబు ఎన్నోసార్లు కాల్ చేసినా.. తాను స్పందించలేదని.. అందుకు బిజీగా ఉండడమే కారణమని అక్షయ్ తెలిపాడు. ఐతే వీళ్లిద్దరూ తర్వాత నేరుగా తన ఆఫీసుకు వచ్చి కలిసి మాట్లాడారని.. ఈ సందర్భంలో విష్ణు నిజాయితీ నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని అక్షయ్ వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో విష్ణు మాట్లాడుతూ.. ఈ తరానికి శివుడు అంటే అక్షయ్ కుమారే అని.. అందుకే ఆయన్ని ఈ పాత్రలో నటింపజేశామని అన్నాడు.
అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్ తమ సినిమాలో నటించాడంటే అది మోహన్ బాబు గారి వల్లే సాధ్యమైందని.. ఆయన కొడుకును కాబట్టే తన సినిమాలో అక్షయ్ నటించాడని చెప్పాడు. ఈ సినిమాలో నటించాక తనలో వ్యక్తిత్వ పరంగా చాలా మార్పు వచ్చిందని.. ఇప్పుడు ఉన్నతంగా ఆలోచిస్తున్నానని విష్ణు అన్నాడు. ఈ మూవీలో అక్షయ్, మోహన్ లాల్, ప్రభాస్.. ఇలా అందరూ అద్భుతంగా నటించారని.. సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నామని విష్ణు చెప్పాడు.
This post was last modified on February 27, 2025 4:44 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…