B25_25594_R James Bond (Daniel Craig) prepares to shoot in NO TIME TO DIE an EON Productions and Metro Goldwyn Mayer Studios film Credit: Nicola Dove © 2020 DANJAQ, LLC AND MGM. ALL RIGHTS RESERVED.
కరోనా దెబ్బ థియేటర్లపై మామూలుగా పడలేదు. ప్రపంచ వ్యాప్తంగా నెలల తరబడి థియేటర్లు మూతపడ్డాయి. ఇండియా సహా చాలా దేశాల్లో ఇప్పటికీ మెజారిటీ థియేటర్లు తెరుచుకోలేదు. పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడతాయన్న ఆశలేమీ కనిపించడం లేదు. దీంతో ఓటీటీల జోరు యధావిధిగా కొనసాగుతోంది. థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు లభించాక ఓటీటీల రిలీజ్ల సంఖ్య మరింత పెరగడం గమనార్హం. ఇది ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ఒరవడి.
కొన్ని నెలల కిందటి వరకు ఎక్కువగా చిన్న సినిమాలే ఓటీటీల్లోకి వచ్చేవి కానీ.. ఈ మధ్య భారీ సినిమాలు కూడా వరుస కట్టేస్తున్నాయి. తమిళ, తెలుగు భాషల్లో సూర్య సినిమా ‘సూరారై పొట్రు’.. హిందీలో ‘లక్ష్మీబాంబ్’ లాంటి భారీ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇదిలా ఉండగా.. ఓ భారీ హాలీవుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతోందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.
ఆ సినిమానే.. నో టైమ్ టు డైం. జేమ్స్ బాండ్ సిరీస్లో రాబోతున్న కొత్త చిత్రమిది. డేనియెల్ క్రెయిగ్ ఇందులో బాండ్ పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వచ్చి అడ్డం పడింది. నవంబరుకు రిలీజ్ డేట్ మార్చినా ఫలితం లేకపోయింది. పరిస్థితులు మెరుగపడలేదు. ఈ మధ్యే మరోసారి సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 2కు కొత్త డేట్ ఇచ్చారు. దానికి అందరూ ఫిక్సయి ఉండగా.. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకునేందుకు యాపిల్ టీవీ, నెట్ ఫ్లిక్స్ లాంటి పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇందుకోసం రూ.4 వేల కోట్లకు పైగానే ఖర్చు చేయడానికి ముందుకొచ్చాయి. ఐతే మామూలు రోజుల్లో అయితే బాండ్ సినిమాకు మంచి టాక్ వస్తే ఈజీగా ఆరేడు వేల కోట్ల రూపాయలు వసూలవుతాయి. కానీ నోలన్ సినిమా ‘టెనెట్’ ఫలితం చూశాక థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూడటం కన్నా పెట్టుబడి మీద కొంత లాభానికి ఓటీటీకి అమ్మేయడం మేలన్న అభిప్రాయానికి నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం ప్రపంచ సినీ రంగంలో ఓ సంచలనం అయ్యే అవకాశముంది.
This post was last modified on October 25, 2020 8:12 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…