B25_25594_R James Bond (Daniel Craig) prepares to shoot in NO TIME TO DIE an EON Productions and Metro Goldwyn Mayer Studios film Credit: Nicola Dove © 2020 DANJAQ, LLC AND MGM. ALL RIGHTS RESERVED.
కరోనా దెబ్బ థియేటర్లపై మామూలుగా పడలేదు. ప్రపంచ వ్యాప్తంగా నెలల తరబడి థియేటర్లు మూతపడ్డాయి. ఇండియా సహా చాలా దేశాల్లో ఇప్పటికీ మెజారిటీ థియేటర్లు తెరుచుకోలేదు. పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడతాయన్న ఆశలేమీ కనిపించడం లేదు. దీంతో ఓటీటీల జోరు యధావిధిగా కొనసాగుతోంది. థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు లభించాక ఓటీటీల రిలీజ్ల సంఖ్య మరింత పెరగడం గమనార్హం. ఇది ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ఒరవడి.
కొన్ని నెలల కిందటి వరకు ఎక్కువగా చిన్న సినిమాలే ఓటీటీల్లోకి వచ్చేవి కానీ.. ఈ మధ్య భారీ సినిమాలు కూడా వరుస కట్టేస్తున్నాయి. తమిళ, తెలుగు భాషల్లో సూర్య సినిమా ‘సూరారై పొట్రు’.. హిందీలో ‘లక్ష్మీబాంబ్’ లాంటి భారీ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇదిలా ఉండగా.. ఓ భారీ హాలీవుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతోందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.
ఆ సినిమానే.. నో టైమ్ టు డైం. జేమ్స్ బాండ్ సిరీస్లో రాబోతున్న కొత్త చిత్రమిది. డేనియెల్ క్రెయిగ్ ఇందులో బాండ్ పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వచ్చి అడ్డం పడింది. నవంబరుకు రిలీజ్ డేట్ మార్చినా ఫలితం లేకపోయింది. పరిస్థితులు మెరుగపడలేదు. ఈ మధ్యే మరోసారి సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 2కు కొత్త డేట్ ఇచ్చారు. దానికి అందరూ ఫిక్సయి ఉండగా.. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకునేందుకు యాపిల్ టీవీ, నెట్ ఫ్లిక్స్ లాంటి పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇందుకోసం రూ.4 వేల కోట్లకు పైగానే ఖర్చు చేయడానికి ముందుకొచ్చాయి. ఐతే మామూలు రోజుల్లో అయితే బాండ్ సినిమాకు మంచి టాక్ వస్తే ఈజీగా ఆరేడు వేల కోట్ల రూపాయలు వసూలవుతాయి. కానీ నోలన్ సినిమా ‘టెనెట్’ ఫలితం చూశాక థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూడటం కన్నా పెట్టుబడి మీద కొంత లాభానికి ఓటీటీకి అమ్మేయడం మేలన్న అభిప్రాయానికి నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం ప్రపంచ సినీ రంగంలో ఓ సంచలనం అయ్యే అవకాశముంది.
This post was last modified on October 25, 2020 8:12 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…