బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సునామిలా విరుచుకుపడిన చావా ఇప్పటికే మూడు వందల కోట్ల మార్కుని దాటేసి అయిదు వందల వైపు పరుగులు పెడుతోంది. ఇంకో వారంలోపే ఆ లాంఛనం పూర్తయ్యేలా ఉంది. అయితే దీని డబ్బింగ్ వెర్షన్ల కోసం ప్రేక్షకుల నుంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటిదాకా ఆ దిశగా నిర్మాణ సంస్థ చొరవ తీసుకోకపోవడం అసంతృప్తిని కలిగించింది. ఫైనల్ గా వాళ్ళ కోరికను తీరుస్తూ మార్చి 7 తెలుగు డబ్బింగ్ ని గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. గతంలో కాంతారని పంపిణి చేసింది ఈ సంస్థే. కాబట్టి థియేటర్ కౌంట్ పరంగా మంచి నెంబర్ దక్కబోతోంది.
మూడో వారంలో అనువాదమంటే వసూళ్లు మరీ భారీగా ఆశించలేం కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే గతంలో ఇలాంటి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సైరా, గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి లాంటివి విజయం సాధించాయి కానీ రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో కాదు. పైగా అవి తెలుగు వీరుల గాథలే అయినా మన పబ్లిక్ కి అంతగా ఎక్కలేదు. మరి మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథని చూస్తారా అంటే చెప్పలేం. ఇప్పటికే ఒరిజినల్ వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆడింది. కీలక కేంద్రాల్లో పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చాయి.
చావా తెలుగు వెర్షన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతాడనే పుకారు పుట్టినది కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. కాకపోతే రష్మిక మందన్న స్వంతంగా చెప్పుకుంటుందో లేదో చూడాలి. ఇప్పటికీ బుకింగ్స్ పరంగా జోరుగా ఉన్న చావా పదమూడో రోజు సైతం గంటకు ముప్పై వేలకు పైగా టికెట్లు అమ్ముతూ టాప్ ట్రెండింగ్ లో ఉంది. మంచి టాక్ వచ్చినా ఇతర బాషల కొత్త రిలీజులు ఎన్ని ఉన్నా చావానే టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. విక్కీ కౌశల్ ని స్టార్ లీగ్ లోకి తీసుకెళ్లిన చావా మనోళ్లకు ఎలా కనెక్ట్ అవ్వబోతోందో చూడాలి.
This post was last modified on February 27, 2025 7:43 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…