బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సునామిలా విరుచుకుపడిన చావా ఇప్పటికే మూడు వందల కోట్ల మార్కుని దాటేసి అయిదు వందల వైపు పరుగులు పెడుతోంది. ఇంకో వారంలోపే ఆ లాంఛనం పూర్తయ్యేలా ఉంది. అయితే దీని డబ్బింగ్ వెర్షన్ల కోసం ప్రేక్షకుల నుంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటిదాకా ఆ దిశగా నిర్మాణ సంస్థ చొరవ తీసుకోకపోవడం అసంతృప్తిని కలిగించింది. ఫైనల్ గా వాళ్ళ కోరికను తీరుస్తూ మార్చి 7 తెలుగు డబ్బింగ్ ని గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. గతంలో కాంతారని పంపిణి చేసింది ఈ సంస్థే. కాబట్టి థియేటర్ కౌంట్ పరంగా మంచి నెంబర్ దక్కబోతోంది.
మూడో వారంలో అనువాదమంటే వసూళ్లు మరీ భారీగా ఆశించలేం కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే గతంలో ఇలాంటి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సైరా, గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి లాంటివి విజయం సాధించాయి కానీ రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో కాదు. పైగా అవి తెలుగు వీరుల గాథలే అయినా మన పబ్లిక్ కి అంతగా ఎక్కలేదు. మరి మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథని చూస్తారా అంటే చెప్పలేం. ఇప్పటికే ఒరిజినల్ వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆడింది. కీలక కేంద్రాల్లో పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చాయి.
చావా తెలుగు వెర్షన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతాడనే పుకారు పుట్టినది కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. కాకపోతే రష్మిక మందన్న స్వంతంగా చెప్పుకుంటుందో లేదో చూడాలి. ఇప్పటికీ బుకింగ్స్ పరంగా జోరుగా ఉన్న చావా పదమూడో రోజు సైతం గంటకు ముప్పై వేలకు పైగా టికెట్లు అమ్ముతూ టాప్ ట్రెండింగ్ లో ఉంది. మంచి టాక్ వచ్చినా ఇతర బాషల కొత్త రిలీజులు ఎన్ని ఉన్నా చావానే టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. విక్కీ కౌశల్ ని స్టార్ లీగ్ లోకి తీసుకెళ్లిన చావా మనోళ్లకు ఎలా కనెక్ట్ అవ్వబోతోందో చూడాలి.
This post was last modified on February 27, 2025 7:43 am
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…