సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే, ధమాకా చిత్రాలతో వరుస హిట్లు కొట్టిన దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఆయన్నుంచి రాబోతున్న కొత్త చిత్రం.. మజాకా. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో త్రినాథరావు చేసిన వ్యాఖ్యల మీద పెద్ద దుమారమే రేగింది. ఈ చిత్రంతోనే టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చిన మన్మథుడు హీరోయిన్ అన్షును ఉద్దేశించి మాట్లాడుతూ.. కొంచెం బరువు పెరగాలని, సైజులు పెంచాలని.. లేకుంటే తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరని త్రినాథ రావు చేసిన కామెంట్ వివాదానికి దారి తీసింది. దీని మీద సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో త్రినాథరావు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా తన వ్యాఖ్యలపై త్రినాతరావు మరోసారి స్పందించాడు. తాను ఉద్దేశవపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని.. తెలియక జరిగిన తప్పు అదని ఆయన వ్యాఖ్యానించాడు. ఈ వివాదం తన కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టినట్లు త్రినాథరావు వెల్లడించాడు. ”నేను కావాలని ఆ కామెంట్స్ చేయలేదు. అక్కడున్న మీడియా వాళ్లను నవ్వించాలని అలా మాట్లాడా. కావాలని చేస్తే అది తప్పు అవుతుంది. తప్పు చేసినపుడు ఏ శిక్షకైనా సిద్ధమే. తర్వాత ఆలోచిస్తే నేను మాట్లాడింది కరెక్ట్ కాదు కదా అని నాకే అనిపించింది. అందుకే సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశాను.
నిజానికి నేనేం మాట్లాడానో అన్షుకు అర్థం కాలేదు. దీని మీద వివాదం చెలరేగడంతో ఏం జరిగిందో ఫోన్ చేసి అడిగి తెలుసుకుంది. విషయం మొత్తం తనకు వివరించా. ఆమె అర్థం చేసుకుంది. ఈ గొడవ వల్ల మా అమ్మ బాగా డిస్టర్బ్ అయింది. ఒక్క మాటతో మంచి పేరు చెడిందని ఆవేదన చెందింది. ఇన్నాళ్లు కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నావు, ఎందుకు నాన్నా నోరు జారావు అని అడిగింది. ఇకపై జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఆమె వారం రోజుల పాటు దీని గురించి బాధ పడుతూనే ఉంది. ఆమె ఏమైపోతుందో అని నేను టెన్షన్ పడ్డా. ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నా” అని త్రినాథరావు వివరించాడు.
This post was last modified on February 24, 2025 9:19 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…