సౌత్ ఇండియాలో ఓటీటీ రిలీజ్కు రెడీ అయిన అతి పెద్ద సినిమా అంటే.. ‘ఆకాశం నీ హద్దురా’నే. తమిళంలో ‘సూరారై పొట్రు’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య కథానాయకుడిగా నటించగా.. తెలుగమ్మాయి సుధ కొంగర డైరెక్ట్ చేసింది. ఎయిర్ డెక్కన్ ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఈ నెల 30న అమేజాన్ ప్రైమ్లో ఈ సినిమా రిలీజ్ కావాల్సింది.
ఐతే ఈ సినిమాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) రాకపోవడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు సూర్య ఇటీవలే ప్రకటించాడు. సినిమా తెరకెక్కింది ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో అన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ మధ్యే విడుదలైన జాన్వి కపూర్ సినిమా ‘గుంజన్ సక్సేనా’లో ఎయిర్ ఫోర్స్ అధికారులను నెగెటివ్గా చూపించిన నేపథ్యంలో సూర్య సినిమా మీద ప్రత్యేకంగా దృష్టిసారించారు. దీంతో ఎన్వోసీ జారీ చేయడంలో ఆలస్యం జరిగింది. అందుకే విడుదల వాయిదా పడింది.
ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఎయిర్ ఫోర్స్ నుంచి ఎన్వోసీ వచ్చేసిందట. సినిమా విడుదలకు ఇక అడ్డంకులు తొలగిపోయినట్లే. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రెడీగా ఉందీత చిత్రం. మరి యథాప్రకారం అక్టోబరు 30న సినిమాను విడుదల చేస్తారా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు. సూర్య ఆలోచన ఇప్పుడు వేరుగా ఉందని.. తమిళులకు అతి పెద్ద పండుగల్లో ఒకటైన దీపావళిని పురస్కరించుకుని నవంబరు రెండో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేద్దామా అని యోచిస్తున్నాడని అంటున్నారు.
ఆ సమయానికే విశాల్ సినిమా ‘చక్ర’ కూడా ఓటీటీ రిలీజ్కు సన్నద్ధమవుతోంది. హిందీ చిత్రం ‘లక్ష్మీ బాంబ్’ కూడా అప్పుడే విడుదలవుతుంది. మరి వాటితో పోటీ ఉన్నప్పటికీ పండుగ రిలీజే మంచిదనుకుంటాడా.. లేక ఇప్పుడు సోలో రిలీజ్కు రెడీ అవుతాడా అన్నది చూడాలి. ఈ చిత్రాన్ని స్వయంగా సూర్యనే నిర్మించిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 24, 2020 1:04 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…