ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ మూవీగా మారే అవకాశమున్న రాజమౌళి-మహేష్ బాబు చిత్రం ఇటీవలే సెట్స్ మీదికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేసినప్పటికీ.. చిత్రీకరణ మొదలు కావడానికి చాలా టైం పట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఐతే ఈ సినిమాకు ముహూర్త వేడుకను సీక్రెట్గా చేసిన చిత్ర బృందం.. సినిమా మొదలైనట్లు అధికారికంగా కూడా ప్రకటించలేదు. ఇక సినిమా గురించి వేరే అప్డేట్ ఏదీ కూడా లేదు.
ఎన్నో ఏళ్ల ఎదురు చూపుల తర్వాత మొదలైన సినిమా గురించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేకపోవడం అభిమానులను ఒకింత నిరాశకు గురి చేసింది. మామూలుగా తన సినిమాలు మొదలయ్యే ముందు, మొదలైన మొదట్లో ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో, అభిమానులతో విశేషాలు పంచుకోవడం రాజమౌళికి అలవాటు అప్పుడే కథాంశం గురించి కూడా ఆయన వెల్లడిస్తారు. కానీ ఇప్పటిదాకా మహేష్ సినిమా గురించి ఏ కబురూ చెప్పలేదు జక్కన్న. ఐతే త్వరలోనే జక్కన్న తన మార్కు ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు సమాచారం. సినిమా ఒక షెడ్యూల్ పూర్తయ్యాక ప్రెస్ మీట్ పెట్టాలని చూస్తున్నారట.
ఈ షెడ్యూల్ అవ్వడానికి ఇంకో నెల రోజుల దాకా టైం పడుతుందట. మార్చి నెలాఖర్లో లేదా ఏప్రిల్లో తమ సినిమా గురించి విలేకరుల సమావేశం నిర్వహించనున్నాడట రాజమౌళి. మహేష్ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనే అవకాశం లేదు. జక్కన్నే నిర్మాతలతో ప్రెస్ మీట్ పెట్టి.. ఈ సినిమా కథాంశం గురించి బ్రీఫింగ్ ఇస్తాడట. ఆ సమయంలోనే ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి కూడా వెల్లడిస్తారు. టెంటేటివ్ రిలీజ్ డేట్ కూడా చెప్పే అవకాశముంది. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 2027లో రిలీజ్ చేసే అవకాశముంది. ఇది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ థ్రిల్లర్ అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి ప్రెస్ మీట్లో జక్కన్న పంచుకునే విశేషాలు ఎలా ఉంటాయో చూడాలి.
This post was last modified on February 23, 2025 5:46 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…