Movie News

ఆస్తుల ఎటాచ్మెంట్… శంకర్ ఏమన్నాడంటే?

తన కెరీర్లో అత్యంత పేలవ దశను ఎదుర్కొంటున్నారు తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్. ఇండియన్-2, గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్లతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇది చాలదని ‘యందిరన్’ (తెలుగులో రోబో) సినిమా కథను కాపీ కొట్టాడంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి వేసిన కాపీ రైట్ కేసు విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చెన్నై జోనల్ కార్యాలయం.. రూ.10 కోట్ల విలువైన శంకర్ ఆస్తులను ఎటాచ్ చేయడం సంచలనం రేపింది. ఈ విషయం బయటికి పొక్కాక రెండు రోజులు శంకర్ మౌనం వహించారు. ఇప్పుడీ వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు.

కోర్టు తీర్పును పక్కన పెట్టి ఈడీ ఇలాంటి చర్యలకు పాల్పడడం తననెంతో బాధించిందని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈడీ చర్యలకు సంబంధించి పలు విషయాలను ప్రేక్షకుల దృష్టికి తేవాలనుకుంటున్నా. ఎందిరన్ సినిమాకు సంబంధించి నిరాధారమైన ఆరోపణలను చూపించి నాకు సంబంధించిన మూడు స్థిరాస్తులను తాత్కాలికంగా ఎటాచ్ చేశారు. ఈ చర్య చట్ట ప్రక్రియ దుర్వినియోగాన్ని సూచిస్తుంది. న్యాయపరమైన వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తుంది. ఎందిరన్ కాపీ రైట్ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు క్షుణ్ణంగా విచారణ జరిపి తీర్పునిచ్చిన విషయాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఆ సినిమాకు సంబంధించి అసలైన హక్కులు తనవే అంటూ అరూర్ తమిళనాథన్ వేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. ఈ కేసుపై ఇప్పటికే కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈడీ నా ఆస్తులను ఎటాచ్ చేసింది. కాపీ రైట్ ఉల్లంఘన జరగలేదని కోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం నన్నెంతో బాధించింది’’ అని శంకర్ పేర్కొన్నాడు. ఈడీ చర్యలపై శంకర్ కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

This post was last modified on February 22, 2025 3:19 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

24 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

47 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

57 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

1 hour ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago