తన కెరీర్లో అత్యంత పేలవ దశను ఎదుర్కొంటున్నారు తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్. ఇండియన్-2, గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్లతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇది చాలదని ‘యందిరన్’ (తెలుగులో రోబో) సినిమా కథను కాపీ కొట్టాడంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి వేసిన కాపీ రైట్ కేసు విషయమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెన్నై జోనల్ కార్యాలయం.. రూ.10 కోట్ల విలువైన శంకర్ ఆస్తులను ఎటాచ్ చేయడం సంచలనం రేపింది. ఈ విషయం బయటికి పొక్కాక రెండు రోజులు శంకర్ మౌనం వహించారు. ఇప్పుడీ వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు.
కోర్టు తీర్పును పక్కన పెట్టి ఈడీ ఇలాంటి చర్యలకు పాల్పడడం తననెంతో బాధించిందని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈడీ చర్యలకు సంబంధించి పలు విషయాలను ప్రేక్షకుల దృష్టికి తేవాలనుకుంటున్నా. ఎందిరన్ సినిమాకు సంబంధించి నిరాధారమైన ఆరోపణలను చూపించి నాకు సంబంధించిన మూడు స్థిరాస్తులను తాత్కాలికంగా ఎటాచ్ చేశారు. ఈ చర్య చట్ట ప్రక్రియ దుర్వినియోగాన్ని సూచిస్తుంది. న్యాయపరమైన వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తుంది. ఎందిరన్ కాపీ రైట్ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు క్షుణ్ణంగా విచారణ జరిపి తీర్పునిచ్చిన విషయాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఆ సినిమాకు సంబంధించి అసలైన హక్కులు తనవే అంటూ అరూర్ తమిళనాథన్ వేసిన పిటిషన్ను కొట్టి వేసింది. ఈ కేసుపై ఇప్పటికే కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈడీ నా ఆస్తులను ఎటాచ్ చేసింది. కాపీ రైట్ ఉల్లంఘన జరగలేదని కోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం నన్నెంతో బాధించింది’’ అని శంకర్ పేర్కొన్నాడు. ఈడీ చర్యలపై శంకర్ కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
This post was last modified on February 22, 2025 3:19 pm
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…