నిన్న రాత్రే భారీ అంచనాల మధ్య అమేజాన్ ప్రైమ్లో రిలీజైంది ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ రెండో సీజన్. రెండేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ‘మీర్జాపూర్’.. బోల్డ్ యాక్షన్ సిరీస్లను ఇష్టపడేవారిని అమితంగా ఆకట్టుకుంది. అందులో వయొలెన్స్, రొమాన్స్, డైలాగ్స్ అన్నీ కూడా చాలా నాటుగా, బోల్డ్గా ఉండి ఆ వర్గం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. దీనికి కొనసాగింపుగా తీసిన సిరీస్ మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. విజయదశమి కానుకగా కొత్త సీజన్ను స్ట్రీమ్ చేసింది అమేజాన్.
తొలి సీజన్కు దీటుగానే రెండో సిరీస్ ఉందని.. మొదటిది నచ్చిన వాళ్లకు రెండోదీ నచ్చుతుందని రివ్యూలు వస్తున్నాయి. ఐతే ఈ సిరీస్ మీద సోషల్ మీడియాలో మాత్రం తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. చాలామంది నెటిజన్లు ఈ సిరీస్ను అమేజాన్లో చూడమంటూ చెప్పి మరీ పైరసీ వెర్షన్ల మీద పడటం గమనార్హం.
ఇందుక్కారణం లేకపోలేదు. ‘మీర్జాపూర్’లో కీలక పాత్ర పోషించిన అలీ ఫైజల్ గత ఏడాది కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతణ్ని యాంటీ నేషనల్గా అభివర్ణించారు హిందూ వాదులు. ఇక అప్పట్నుంచి అతడికి సంబంధించిన ప్రతి విషయాన్నీ బాయ్కాట్ చేయడం మొదలుపెట్టారు.
ఐతే సినిమాలతో పోలిస్తే ‘మీర్జాపూర్’ సిరీస్తోనే అలీకి ఎక్కువ పేరొచ్చింది. పైగా ‘మీర్జాపూర్’ రెండో సీజన్లో అతనే సోల్ హీరో. విక్రమా మాస్సే చేసిన అతడి తమ్ముడి పాత్ర తొలి సీజన్ చివర్లో చనిపోతుంది. రెండో సీజన్ అంతా అలీ చుట్టూనే తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ గురించి కొన్ని రోజుల ముందు నుంచే వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సమయం రాగానే యాంటీస్ రెచ్చిపోతున్నారు. టెలిగ్రామ్ పైరసీ లింక్ను ట్విట్టర్ షేర్ చేసి మరీ పైరసీని ప్రోత్సహిస్తున్నారు. ‘నాకు మీర్జాపూర్ చాలా ఇష్టం. కానీ రెండో సీజన్ను పైరసీలోనే చూస్తా’ అనే టెంప్లేట్ మెసేజ్లు వేలమంది పోస్ట్ చేసి అలీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుండటం, పైరసీని వ్యాప్తి చేస్తుండటం గమనార్హం.
This post was last modified on October 23, 2020 6:41 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…