ప్రభాస్ ట్రూ పాన్ ఇండియా స్టార్ అని మరోసారి రుజువైంది. శుక్రవారం ప్రభాస్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అతడి క్రేజ్ చూసి బాలీవుడ్ వాళ్లు కూడా అసూయ చెందే పరిస్థితి. ఈ రోజు ఉదయం ట్విట్టర్ ట్రెండ్స్ అన్నింటినీ ప్రభాసే ఆక్రమించేశాడు. #happybirthdayprabhas హ్యాష్ ట్యాగ్ నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని చోట్లా టాప్లో ట్రెండ్ అయ్యింది. ప్రభాస్ పేరుతో ముడిపడ్డ మరి కొన్ని హ్యాష్ ట్యాగ్లూ ట్విట్టర్లో హల్చల్ చేశాయి.
ఇక రాధేశ్యామ్ సినిమా నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ కావడంతో దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ మీదా లక్షల్లో ట్వీట్లు పడ్డాయి. వేరే హీరోల అభిమానులు ముందు రోజు సాయంత్రం ట్రెండ్ అలెర్ట్ ఇచ్చి పనిగట్టుకుని ట్వీట్లు వేయడం, రికార్డుల కోసం కొట్టేసుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ ప్రభాస్ విషయంలో ఆ అవసరం లేకుండా దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు, అభిమానులు అతడి పుట్టిన రోజును సెలబ్రేట్ చేశారు. పెద్ద ఎత్తున విషెస్ చెప్పారు.
‘బాహుబలి’తో ఒక్కసారిగా అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. ఆ సినిమా విజయంలో ప్రభాస్ ఘనతేమీ లేదని, అంతా రాజమౌళిదే క్రెడిట్ అని ప్రభాస్ను తేలిక చేసేవాళ్లూ లేకపోలేదు. కానీ ‘సాహో’ సినిమాకు కేవలం ప్రభాస్ పేరు మీదే వందల కోట్లు ఖర్చు పెట్టారు. అతడి పేరు మీదే బిజినెస్ జరిగింది. ఫ్లాప్ టాక్ వచ్చినా వందల కోట్లు వసూళ్లు రాబట్టింది. ఐతే అంతిమంగా ఈ సినిమా పరాజయం పాలైన నేపథ్యంలో ప్రభాస్ క్రేజ్ తగ్గి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ పుట్టిన రోజు నాడు ప్రభాస్ పేరు మార్మోగిన తీరు చూస్తే అతడిది చెక్కుచెదరని ఇమేజ్, క్రేజ్ అని అర్థమవుతుంది.
టాలీవుడ్ నుంచి కూడా సినీ ప్రముఖులందరూ తమకు నచ్చినా నచ్చకపోయినా ప్రభాస్ను గుర్తించి విషెస్ చెబుతున్నారంటే అతడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ అభిమానులు కొంచెం అతి చేసి మధ్యలో అతడి మీద కొందరు హీరోల అభిమానుల్లో వ్యతిరేకత తీసుకొచ్చారు కానీ.. నిజానికి ఎంత ఎదిగినా ఒదిగినట్లుండే ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే.
This post was last modified on October 23, 2020 6:31 pm
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…