గత కొన్నేళ్లలో దక్షిణాది సినీ పరిశ్రమలో విడాకుల వార్తలు పెరిగిపోయాయి. నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య, జయం రవి-ఆర్తి, జీవీ ప్రకాష్ కుమార్-సైంధవి.. ఇలా దక్షిణాది ఇండస్ట్రీలో విడిపోయిన జంటలు చాలానే ఉన్నాయి. వీరిలో జీవీ-సైంధవి జంట విడాకులకు తమిళ హీరోయిన్ దివ్యభారతి కారణమంటూ గత ఏడాది సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగింది. .జస్ట్ రూమర్లు రావడం వరకు మామూలే కానీ.. ఈ విషయంలో దివ్యభారతిని తిడుతూ చాలామంది ఆమెకు మెసేజ్లు పంపారట. చాలామంది మహిళలే తనను తిట్టినట్లు దివ్యభారతి వెల్లడించింది.
జీవీ-దివ్యభారతి గతంలో ‘బ్యాచిలర్’ అనే సినిమాలో కలిసి నటించారు. అందులో వాళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. ఇప్పుడు జీవీ-దివ్య కలిసి నటించిన ‘కింగ్ స్టన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవీ, దివ్యభారతి.. ఈ విషయమై మాట్లాడారు. తాను, దివ్యభారతి మంచి స్నేహితులమని, అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని జీవీ ప్రకాష్ స్పష్టం చేశాడు. సినిమా సెట్స్ దాటి బయట తాము కలవనే కలవమని అతను చెప్పాడు. తనకు, సైంధవికి విడాకులు కావడానికి తనే కారణమని సోషల్ మీడియాలో నిందించడం అన్యాయమని అతనన్నాడు.
ఇక దివ్యభారతి మాట్లాడుతూ.. ‘‘నేను, జీవీ కలిసి చేసిన ‘బ్యాచిలర్’లో మా ఇద్దరి కెమిస్ట్రీకి మంచి స్పందన వచ్చింది. కానీ జీవీ, సైంధవి విడాకుల గురించి ప్రకటించినపుడు అందరూ నన్ను నిందించడం మొదలుపెట్టారు. దారుణంగా తిడుతూ మెసేస్లు పెట్టేవారు. విడాకుల తర్వాత కూడా జీవీ, సైంధవి కలిసి మ్యూజికల్ కన్సర్ట్ చేస్తే చాలా సంతోషించాను. ఇక ఆ మెసేజ్లు ఆగిపోతాయనుకున్నా. కానీ తర్వాత కూడా అవి ఆగలేదు. ఇంకా పెరిగాయి.
మహిళలే చాలామంది నన్ను తిట్టేవాళ్లు. కొన్ని మెసేజ్లను జీవీకి ఫార్వర్డ్ చేసేదాన్ని. కానీ ఇవేవీ పట్టించుకోకుండా కెరీర్ మీద దృష్టిపెట్టమని జీవీ చెప్పేవాడు’’ అని చెప్పింది. పని విషయంలో తాను, సైంధవి ఎంతో క్రమశిక్షణతో ఉంటామని, అందుకే విడిపోయాక కూడా కలిసి కన్సర్ట్ చేసి తాము ప్రొఫెషనల్ అని చాటామని జీవి తెలిపాడు.
This post was last modified on February 20, 2025 6:07 pm
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…